అన్వేషించండి

Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

Shri Kiriteswari Temple: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయం, శక్తిపీఠం గురించి ఇక్కడ తెలుసుకుందాం. ముర్షిదాబాద్ జిల్లాలోని అత్యంత పురాతన ఆలయం ఇది

Kiriteswari Gupta Mandir Murshidabad: పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా కిరీటేశ్వరి శక్తిపీఠం (కిరిట్‌కోనా గ్రామంలో) ఉంది. ఈ సమీపంలోనే చెట్ల వేళ్లు తో అల్లుకున్న పురాతన శివాలయం ఇది.  కిరీటేశ్వరి గుప్త మందిర్ (Kiriteshwari Gupta Mandir) పాత శివాలయం అంటారు.  భక్తులు, పర్యాటకులు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఇవి. 

Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

కిరీటేశ్వరి శక్తిపీఠం

ఈ ఆలయం  వెయ్యి సంవత్సరాలకు పైబడినది. 1405లో ముస్లిం ఆక్రమణల సమయంలో ధ్వంసమైంది. ప్రస్తుత కిరీటేశ్వరి ఆలయం 19వ శతాబ్దంలో రాజా దర్పనారాయణ్ రాయ్ ద్వారా పునర్నిర్మితమైంది.  ముర్షిదాబాద్ రాజుల కులదేవతగా పూజలందుకుంది. ప్రస్తుతం ఈ పాత శివాలయం కొద్ది ఆనవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలయం పూర్తిగా కూలిపోయి, చుట్టూ పెరిగిన మర్రిచెట్టు వేళ్లు విగ్రహంపై అల్లుకుని సహజ సౌందర్యాన్నిస్తాయ్. అందుకే దీనిని అల్లుకున్న శివాలయం అని కూడా భక్తులంటారు. 

Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

ఊడల మధ్య శివుడు

ఇక్కడ  చెట్ల ఊడలు అల్లుకున్న శివుడిని దర్శించుకోవడం ప్రత్యేకంగా భావిస్తారు భక్తులు. స్థానికుల విశ్వాసం ప్రకారం  ఈ ఆలయం శివుడి భార్య సతీదేవి "నిద్రించిన స్థలం" అని చెబుతారు. 51 శక్తిపీఠాలలో ఒకటిగా, సతీదేవి కిరీటం (తలపట్టు) పడిన చోటుగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం దక్ష యాగం సమయంలో పుట్టింట్లో అవమానం భరించలేక సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమె శరీరాన్ని  విష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు. ఆ భాగాలు భూమి మీద పడిన చోట్ల శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. కిరీటేశ్వరిలో సతీ దేవి ముకుటం (కిరీటం) పడిందని చెబుతారు. అందుకే ఇక్కడ అమ్మవారిని  'విమలా' (పవిత్రమైనది)గా పూజిస్తారు. ఇది శరీర భాగం కాకుండా ముకుటం పడిన చోట కాబట్టి, కొందరు దీన్ని 'ఉప-పీఠం'గా పిలుస్తారు.


Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?

కిరిట్‌కోనా గ్రామం, నబాగ్రామ్ బ్లాక్, లాల్‌బాగ్ సబ్-డివిజన్, ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్. భాగీరథి నది ఒడ్డున ఉంది ఉంది ఈ ఆలయం. కిరీటేశ్వరి ఆలయం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దహపారా ధామ్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు... ముర్షిదాబాద్ స్టేషన్ నుంచి ఫెర్రీ ద్వారా భాగీరథి నది దాటి..లోకల్ వెహికల్ లో వెళితే అరగంటలో ఆలయాన్ని చేరుకోవచ్చు. కోల్ కతా నుంచి 195 కిలోమీటర్లు. బస్సులో ప్రయాణం చేస్తే నాలుగైదు గంటలు పజుతుంది. కోల్ కతా నెతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టాక్సీలో వెళ్లొచ్చు.

ఆలయ టైమింగ్స్

రోజూ సూర్యోదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది.  మహాశివరాత్రి, దుర్గా పూజలు ,  పౌష్ మేళా (డిసెంబర్-జనవరి)లో ఫోక్ డాన్స్‌లు, కుమారి పూజలు జరుగుతాయి. భక్తులు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేయొచ్చు. 
  
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతం 2023 సెప్టెంబర్‌లో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియాగా ఎంపికైంది. ఇది గ్రామీణ టూరిజాన్‌ను ప్రోత్సహించడానికి 795 గ్రామాల నుంచి ఎంపికైంది. దీనికి సమీపంలో 16 చిన్న ఆలయాల కాంప్లెక్స్ ఉంది..అందులో పరమేశ్వరుడు, కాలభైరవుడి ఆలయాలున్నాయి.  
 
ఈ శక్తిపీఠం ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. భక్తులు, పర్యాటక ప్రేమికులు దర్శించుకోవాల్సిన అద్భుత ప్రదేశం ఇది.

2025లో ధన త్రయోదశి , నరక చతుర్థశి, దీపావళి...ఏ రోజు ఏ పండుగ, ఏం చేయాలి, విశిష్టత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Varahi Navaratri Dates2026: వారాహి నవరాత్రుల పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
వారాహి నవరాత్రులు 2026 తేదీలు, పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
Unique Traditions: ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
Dakshinayanam 2026: ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget