అన్వేషించండి

Rohit Sharma: బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్‌ శర్మ ఫైర్‌ - మూడేళ్లలో తొలి సెంచరీ అనడంతో ఆగ్రహం!

Rohit Sharma: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా సమావేశాల్లో సరదాగా ఉంటాడు. విలేకరులతో జోకులు వేస్తుంటాడు. అలాంటిది న్యూజిలాండ్‌తో మూడో వన్డే ముగిశాక బ్రాడ్‌కాస్టర్‌పై ఫైర్‌ అయ్యాడు.

Rohit Sharma:

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా సమావేశాల్లో సరదాగా ఉంటాడు. విలేకరులతో జోకులు వేస్తుంటాడు. అలాంటిది న్యూజిలాండ్‌తో మూడో వన్డే ముగిశాక బ్రాడ్‌కాస్టర్‌పై ఫైర్‌ అయ్యాడు. గణాంకాలను ప్రదర్శించేటప్పుడు యథార్థ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశాడు. అతడికి మూడేళ్లలో ఇదే తొలి సెంచరీగా పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేర్వేరు కారణాలతో అసలు తాను క్రికెట్టే ఆడలేదని వెల్లడించాడు.

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. హోల్కర్‌ స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. చాన్నాళ్ల తర్వాత సెంచరీతో మురిపించాడు. వన్డేల్లో 30వ శతకం అందుకున్నాడు. అయితే 2020, జనవరి తర్వాత అతడికితే తొలి మూడంకెల స్కోరు కావడం గమనార్హం. గణాంకాల పరంగా ఇది వాస్తవమే. బ్రాడ్‌కాస్టర్‌ దీనినే ప్రదర్శించగా ఇది యథార్థ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని రోహిత్‌ భావించాడు.

'మూడేళ్లలో తొలి సెంచరీ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ మూడేళ్లలో నేను ఆడింది 12 (17) వన్డేలు. మూడేళ్లని చెబితే ఎంతో కాలంగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. టీవీల్లో మీరిది చూపించారని నాకు తెలుసు. కానీ యథార్థ పరిస్థితులను మీరు వివరించాలి' అని రోహిత్‌ అన్నాడు. 'హిట్‌మ్యాన్‌' పునరాగమనం చేసిన్టటేనా అని మరో జర్నలిస్టు ప్రశ్నించగా 'నేనింతకు ముందే చెప్పినట్టు 2020లో అసలేం మ్యాచులు లేవు. కొవిడ్‌ 19 వల్ల అందరూ ఇంటివద్దే ఉన్నారు. ఆడిన వన్డేలు చాలా తక్కువ. గాయం కావడంతో రెండే టెస్టులు ఆడాను. మీరు ఆ దృక్పథాన్నీ చూపించాలి' అని రోహిత్‌ పేర్కొన్నాడు.

'మేం గతేడాది నుంచే టీ20 క్రికెట్‌ ఆడుతున్నాం. అందులోనూ ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్‌ యాదవ్‌ను మించిన బ్యాటర్‌ ఎవ్వరూ లేరు. అతడు రెండు సెంచరీలు కొట్టాడు. అలా ఎవ్వరూ చేయలేదు' అని రోహిత్‌ అన్నాడు. మూడో వన్డేలో శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుతంగా ఆడాడని హిట్‌మ్యాన్‌ ప్రశంసించాడు. రెండో స్పెల్‌లో వరుసగా వికెట్లు తీశాడని వెల్లడించాడు. 'కీలక సమయాల్లో వికెట్లు తీయడం అతడికి తెలుసు. కేవలం వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ మనమిది చూశాం. ఒక జట్టుగా అతడు మాకెంతో కీలకం' అని వివరించాడు.

IND vs NZ, 3rd ODI- Full Match Highlights: మూడో వన్డేలోనూ టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో వైట్ వాట్ చేసింది టీమిండియా. ముందు బ్యాటింగ్, తరువాత బౌలింగ్ లో చెలరేగిన టీమిండియా పర్యాటక కివీస్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే శతకం (138 ; 100 బంతుల్లో 12x4, 8x6)తో మెరిశాడు. హెన్రీ నికోల్స్ (42 ; 40 బంతుల్లో 3x4, 2x6), మిచెల్ శాంట్నర్ (34 ; 29 బంతుల్లో 3x4, 2x6) టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో 3 వికెట్లతో కివీస్ బ్యాటర్లను అడ్డుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget