అన్వేషించండి

వెంకటగిరి పోలేరమ్మ జాతర తేదీలు ఖరారు.. 

రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిశ్చయించారు.

నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిశ్చయించారు. వెంకటగిరి లో జాతర నిర్వహణ కోసం అధికారుల సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి. 

జాతర నిర్వహణ ఇలా..
ఆగస్టు 31వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది
సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది. 
సెప్టెంబర్ 11 ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు. 
సెప్టెంబర్ 14 బుధవారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు
సెప్టెంబర్ 15 గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది.

జాతరలోని ప్రధాన ఘట్టం సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జరుగుతుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏడాదికోసారి నిర్వహించే అమ్మవారి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. 


వెంకటగిరి పోలేరమ్మ జాతర తేదీలు ఖరారు.. 

వెంకటగిరి సంస్థానాదీశులైన రాజావారి ఆధ్వర్యంలో గతంలో జాతర జరిగేది. ఇప్పుడు కూడా రాజనగరి నుంచే ఆభరణాలు తెచ్చి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను జరుపుతోంది. అమ్మవారి జాతరలో తొలిపూజ వెంకటగిరి రాజావారిదే. కరోనాతో రెండేళ్లపాటు నిరాడంబరంగా జరిగిన అమ్మవారి జాతర, ఈఏడాది అంగరంగ వైభవంగా జరగబోతోంది. 

జాతరకు 2కోట్ల రూపాయల నిధులు.. 
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలసిన సందర్భంలో పోలేరమ్మ అమ్మవారి జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించవలసిందిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. దీనికోసం ఇప్పటికే తిరుపతి కన్వీనర్ సమగ్ర నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే.. ఈ ఏడాది జాతర మరింత వైభవంగా జరుగుతుంది. 

జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంతా జరుగుతుంది. అనంతరం తెల్లవారి నుంచి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని ఆలయం ముందు ఉంచుతారు. ఆ తర్వాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు. అంటే విగ్రహాం నుంచి మట్టిని తీసి వేస్తారు. ఆ మట్టిని పవిత్రంగా భక్తులు తమ ఇళ్లలో దాచుకుంటారు. అమ్మవారి విరూపణంతో జాతర ముగుస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chaitra Purnima 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
చైత్ర పౌర్ణమి 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
Mahakaleshwar Temple: భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Marriage Muhurat 2026: ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు , సమయం తెలుసుకోండి!
2026 ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు సమయం తెలుసుకోండి!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget