అన్వేషించండి

IND vs AUS Test Series: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్

Border Gavaskar Series | భారత క్రికెట్ జట్టు బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను ఓడిపోతుందని, ఆసీస్ గడ్డ మీద ఆట అంత తేలిక కాదని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 3-1 తేడాతో భారత్ ఓడుతుందన్నాడు.

IND vs AUS Ricky Ponting Predicts India Losing Border Gavaskar Series | హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే అగ్రెసివ్ నేచర్, నోటి దురుసు, ఏదైనా చేసి గెలవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని క్రికెట్ ప్రేమికులకు తెలుసు. త్వరలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. నవంబర్ 22న ప్రారంభం కానున్న ఈ కీలక సిరీస్ భారీ తేడాతో నెగ్గి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ ను ఆసీస్ జట్టు చిత్తు చేస్తుందని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 

కివీస్ చేతిలో వైట్ వాష్ తో పెరిగిన కష్టాలు

ఇటీవల రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో 0-3తో వైట్ వాష్ చవిచూసింది. సొంతగడ్డపై కివీస్‌తో వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ భారీ పరాజయంతో టీమిండియా ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ పూర్తిగా వైఫల్యం చెందాక.. WTC ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాల్ని మరింత కఠినం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియాపై భారీ తేడాతో టెస్ట్ సిరీస్ నెగ్గితే రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ అసాధ్యమని క్రికెట్ మాజీలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం ఆసీస్ చేతిలో భారత్ 3-1తో టెస్ట్ సిరీస్ ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. ఆసీస్ గడ్డపై గెలుపు అంత ఈజీ కాదు. తమ గడ్డమీద ఆడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారీ తేడాతో నెగ్గడం కాదు, సిరీస్ నెగ్గడమే అసలుసిసలైన సవాల్ అన్నాడు.

టీమిండియా అనుభవం, ఆసీస్ గడ్డపై కంగారు జట్టుకు ఉన్న బలం, ప్రయోజనాలను అంచనా వేసిన రికీ పాంటింగ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తమ జట్టు 3-1తో నెగ్గుతుందని దీమా వ్యక్తం చేశాడు. 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భారత్ ఒక టెస్ట్ మ్యాచ్‌ గెలుస్తుందని పాంటింగ్ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు స్వదేశంలో ఆడటం ఎప్పటికీ ప్లస్ పాయింట్. సిరీస్ అయితే భారత్ కచ్చితంగా ఓడిపోతుందని.. ఎంత తేడాతో ఆసీస్ నెగ్గుతుందో ఐసీసీ రివ్యూలో పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

షమీ లేకపోవడం భారత్ కు మైనస్

2023 వన్డే ప్రపంచ కప్ తరువాత నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ జట్టుతో లేకపోవడం వారి కష్టాలు పెంచుతుంది. త్వరలో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం షమీ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరం. అయితే గాయాల నుంచి కోలుకుని పూర్తి ఫిట్ నెస్ సాధించే ఛాన్స్ లేదని షమీని తీసుకోవడం లేదు. ఆసీస్ లాంటి పిచ్ లపై అనుభవం ఉన్న షమీ లాంటి బౌలర్ లేకపోవడం భారత్ కు నిజంగానే పెద్ద దెబ్బ. 

 షమీ ఫిట్‌గా ఉంటాడా లేదా అనే దానిపై గత ఆగస్టులో సందేహం ఉండేది. టెస్టు మ్యాచ్ లో ప్రత్యర్థి 20 వికెట్లు ఆసీస్ గడ్డపై తీయడం భారత బౌలర్లకు సవాల్. అయితే బ్యాటర్లు మాత్రం కాస్త పోరాటం చేస్తారని భావిస్తున్నట్లు రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. కానీ ఆసీస్ లో ఆడటం అంత తేలిక కాదని భారత బ్యాటర్లకు కూడా తెలుసు. ఈ టెస్ట్ సిరీస్ ను కచ్చితంగా ఆసీస్ జట్టు నెగ్గుతుందని రికీ పాంటింగ్ మరోసారి చెప్పుకొచ్చాడు.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget