T20 Worldcup 2022: టీ20 ప్రపంచకప్ సెమీస్లో వర్షం పడితే - ఎవరు ముందుకెళ్తారు?
ఐసీసీ వరల్డ్కప్లో రెండో సెమీస్లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే?

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2022 ముగింపు దశకు చేరుకుంది. టోర్నీలో సెమీఫైనల్స్ ఆడేందుకు చివరి నాలుగు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక టీ20 టైటిల్ కోసం భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ నాలుగు జట్లు తలపడనున్నాయి. టోర్నమెంట్లో అంతకు ముందు జరిగిన కొన్ని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఒకవేళ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్కు వర్షం ఆటంకం కలిగిస్తే ఏం జరుగుతుంది? విజేతను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక గ్రూపు నుంచి అగ్రస్థానంలో నిలిచిన జట్టు రెండో స్థానంలో నిలిచిన మరో గ్రూప్ జట్టుతో తలపడాలి. భారత్ (గ్రూప్-2లో టేబుల్-టాపర్స్) పాకిస్థాన్ (గ్రూప్-2లో 2వ స్థానం) కంటే ముందుంది. న్యూజిలాండ్ (గ్రూప్-1లో టేబుల్-టాపర్స్) ఇంగ్లాండ్ (గ్రూప్-1లో 2వ స్థానం) కంటే ముందుంది.
మొదటి సెమీఫైనల్ నవంబర్ 9న సిడ్నీలో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఒకవేళ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను భారత్ ఓడిస్తే, నవంబర్ 13న మెల్బోర్న్లో మొదటి సెమీఫైనల్ విజేతతో తలపడుతుంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది?
వర్షం అంతరాయం కలిగిస్తే ఐసీసీ అన్ని నాకౌట్ మ్యాచ్లకు రిజర్వ్ డేని ప్రకటించింది. రిజర్వ్ డే రోజున అదే స్థానం నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ రిజర్వ్ డే వాష్ అవుట్ అయితే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి అలా జరిగితే భారత్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
ఒకవేళ టీ20 ప్రపంచకప్ ఫైనల్ వాష్ అవుట్ అయితే, దానికి కూడా ఐసీసీ రిజర్వ్ డేని ఉంచింది. రిజర్వ్ డే కూడా వాష్ అవుట్ అయితే, ఫైనల్కు వెళ్లిన రెండు జట్లనూ ఉమ్మడి విజేతలుగా ప్రకటించబడతాయి.
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
ట్రెండింగ్ వార్తలు



















