News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

WTC 2023 Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

FOLLOW US: 
Share:

WTC 2023 Final IND vs AUS Kennington Oval, London: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్‌లో జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. 
తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమైంది. ఇప్పుడు టీమ్ఇండియా ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. ఫాలోఆన్ కాపాడుకోవాలంటే టీమిండియా ఇంకా 269 పరుగులు చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ ప్రత్యేకంగా జట్టును ఆదుకోలేక ఆసిస్ బౌలర్లకు దాసోహమయ్యారు. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులు మాత్రమే చేసింది. 5 వికెట్లు కూడా కోల్పోయింది. ఈ కారణంగా ఫాలోఆన్ గండం పొంచి ఉంది. ఫాలోఆన్ నుంచి భారత్ బయటపడాలంటే మాత్రం 269 పరుగులు చేయాలి. కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరుగలకు మరో 118 పరుగులు జోడించాలి. ప్రస్తుతం క్రీజ్‌లో అజింక్య రహానె, శ్రీకర్ భరత్ ఉన్నారు. వారిపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది. 

చాలా కాలం తర్వాత రహానే తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. ఇప్పుడు రహానే, భరత్ మాత్రమే ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయగలరు. టీమ్ ఇండియా తరఫున 7 టెస్టు ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు భరత్.. ఈ సమయంలో ఆయన ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు తమను తాము నిరూపించుకునే వారికి వచ్చింది. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగనున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా కంటే 318 పరుగులు వెనుకబడి ఉంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ తర్వాత భారత్ తరఫున రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ దిగారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 26 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అతడిని కమిన్స్ పెవిలియన్‌కు పంపించాడు. శుభ్మన్ 15 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా కూడా పెవిలియన్ చేరాడు. వెటరన్ బ్యాటర్‌ పుజారా 25 బంతుల్లో 14 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం14 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా చాలాసేపు కష్టపడ్డాడు. 51 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. ఈ రకంగా టీమ్ఇండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే వరకు అజింక్య రహానే 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీకర్ భరత్ 5 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

Published at : 09 Jun 2023 07:05 AM (IST) Tags: Team India ROHIT SHARMA IND vs AUS World Test Championship Final

ఇవి కూడా చూడండి

ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్

ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్

ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు

ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు

ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!

ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!

Asian Games 2023: ఆరాధ్య దేవతను చూడటానికి 1200 కిలోమీటర్ల ప్రయాణం - స్మృతి మంధానకు చైనాలో ఫాలోయింగ్

Asian Games 2023: ఆరాధ్య దేవతను చూడటానికి  1200 కిలోమీటర్ల ప్రయాణం - స్మృతి మంధానకు చైనాలో ఫాలోయింగ్

భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?

భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!