అన్వేషించండి

IND vs SL 3rd T20: సూర్య వన్ మ్యాన్ షో- శ్రీలంక ముందు కొండంత లక్ష్యం

శ్రీలంకతో జరుగుతున్న ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. గిల్, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్ లు సమయోచిత ఇన్నింగ్స్ ఆడారు. 


IND vs SL 3rd T20: ఏమా ఆట.. ఏమా షాట్లు.. ఏంటా పరుగులు... టీ20 అంటే ఇలానే ఆడాలి అన్నట్లుగా సూర్యకుమార్ యాదవ్ రాజ్ కోటలో చెలరేగిపోయాడు. గతేడాది ఫాంను కొనసాగిస్తూ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడేశాడు. బంతి ఎక్కడ వేసినా దాని గమ్యం బౌండరీనే అన్నట్లుగా కొట్టాడు. అతని ఆటకు శ్రీలంక బౌలర్లు తలలు పట్టుకుంటే.. ఫీల్డర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన స్కై టీ20ల్లో మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టుకు భారీ స్కోరు అందించాడు. 

రాజ్ కోట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 228 పరుగుల భారీ స్కోరు సాంధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో (51 బంతుల్లో 112 పరుగులు) చెలరేగగా.. గిల్ (36 బంతుల్లో 46), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35) రాణించారు. 

తొలి ఓవర్లోనే షాక్

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ మధుశంక బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గిల్ నెమ్మదిగా ఆడటంతో ఆ తర్వాత 2 ఓవర్లలో ఎక్కువ పరుగులు రాలేదు. అయితే వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి రెచ్చిపోయి ఆడాడు. వచ్చీ రావడంతోనే 2 బౌండరీలు కొట్టిన రాహుల్.. చమిక కరుణరత్నే వేసిన 6వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే అతను ఔటయ్యాడు. పవర్ ప్లే అయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 52 పరుగులు చేసింది. 

సూర్య ప్రతాపం

ఆ తర్వాత ఇంక అంతా సూర్య ప్రతాపమే. వచ్చీ రావడంతోనే బాదుడు మొదలుపెట్టిన సూర్యకుమార్ ఎక్కడా తగ్గలేదు. తన ఇన్నింగ్స్ అంతటా హిట్టింగే హిట్టింగ్. బౌలర్ ఎవరైనా బాదడం మాత్రం ఆపలేదు సూర్య. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన స్కై సెంచరీతో చెలరేగాడు. 25 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన సూర్యకుమార్ మహీశ్ థీక్షణ వేసిన 14వ ఓవర్లో విధ్వంసమే సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6 బాదాడు. గిల్ కూడా ఒక ఫోర్ సాధించటంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అనంతరం హసరంగ బౌలింగ్ లో గిల్ బౌల్డయ్యాడు. గిల్, సూర్య మూడో వికెట్ కు 111 పరుగులు జోడించారు. అనంతరం జోరు పెంచిన సూర్య 41 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు.  51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. మధ్యలో హార్దిక్ పాండ్య (4), దీపక్ హుడా (4) అలా వచ్చి ఇలా వెళ్లారు.  చివర్లో అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21) వేగంగా ఆడాడు. 

శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీసుకున్నాడు. రజిత, కరుణరత్నే, హసరంగా తలా వికెట్ దక్కించుకున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bus Accident: సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Advertisement

వీడియోలు

విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bus Accident: సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
సౌదీలో భారత పర్యాటకుల బస్సు ప్రమాదం.. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్
Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Snowfall Destinations in India : ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
Hyderabad Gold Seized: ఐరన్‌ బాక్స్‌లో రూ.1.55 కోట్ల బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్
ఐరన్‌ బాక్స్‌లో రూ.1.55 కోట్ల బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
Embed widget