అన్వేషించండి

Spirituality: సంధ్యాసమయం అందుకు నిషిద్ధం అంటారెందుకు!

Spirituality: సంధ్యాసమయంలో శృంగారం సరికాదని చెబుతుంటారు. గోధూళి వేళ ఆ కోరికరావడం కూడా మహాపాపం అంటారు. ఎందుకు..ఏమవుతుంది..

సంధ్యాసమయంలో ఆ కోరిక ఎందుకు తగదో తెలియాలంటే ముందు హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడి పుట్టుక గురించి తెలుసుకోవాలి...

కళ-మరీచిమహర్షుల కుమారుడు కశ్యపమహర్షి. ప్రసూతి-దక్షప్రజాపతి దంపతులు తమ కుమార్తెలు 13 మందిని వారి ఇష్ట ప్రకారం కశ్యపునకు ఇచ్చి వివాహం చేశారు. వారే అదితి, దితి, ధను, కష్ట, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, వినత, కద్రు. వీరిలో దితితో తప్ప మిగిలిన భార్యలందరితోనూ కశ్యప మహర్షికి సంతానం కలిగింది. దితి మనసులో అదే కోరిక మిగిలిపోయింది. సంతానం కావాలనే బలమైన కోరికతో ఉన్న దితి..ఒకరోజు విరహవేదన భరించలేక వాంఛతో కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లింది. ఆయన అప్పుడే అగ్నికార్యం నెరవేర్చి సూర్యాస్తమం  సమయంలో హోమశాల ముందు కూర్చుని ఉన్నారు. ఆసమయంలో అక్కడకు వచ్చిన దితి తన మనసులో కోర్కెను బయటపెట్టింది.కశ్యపునితో దితి వినయంగా..“స్వామీ నాతోడి సవతులు అందరు నీ కృపవల్ల గర్భవతులై సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం వ్యాకులమైన మనస్సుతో బాధపడుతున్నాను ..పుత్రభిక్ష పెట్టమని వేడుకుంది. అప్పుడు కశ్యపుడు ఏమన్నాడంటే...

"ఒక్క ముహూర్తకాలం ఆగు..ఇది సంధ్యాసమయం...ఇప్పుడు మన్మథునికి శత్రువైన శివుడు వృషభ వాహనుడై భూతగణాలతో కూడి విహరిస్తూ ఉంటాడు..కాబట్టి ఈ సమయం మంచిది కాదు. ఈ వేళలో కలయిక నిషేధం..మనం ధర్మాన్ని ఎందుకు అతిక్రమించాలి" అన్నాడు. అయినా సరే దితి తన పట్టు వదలలేదు. కశ్యపుడు తన భార్య కోరికను కాదనలేక పరమేశ్వరుడికి నమస్కరించి ఏకాంతంగా తన భార్య కోరిక తీర్చాడు. ఆ క్షణం నుంచి తేరుకున్న తర్వాత దితికూడా తాను చేసిన అపరాధాన్ని తలుచుకుని సిగ్గుతో తలవంచుకుంది. 
“అందరినీ సంరక్షించే ఓ పరమేశ్వరా నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా గర్భాన్ని రక్షించు" అని వేడుకుంది

Also Read: వైకుంఠ ద్వారపాలకులు విష్ణు మూర్తికి ఎందుకు విరోధులయ్యారు? మూడు జన్మలనే ఎందుకు ఎంచుకున్నారు?

ఆ తర్వాత దితి గర్భం దాల్చింది. దితి ఎంతో సంతోషించింది కానీ.. కశ్యుపుడుమాత్రం...
కశ్యపుడు: “నువ్వు మోహానికి తట్టుకోలేక , లోకనిందకు జంకకుండా సిగ్గూ భయమూ విడిచి పెట్టి, అకాలంలో వ్యామోహానికి లొంగిపోయావు. అందుకే  భూతగణాలచే ప్రేరేపించబడిన ఆ భగవంతుని అనుచరులు నీకు కుమారులై జన్మిస్తారు. మిక్కిలి శక్తి సంపన్నులూ, భయంకరమైన కార్యాలు చేసేవారూ, మహా బలవంతులు, అతి గర్విష్టులూ అయిన వారిద్దరూ తమ పరాక్రమంతో నిరంతరం సజ్జనులను బాధిస్తూ భూమికి భారమవుతారు. చివరకు ఆ శ్రీహరి చేతిలో హతమవుతారు.” అని చెప్పాడు
దితి:  'మన కుమారులు ఆర్యులకు అపరాధం చేసినందువల్ల ఆ బ్రాహ్మణుల కోపాగ్నికి బలికాకుండా, భగవంతుడైన శ్రీహరి చేతులలో మరణించడమనేది మహాభాగ్యం' అంది దితి. 
కశ్యపుడు: నువ్వు చేసిన విపరీతకార్యం వల్లనే ఈ దురవస్థ వచ్చింది. బాధపడొద్దు..ఆ శ్రీహరిని భక్తితో ప్రార్థించు.. నీ కొడుకుల్లో  హిరణ్యకశిపుడికి పుట్టే సంతానంలో నుంచి ధర్మబుద్ధి గలవాడూ, శ్రీహరి మీద మిక్కిలి భక్తి భావం కలవాడూ ( ప్రహ్లాదుడు) జన్మిస్తాడు. దుర్మార్గుడైన హిరణ్యకశిపుని పుత్రుడే అయినప్పటికీ శ్రీహరి భక్తుడు కావటం వల్ల వంశానికి పరమ పవిత్రుడౌతాడు. 

Also Read: కార్తీకమాసం ఎప్పటితో ఆఖరు, పోలిపాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం మొత్తం మీదే!

భువన కంఠకులైన ఇద్దరు కుమారులను కన్నది దితి. ఆ సమయంలో భూమి కంపించింది, పర్వతాలు వణికాయి,సముద్రాలు ఉప్పొంగాయి, నక్షత్రాలు నేల రాలాయి, అష్ దిక్కులు ఊగిపోయాయి, దిక్కుల్లోంచి నిప్పులు ఎగసిపడ్డాయి,భూమిపై పిడుగులు పడ్డాయి... ఇద్దరు పిల్లలు భూమ్మీద పడ్డారు. కుమారులను చూసేందుకు వచ్చిన కశ్యపుడు... “హిరణ్యకశిపుడు” ,  “హిరణ్యాక్షుడు” అనీ నామకరణం చేసాడు.

సంధ్యా సమయం ఎంత పవిత్రమైనదో అంతకన్నా శక్తివంతమైనది. అందుకే ఈ సమయంలో కేవలం దైవ ప్రార్థనలో మాత్రమే ఉండాలి కానీ ఎలాంటి శృంగార కార్యకలాపాలకు పాల్పడకూడదంటారు. కాదు కూడదు అనుకుంటే ఇలాంటి రాక్షస లక్షణాలున్నావారే భూమ్మీద అడుగుపెడతారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో అరాచకాలకు ఇలాంటి వారే కారణం అవుతున్నారు..అందుకే దేనికైనా సమయం సందర్భం ఉంటుంది అంటారు...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget