అన్వేషించండి

IND Vs NED: సగర్వంగా సెమీస్‌లోకి - నెదర్లాండ్స్‌పై టీమిండియా ఘన విజయం

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ లీగ్‌ దశలోని తొమ్మిది మ్యాచ్‌లను గెలిచి.. పూర్తి ఆత్మ విశ్వాసంతో నాకౌట్‌లో అడుగు పెట్టింది.

వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత్‌.... మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లీగ్‌ దశలోని తొమ్మిది మ్యాచ్‌లను గెలిచి.. పూర్తి ఆత్మ విశ్వాసంతో నాకౌట్‌లో అడుగు పెట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు శ్రేయస్స్‌ అయ్యర్‌, రాహుల్‌ శతకాలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏకపక్షంగా గెలిచినా నెదర్లాండ్స్‌ పోరాటం అభిమానులను ఆకట్టుకుంది.  


 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన ఆరంభం నుంచే దూకుడు మంత్రాన్ని జపించింది. శ్రేయస్స్‌ అయ్యర్‌ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో శతక నాదం చేశాడు. మొత్తంగా అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు చివరి ఓవర్‌లో రెండు భారీ సిక్సులతో రాహుల్‌ కూడా సెంచరీ చేశాడు. రాహుల్‌ కేవలం 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. అయ్యర్‌, రాహుల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో టీమిండియా 126 పరుగులు రాబట్టింది.


 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-గిల్‌ భారత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు సరిగ్గా వంద పరుగులు జోడించారు. 11.5 ఓవర్లలోనే వంద పరుగులు జోడించిన టీమిండియా ఓపెనర్లు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి క్రమంగా దూకుడు పెంచిన రోహిత్‌ శర్మ సెంచరీ దిశగా సాగుతున్న వేళ అవుటవ్వడంతో సరిగ్గా వంద పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్‌ 61 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్‌ అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ గిల్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అనంతరం ధాటిగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసిన గిల్‌ 129 పరుగుల వద్ద అవుటయ్యాడు. గిల్‌ 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 51 పరుగులు చేశాడు. 


 అనంతరం కోహ్లీ, శ్రేయస్స్ అయర్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు చూస్తుండగానే స్కోరును 200 పరుగులకు చేర్చారు. సరిగ్గా స్కోరు 200 పరుగులు చేరాక విరాట్ వెనుదిరిగాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో కోహ్లీ 51 పరుగులు చేశాడు. రోహిత్‌ సరిగ్గా వంద పరుగుల వద్ద అవుటవ్వగా... కోహ్లీ సరిగ్గా 200 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. అనంతరం రాహుల్‌తో జత కలిసిన శ్రేయస్స్‌ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌, అయ్యర్‌ పోటీ పడి బౌండరీలు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ భారీ భాగస్వామ్యంతో డచ్‌ బౌలర్లను ఊచకోత కోశారు. అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్‌ కేవలం 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. 


 411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌...47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో ఓవర్‌లోనే డచ్‌ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మాక్స్‌ ఓ డౌడ్‌, ఆకర్‌మన్‌ నెదర్లాండ్స్‌ను ఆదుకున్నారు. ఇద్దరు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ కొద్ది విరామంలోనే వీరిద్దరూ అవుటయ్యారు. కానీ భారత సంతతి  ఆటగాడు తేజ నిడమూరు అర్ధ శతకంతో రాణించాడు. తేజ 54, ఎంగ్రెల్‌ బ్రెచ్‌ 45, ఆకర్‌మన్‌ 35, మాక్స్‌ ఓ డౌడ్‌ 30 పరుగులతో రాణించడంతో నెదర్లాండ్స్‌ 200 పరుగుల మైలురాయిని దాటింది. అ తర్వాత వికెట్లు పడకపోయినా పరుగులు రావడం మందగించింది. దీంతో  47.5 ఓవర్లలో250 పరుగులకు నెదర్సాండ్‌ ఆలౌట్‌ అయింది. దీంతో 160 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్‌ 2, కుల్‌దీప్ 2, జడేజా రెండు వికెట్లు తీశారు. కోహ్లీ, రోహిత్‌  సహా తొమ్మిది మంది బౌలింగ్ వేశారు. రోహిత్‌ ఒక వికెట్‌ కూడా సాధించాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget