అన్వేషించండి

Archery World Cup 2024: ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత్ సంచలనం, ఏకంగా 7 పతకాలు

Archery World Cup 2024: ఆర్చరీ ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా హవా కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ గోల్డ్ పొందిన భారత జట్టు ఇప్పుడు మరో స్వర్ణాన్ని గెలిచి అదరగొట్టేసింది.

Archery World Cup 2024 India create History with 7 Medals: ఆర్చరీ వరల్డ్ కప్‌ 2024లో భారత్‌ మళ్లీ అద్భుతం చేసింది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు బంగారు పతాకాన్ని సాధించింది. ఇప్పటికే కాంపౌండ్‌ విభాగంలో మూడు, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణాన్ని గెలిచిన టీమ్‌ఇండియా మరో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది.ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి  ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన భారత జట్టు ఒలింపిక్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. రికర్వ్‌ విభాగంలో భారత్ 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. 

భారత్‌కు పతకాల పంట
ప్రస్తుతం ఆర్చరీ వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఏడు  పతకాలను దక్కించుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా.. మరొకటి రజతం, ఇంకొకటి కాంస్యం.  ఇక  మహిళల వ్యక్తిగత రికర్వ్‌ సెమీఫైనల్లో దీపిక.. దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. ఇక మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలతో మెరిసింది. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లోతెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం పసిడిని ఒడిసిపట్టింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాతో జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్ లో జ్యోతిసురేఖహోరాహోరీ పోరాడి పసిడిని సాధించింది.

ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ లతో కలిసి మహిళల టీమ్ ఈవెంట్ లో 236-225 పాయింట్ల తేడాతో పసిడి పతకం కైవసం చేసుకుంది. మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో. అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి  158-157పాయింట్ల తేడాతో గెలిచి పసిడి పతకం సాధించింది. ఇక పురుషుల టీం ఈవెంట్ లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్ , ప్రీతమేష్ లతో కూడిన బృందం... నెదర్లాండ్స్ జట్టుపై 238-231తేడాతో గెలిచి బంగారు పతకం గెలిచింది.
 
త్వరలో పారిస్‌లో విశ్వ క్రీడా సంరంభం 
మరికొన్ని రోజుల్లో పారిస్‌లో విశ్వ క్రీడా సంరంభానికి తెరలేవనున్న వేళ సంప్రదాయం ప్రకారం ఒలింపిక్స్‌ పుట్టిన ఒలింపియాలో   జ్యోతి ప్రజ్వలన జరిగింది. అయితే ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవాన్ని స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సిద్ధమైంది. ఫ్రాన్స్‌లో ప్రవహించే సెన్‌ నది ఈ వేడుకలకు వేదిక కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ వేదికను మారుస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నదిలో 6 కిలోమీటర్ల దూరం పాటు సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్‌ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలని అనుకున్నారు.  
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget