అన్వేషించండి

భారీ స్కోరు చేసిన టీమిండియా - అర్థ సెంచరీతో మెరిసిన శ్రేయస్!

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ చివర్లో తడబడ్డా భారీ స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (64: 40 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లు తీసుకున్నాడు. వెస్టిండీస్ విజయానికి 120 బంతుల్లో 189 పరుగులు చేయాలి.

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ ఇషాన్ కిషన్ (11: 13 బంతుల్లో,  ఒక ఫోర్) ఐదో ఓవర్లో అవుటయ్యాడు. అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడాతో (38: 25 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి శ్రేయస్ అయ్యర్ (64: 40 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 76 పరుగులు జోడించారు.

అయితే శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా వరుస ఓవర్లలో అవుటయ్యారు. సంజు శామ్సన్ (15: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), దినేష్ కార్తీక్ (12: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా త్వరగా అవుట్ అయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా (28: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడినా, అవతలి ఎండ్‌లో సరైన సహకారం లభించకపోవడంతో భారత్ చివర్లో తడబడింది.

చివరి ఐదు ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లు దక్కించుకోగా... జేసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, హేడెన్ వాల్ష్ తలో వికెట్ పడగొట్టారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram News: పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
Advertisement

వీడియోలు

West Indies Cricket | ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వెస్ట్ ఇండీస్ ఓ విచిత్రం | ABP Desam
Adilabad Seasonal Fruits : ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ గా లభించే పండ్లు.. ఉపాధి పొందుతున్న ఆదివాసీలు
నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్..  47 ఏళ్ల భారత నిరీక్షణ తీరేనా?
మరి కొద్ది రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్.. కీలక ప్లేయర్ దూరం
అంతర్జాతీయ క్రికెట్‌కి క్రిస్ వోక్స్ వీడ్కోలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram News: పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
పిఠాపురం జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణ‌మేంటి? మ‌ర్రెడ్డి శ్రీ‌నివాస‌రావు మార్పు తప్పదా?
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Kantara Ticket Price In AP: ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
New GST Rates: GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
Konaseema News:కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
Embed widget