అన్వేషించండి

T20 World Cup 2024: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మొదలెట్టింది, సూపర్ 8లో ఇంగ్లండ్‌ చేతిలో విండీస్‌ చిత్తు

England vs West Indies: టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ ఎయిట్‌ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌ ఆతిథ్య వెస్టిండీస్‌ పై సాధికార విజయం సాధించింది.

England vs West Indies Highlights In T20 World Cup 2024:  సూపర్‌ ఎయిట్‌( Super 8) పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌(England) తొలి అడుగు బలంగా వేసింది. ఆతిథ్య వెస్టిండీస్‌(West Indies)తో జరిగిన మ్యాచ్‌లో సాధికార విజయం సాధించింది. ఈ టీ 20 ప్రపంచకప్‌( T20 World Cup 2024) పరంగా చూస్తే భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు జూలు విదిల్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇంగ్లాండ్ ఓపెనర్‌ ఫిల్ సాల్ట్‌(Phil Salt) 47 బంతుల్లో 87 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. 
 
సమష్టిగా రాణించారు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌... విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విండీస్‌ ఓపెనర్లు బ్రెండన్ కింగ్‌-జాన్సన్‌ చార్లెస్‌ కరెబియన్లకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన అనంతరం బ్రెండన్‌ కింగ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.  అనంతరం జాన్సన్‌తో జత కలిసిన నికోలస్‌ పూరన్‌ విండీస్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వీరిద్దరూ కలిసి విండీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. 5 ఓవర్లలోనే విండీస్‌ 50 పరుగులు చేసింది. పవర్‌ ప్లే ముగిసే సరికి వెస్టిండీస్‌ ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 58 పరుగులు చేసింది. 32 బంతుల్లోనే పూరన్‌- జాన్సన్‌ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 38 పరుగులు చేసి చార్లెస్‌ అవుటయ్యాడు. మొయిన్‌ అలీ... చార్లెస్‌ను అవుట్ చేశాడు. అయినా నికోలస్‌ పూరన్‌, రోమెన్‌ పావెల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. పావెల్‌ క్రీజులో ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్ చేశాడు. కేవలం 17 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లతో పావెల్‌ 36 పరుగులు చేసి లివింగ్‌ స్టోన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో సరిగ్గా 36 పరుగులే చేసి నికోలస్‌ పూరన్‌ కూడా అవుటయ్యాడు.  141 పరుగుల వద్ద పూరన్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉండడం... ఆండ్రూ రస్సెల్‌ క్రీజులోకి రానుండడంతో విండీస్‌ మరింత భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే రస్సెల్‌ పూర్తిగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొన్న రస్సెల్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో రూథర్‌ఫోర్డ్‌ 15 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో 28 పరుగులు  చేయడంతో విండీస్‌ విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 
 
సాల్ట్‌ విధ్వంసం
181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కింది. బ్రిటీష్‌ జట్టు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌-జోస్‌ బట్లర్‌ తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 67 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. జోస్‌ బట్లర్‌ 22 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. తర్వాత కాసేపటికే మొయిన్‌ అలీ 10 బంతుల్లో 13 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో పది ఓవర్లలో 84 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సాల్ట్‌తో జత కలిసిన బెయిర్‌ స్టో మరో వికెట్‌ పడకుండా ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. సాల్డ్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్‌ 7 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెయిర్‌ స్టో 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో ధాటిగా ఆడి 48 పరుగులు చేయడంతో మరో  15 బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget