అన్వేషించండి

వెంకటగిరి పోలేరమ్మ జాతర తేదీలు ఖరారు.. 

రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిశ్చయించారు.

నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిశ్చయించారు. వెంకటగిరి లో జాతర నిర్వహణ కోసం అధికారుల సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి. 

జాతర నిర్వహణ ఇలా..
ఆగస్టు 31వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది
సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది. 
సెప్టెంబర్ 11 ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు. 
సెప్టెంబర్ 14 బుధవారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు
సెప్టెంబర్ 15 గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది.

జాతరలోని ప్రధాన ఘట్టం సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జరుగుతుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏడాదికోసారి నిర్వహించే అమ్మవారి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. 


వెంకటగిరి పోలేరమ్మ జాతర తేదీలు ఖరారు.. 

వెంకటగిరి సంస్థానాదీశులైన రాజావారి ఆధ్వర్యంలో గతంలో జాతర జరిగేది. ఇప్పుడు కూడా రాజనగరి నుంచే ఆభరణాలు తెచ్చి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను జరుపుతోంది. అమ్మవారి జాతరలో తొలిపూజ వెంకటగిరి రాజావారిదే. కరోనాతో రెండేళ్లపాటు నిరాడంబరంగా జరిగిన అమ్మవారి జాతర, ఈఏడాది అంగరంగ వైభవంగా జరగబోతోంది. 

జాతరకు 2కోట్ల రూపాయల నిధులు.. 
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలసిన సందర్భంలో పోలేరమ్మ అమ్మవారి జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించవలసిందిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. దీనికోసం ఇప్పటికే తిరుపతి కన్వీనర్ సమగ్ర నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే.. ఈ ఏడాది జాతర మరింత వైభవంగా జరుగుతుంది. 

జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంతా జరుగుతుంది. అనంతరం తెల్లవారి నుంచి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని ఆలయం ముందు ఉంచుతారు. ఆ తర్వాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు. అంటే విగ్రహాం నుంచి మట్టిని తీసి వేస్తారు. ఆ మట్టిని పవిత్రంగా భక్తులు తమ ఇళ్లలో దాచుకుంటారు. అమ్మవారి విరూపణంతో జాతర ముగుస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

2026 మార్చి 05 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 05 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Ugadi 2026: ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం! అంటే ఇక పరాభవాలేనా , ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు?
2026 ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం! అంటే ఇక పరాభవాలేనా , ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు?
Malavya Rajyoga 2026: మీనంలో శుక్ర సంచారం.. ఈ రాశులకు ధనం, సుఖం.. మీ రాశి ఉందా?
మీనంలో శుక్ర సంచారం.. ఈ రాశులకు ధనం, సుఖం.. మీ రాశి ఉందా?
2026 మార్చి 04 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 04 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget