అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

Shri Kiriteswari Temple: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయం, శక్తిపీఠం గురించి ఇక్కడ తెలుసుకుందాం. ముర్షిదాబాద్ జిల్లాలోని అత్యంత పురాతన ఆలయం ఇది

Kiriteswari Gupta Mandir Murshidabad: పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా కిరీటేశ్వరి శక్తిపీఠం (కిరిట్‌కోనా గ్రామంలో) ఉంది. ఈ సమీపంలోనే చెట్ల వేళ్లు తో అల్లుకున్న పురాతన శివాలయం ఇది.  కిరీటేశ్వరి గుప్త మందిర్ (Kiriteshwari Gupta Mandir) పాత శివాలయం అంటారు.  భక్తులు, పర్యాటకులు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఇవి. 

Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

కిరీటేశ్వరి శక్తిపీఠం

ఈ ఆలయం  వెయ్యి సంవత్సరాలకు పైబడినది. 1405లో ముస్లిం ఆక్రమణల సమయంలో ధ్వంసమైంది. ప్రస్తుత కిరీటేశ్వరి ఆలయం 19వ శతాబ్దంలో రాజా దర్పనారాయణ్ రాయ్ ద్వారా పునర్నిర్మితమైంది.  ముర్షిదాబాద్ రాజుల కులదేవతగా పూజలందుకుంది. ప్రస్తుతం ఈ పాత శివాలయం కొద్ది ఆనవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలయం పూర్తిగా కూలిపోయి, చుట్టూ పెరిగిన మర్రిచెట్టు వేళ్లు విగ్రహంపై అల్లుకుని సహజ సౌందర్యాన్నిస్తాయ్. అందుకే దీనిని అల్లుకున్న శివాలయం అని కూడా భక్తులంటారు. 

Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

ఊడల మధ్య శివుడు

ఇక్కడ  చెట్ల ఊడలు అల్లుకున్న శివుడిని దర్శించుకోవడం ప్రత్యేకంగా భావిస్తారు భక్తులు. స్థానికుల విశ్వాసం ప్రకారం  ఈ ఆలయం శివుడి భార్య సతీదేవి "నిద్రించిన స్థలం" అని చెబుతారు. 51 శక్తిపీఠాలలో ఒకటిగా, సతీదేవి కిరీటం (తలపట్టు) పడిన చోటుగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం దక్ష యాగం సమయంలో పుట్టింట్లో అవమానం భరించలేక సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమె శరీరాన్ని  విష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు. ఆ భాగాలు భూమి మీద పడిన చోట్ల శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. కిరీటేశ్వరిలో సతీ దేవి ముకుటం (కిరీటం) పడిందని చెబుతారు. అందుకే ఇక్కడ అమ్మవారిని  'విమలా' (పవిత్రమైనది)గా పూజిస్తారు. ఇది శరీర భాగం కాకుండా ముకుటం పడిన చోట కాబట్టి, కొందరు దీన్ని 'ఉప-పీఠం'గా పిలుస్తారు.


Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!

ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?

కిరిట్‌కోనా గ్రామం, నబాగ్రామ్ బ్లాక్, లాల్‌బాగ్ సబ్-డివిజన్, ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్. భాగీరథి నది ఒడ్డున ఉంది ఉంది ఈ ఆలయం. కిరీటేశ్వరి ఆలయం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దహపారా ధామ్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు... ముర్షిదాబాద్ స్టేషన్ నుంచి ఫెర్రీ ద్వారా భాగీరథి నది దాటి..లోకల్ వెహికల్ లో వెళితే అరగంటలో ఆలయాన్ని చేరుకోవచ్చు. కోల్ కతా నుంచి 195 కిలోమీటర్లు. బస్సులో ప్రయాణం చేస్తే నాలుగైదు గంటలు పజుతుంది. కోల్ కతా నెతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టాక్సీలో వెళ్లొచ్చు.

ఆలయ టైమింగ్స్

రోజూ సూర్యోదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది.  మహాశివరాత్రి, దుర్గా పూజలు ,  పౌష్ మేళా (డిసెంబర్-జనవరి)లో ఫోక్ డాన్స్‌లు, కుమారి పూజలు జరుగుతాయి. భక్తులు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేయొచ్చు. 
  
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతం 2023 సెప్టెంబర్‌లో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియాగా ఎంపికైంది. ఇది గ్రామీణ టూరిజాన్‌ను ప్రోత్సహించడానికి 795 గ్రామాల నుంచి ఎంపికైంది. దీనికి సమీపంలో 16 చిన్న ఆలయాల కాంప్లెక్స్ ఉంది..అందులో పరమేశ్వరుడు, కాలభైరవుడి ఆలయాలున్నాయి.  
 
ఈ శక్తిపీఠం ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. భక్తులు, పర్యాటక ప్రేమికులు దర్శించుకోవాల్సిన అద్భుత ప్రదేశం ఇది.

2025లో ధన త్రయోదశి , నరక చతుర్థశి, దీపావళి...ఏ రోజు ఏ పండుగ, ఏం చేయాలి, విశిష్టత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Death Hoax: ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Death Hoax: ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Komalee Prasad: చీరలో కోమలీ... చూపులతో చంపేస్తోన్న చిన్నది
చీరలో కోమలీ... చూపులతో చంపేస్తోన్న చిన్నది
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
Embed widget