అన్వేషించండి

World Cup 2023: ఐసీసీ చరిత్రలో తొలిసారి, స్టేడియానికి 10 లక్షల మంది

ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ రికార్డులకు వేదికగా మారుతోంది. ఇప్పటికే టీవీ, హాట్‌ స్టార్‌ ల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ మహా టోర్నీఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది.

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌... పలు రికార్డులకు వేదికగా మారుతోంది. ఇప్పటికే టీవీ, హాట్‌ స్టార్‌ వీక్షణల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ మహా టోర్నీ... ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకూ జరిగిన ఏ దేశంలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీకి దక్కని రికార్డు భారత్‌ వేదికగా జరిగిన ఎడిషన్‌ దక్కించుకుంది. ఈసారి వన్డే ప్రపంచకప్‌లో స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ చూసిన వీక్షకుల సంఖ్య 10 లక్షలు దాటింది. 
ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌  ICC ఈవెంట్‌ చరిత్రలో ఇలా 10 లక్షల మంది కంటే ఎక్కువ అభిమానులు స్టేడియానికి తరలివచ్చి మ్యాచ్‌ను చూడడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌తో స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ చూసే వారి సంఖ్య పది లక్షలు దాటింది. పది లక్షల మందికి పైగా అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను చూడడం వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గలేదని నిరూపిస్తోందని, ప్రపంచ కప్‌ విలువ ఏంటో తెలియజేస్తోందని ఐసీసీ ఈవెంట్స్‌ అధిపతి క్రిస్‌ టెట్లీ చెప్పాడు. 
 
టీవీ వీక్షణల్లోనూ రికార్డే..
మరోవైపు క్రికెట్‌ ప్రేమికులు కేవలం భారత్‌ ఆడే మ్యాచ్‌లనే కాకుండా వేరే జట్ల మ్యాచ్‌లను కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షిస్తున్నారు. అయితే ప్రపంచకప్‌ మేనియాలో దేశం ఊగిపోతున్న వేళ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. దేశంలో క్రికెట్‌ మేనియాకు ఇదే నిదర్శనమంటూ జై షా ట్వీట్‌ చేశాడు. ప్రపంచకప్‌ను టీవీల్లో వీక్షించే వారి సంఖ్య గత ప్రపంచకప్‌తో పోలిస్తే 43 శాతం వృద్ధి చెందిందని జై షా ట్వీట్‌ చేశాడు. టీవీ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా భారీగా పెరిగిందని వెల్లడించారు. 2019లో ప్రపంచకప్‌తో పోలిస్తే వీక్షణ నిమిషాల్లో 43 శాతం వృద్ధి ఉందని జై షా తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని వివరించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇదో కొత్త రికార్డు అని జైషా ట్వీట్‌లో పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌ను వీక్షించే వారి సంఖ్య 43 శాతం పెరిగిందని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే.. అభిమానులు గతంలో కంటే ఈసారి టీవీకి ఎక్కువగా అతుక్కుపోయారని.. ఇది భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణకు, భారత క్రికెట్ అభిమానుల శక్తికి నిదర్శనమని జై షా ట్వీట్ చేశాడు.
 
ఈ ప్రపంచకప్‌లో మొదటి 18 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని 364.2 మిలియన్ల మంది చూశారని ఐసీసీ తెలిపింది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను టీవీల్లో 76 మిలియన్ల మంది, డిజిటల్‌లో 35 మిలియన్ల మంది వీక్షించారని వెల్లడించింది. అక్టోబరు 22న ధర్మశాలలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. అంటే భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యధికంగా 4.3 కోట్ల మంది వీక్షించారన్న మాట. ప్రపంచ వీక్షకుల సంఖ్యలో ఇది కొత్త రికార్డు. ఆరంభంలో భారత్ వికెట్లు పడినప్పుడు టీమిండియా ఓడిపోతుందేమో అనిపించినా... క్రీజులో విరాట్ కోహ్లీ స్ట్రాంగ్‌గా ఉండడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. చివర్లో మ్యాచ్‌ని చూసేందుకు చాలా మంది యాప్‌లోకి వచ్చారు. దీంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
Andhra Statues Removal: ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
Andhra Pradesh TET 2025: నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
Weather Update: వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
Advertisement

వీడియోలు

OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!
Pakistan vs Sri Lanka Asia Cup 2025 | డూ ఆర్ డై మ్యాచ్ లో స‌త్తా చాటిన పాక్
India vs Bangladesh Preview Asia Cup 2025 | నేడు బాంగ్లాదేశ్ తో తలపడనున్న ఇండియా
Arjun Tendulkar vs Samit Dravid | సమిత్ ద్రవిడ్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్
Abrar Ahmed vs Wanindu Hasaranga Asia Cup 2025 | అహ్మద్ vs హసరంగా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
Andhra Statues Removal: ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
ఏపీలో రోడ్లపై ఉన్న అనధికార విగ్రహాలు తొలగించాలని నిర్ణయం - ఎన్టీఆర్, వైఎస్అర్‌లవీ తొలగిస్తారా ?
Andhra Pradesh TET 2025: నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
నవంబర్‌లో టెట్‌- వచ్చే ఏడాది డీఎస్సీ - మంత్రి లోకేష్ మరో కీలక ప్రకటన 
Weather Update: వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
వారం పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలే వర్షాలు - వాయుగుండం ముప్పు కూడా !
YS Jagan Opposition Status: ప్రజలు ఇవ్వలేదు ఏం చేసినా ప్రయోజనం లేదు! -జగన్ ప్రతిపక్షహోదాపై అయ్యన్న కామెంట్స్ 
ప్రజలు ఇవ్వలేదు ఏం చేసినా ప్రయోజనం లేదు! -జగన్ ప్రతిపక్షహోదాపై అయ్యన్న కామెంట్స్ 
Fake Baba: శారదాపీఠం పేరుతో విద్యార్థులపై లైంగిక వేధింపులు - ఇతను కీచకబాబా
శారదాపీఠం పేరుతో విద్యార్థులపై లైంగిక వేధింపులు - ఇతను కీచకబాబా
Snake Beggig: మెడలో పాము వేసుకొచ్చి బెగ్గింగ్ -ఇవ్వక చస్తారా అన్నట్లుగా బెదిరింపులు- క్లైమాక్స్ ట్విస్ట్
మెడలో పాము వేసుకొచ్చి బెగ్గింగ్ -ఇవ్వక చస్తారా అన్నట్లుగా బెదిరింపులు- క్లైమాక్స్ ట్విస్ట్
OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!
OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!
Embed widget