అన్వేషించండి
Advertisement
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
ప్రసాదం అంటే దైవదర్శనం అయిన తర్వాత...ఆ దేవుడికి నివేదించిన పదార్థాన్ని కళ్లకు అద్దుకుని తింటారు. కానీ ఆ ఆలయంలో ప్రసాదం తినలేరు..ఎందుకంటే అక్కడ మట్టిని ప్రసాదంగా ఇస్తారు.. ఎక్కడ, ఎందుకిలా....
కర్ణాటకలో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయానికి ఎప్పుడైనా వెళ్లారా. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో ఉండే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు" వల్మీక మృత్తికా" అంటే పుట్ట మన్ను ప్రసాదంగా అందిస్తారు. ఈ ప్రసాదాన్ని ఎలా వినియోగించాలంటే...
- మృత్తికా ప్రసాదాన్ని ధరించినవారికి నాగుల భయం, నాగదోషం తొలగి నాగదేవతల అనుగ్రహం ఉంటుంది.
- కొందరికి నిత్యం కలలో పాములు కనిపిస్తుంటాయి. ఎన్నిచేసినా ఆ భయం అలాగే ఉండిపోతుంది. అలాంటివారు ఈ ఆలయంలో మృత్తికా ప్రసాధాన్ని ధరిస్తే ఆ భయం తొలగిపోతుంది.
- కొందరు ఆడపిల్లలకు రకరకాల దోషాల వల్ల వివాహం జరగదు. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లికుదరదు. ఏ కారణం వల్ల అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయో కూడా అర్థంకాదు. వరుసగా ఇలాగే జరిగితే ఆ అమ్మాయితో పాటూ ఆ కుటుంబంలో సభ్యులు కూడా డిప్రెషన్ కి లోనవుతారు. అలాంటి సమస్య ఉన్నవారు సుబ్రమణ్య స్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను, కొంచెం పసుపును నీటిలో వేసుకుని స్నానమాచరించి..దేవుడికి నేతితో దీపాన్ని వెలిగించి ప్రార్థిస్తే త్వరగా వివాహం జరుగుతుంది.
- ఊరికే వసపిట్టలా వాగుతుంటారు కొందరు..పుట్టుకతో వచ్చిన లక్షణమో ఏమో ఎంత కంట్రోల్ చేసినా వారి మాటలు ఆపడం ఎవ్వరి వల్లా కాదు. ఓ చిటికెడు మృత్తికను కొబ్బరినూనెలో వేసి తలకు రాసుకుంటే అతిగా మాట్లాడటం తగ్గుతుందట.
- పిల్లలు చాలామంది పళ్లు కొరకడం, చీటికి మాటికీ కిందపడి కొట్టుకోవడం, అలాగే ఓ వైపు చూస్తుండిపోవడం, అదే పనిగా ఏడుస్తుండడం, ఎంత తింటున్నా సన్నబడడం లాంటి లక్షణాలుంటే సుబ్రమణ్యస్వామిని ధ్యానించి ఆ మృత్తికను తీసుకుని బొట్టుగా పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారట.
- రుతుక్రమం సమయంలో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న వారు... రుతుక్రమం వచ్చేముందు చిటికెడు మృత్తికను పొడిచేసి కొబ్బరినూనె లేదా ఆముదంలో వేసుకుని పొడిచేసుకుని పొట్టపై రాసుకుంటే ఆ నొప్పి రాదని చెబుతారు.
- కష్టపడి చదివినా మరిచిపోయే విద్యార్థులు కూడా చిటికెడు ముత్తికను నైట్ మొత్తం గ్లాసు వాటర్లో నానబెట్టి ఉదయాన్నే తాగితే మరుపు తగ్గుతుంది.
- సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజ చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టిన పాలలో ఒక చిటికెడు మృత్తికాను వేసి దేవునికి చూపించిప్రార్ధన చేసుకొని తాగితే స్వామివారి అనుగ్రహం ఉంటుందంటారు.
- ఎవరింట్లో అయినా తులసి మొక్,క తమలపాకు ఆకులు ఎండిపోతుంటాయో ఓ కుండలో చిటెకెడు స్వామివారి మృత్తిక వేసి మొక్కవేస్తే పచ్చగా ఎదుగుతాయట.
- చర్మం పొడిబారి నాగఫణి రోగాన్ని అనుభవించేవారు, నీరసంతో ఇబ్బందిపడేవారు సుబ్రమణ్యస్వామి చిటికెడు మృత్తికను నీటిలో వేసి సాయంకాలం వేళ స్నానం చేస్తే ఆ ప్రభావం తగ్గుతుందట.
నోట్: కొందరు పండితులు, కొన్ని బుక్స్, స్థానికంగా ప్రచారంలో ఉండే విషయాల ఆధారంగా రాసిన వివరాలివి...వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలో పూర్తిగా మీ వ్యక్తిగతం....
Also Read: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆధ్యాత్మికం
ఆటో
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion