అన్వేషించండి

T20 World Cup 2024 : ఇవేం పిచ్‌లు బాబోయ్‌, భారత్‌-పాక్ మ్యాచ్‌ కూడా ఇక్కడేనట

Drop-in pitch : బెస్ట్ పిచ్‌ తయారీకి స్టేడియంలోని నేల అనువుగా లేకపోతే డ్రాప్‌-ఇన్‌ పిచ్‌లను ఉపయోగిస్తారు. అయితే ఈ పిచ్ లో ఇప్పటివరకు బౌలర్లే ఆధిపత్యం ప్రదర్శించారు

Drop in pitch for India vs Pakistan: టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup) అంటే బ్యాటర్ల విధ్వంసమే కళ్ల ముందు కదులుతుంది. భారీ సిక్సర్లు... వరుస బౌండరీలతో స్టేడియాలు హోరెత్తిపోతాయి. భారీ స్కోర్లు తేలిగ్గా నమోదవుతాయి. కానీ అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ అలాంటి మెరుపులేవీ కనిపించలేదు. ఆరంభంలో జరిగిన మూడు మ్యాచులు పసికూనల మధ్య కాబట్టి ఎవరు పిచ్‌ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీలంక(SL)- దక్షిణాఫ్రికా(SA) మధ్య జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ బౌలర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో ఈ మ్యాచులు ఉసూరుమనిపించాయి. నమీబియా-ఒమన్‌ మధ్య జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ఈ పిచ్‌లపై క్రికెట్‌ అభిమానులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

 
మరీ ఇలానా..?
శ్రీలంక- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంతా అనుకున్నారు. కానీ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం(Nassau County International Cricket Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్‌ పూర్తిగా బౌలర్లకే సహకరించింది. పేసర్లు, స్పిన్నర్లు చెలరేగిపోవడంతో ఇరువైపుల బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. లంక కేవలం 77 పరుగులకే కుప్పకూలగా.. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా కూడా 16 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో ఎవరూ 25 పరుగుల మార్క్‌ను దాటకపోవడం విశేషం. టీ 20 ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లలో పిచ్‌లు ఉలా ఉండడంపై అభిమానలు పెదవి విరుస్తున్నారు. పసికూనలే కాకుండా అగ్రశ్రేణి జట్లు కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఇక్కడే
ఈ టీ 20 ప్రపంచకప్‌కే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌గా భావిస్తున్న ఇండియా-పాక్ (India versus Pakistan) పోరు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలోనే జరగనుంది. ఈ పిచ్‌పై పరుగులు రాక కష్టం అవ్వడంతో మాజీ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నసావు కౌంటీ స్టేడియంలో భారత్‌-పాక్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పిచ్‌పై బంతి బ్యాట్‌పైకి రావడం లేదని టీ 20 క్రికెట్‌లో ఇది చాలా అరుదని మాజీలు అంటున్నారు. ఈనెల తొమ్మిదిన ఈ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీలు అంటున్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లోనూ అదే జరిగితే అభిమానులకు నిరాశ తప్పదని అంటున్నారు. న్యూయార్క్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్లు భారీ స్కోరు చేయడం కష్టమేనని కూడా అంచనా వేస్తున్నారు. భారత జట్టు తొలి మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలోనే ఆడనుంది. ఇది కూడా భారత అభిమానులను ఆందోళన పరుస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget