దక్షిణాదిన ఆషాఢ అమావాస్య తర్వాత పాడ్యమి నుండి ప్రారంభమవుతుంది. ఉత్తరాదిన ఆషాఢ పౌర్ణమి తర్వాత పాడ్యమి (జూలై 30) నుండి మొదలవుతుంది.
శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!
Dwadasa Jyotirlinga: శ్రావణమాసంలో ఉజ్జయిని మహాకాల్, కేదార్నాథ్ సహా జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయ్? దర్శించుకునే భాగ్యం లేనివారు ఏం చేయాలి? ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతున్నారు?

- శ్రావణమాసంలో శివ, పార్వతి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది.
- శ్రావణంలో జ్యోతిర్లింగ దర్శనంతో కష్టాలు తొలగి మోక్షం లభిస్తుంది.
- దర్శనం కుదరకపోతే, ఇంట్లో శివాభిషేకం, మంత్ర పఠనం చేయాలి.
- ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పఠనం పాప విముక్తి, శుభ ఫలాలనిస్తుంది.
Sravana Masam 2026: శ్రావణమాసంలో దక్షిణాదిలో శ్రావణ మంగళవారం మంగళగౌరి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి పూజల సందడి నడిస్తే..ఉత్తరాదిన పరమేశ్వరుడి ఆరాధనలో మునిగితేలుతారు భక్తులు. ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుంచి దక్షిణాదిన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అయితే ఉత్తరాదిన 15 రోజుల ముందే..ఆషాఢ పౌర్ణమి తర్వాత పాడ్యమి (జూలై 30 )నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. ఏదేమైనా శ్రావణమాసంలో అమ్మవారి ఆరాధనతో పాటూ అయ్యవారి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది.ఈ నెలలో శివారాధన చేయడం, జ్యోతిర్లింగ దర్శనం అత్యంత పుణ్యఫలం అంటారు ఆధ్యాత్మికవేత్తలు.
శివ పురాణం ప్రకారం, శ్రావణ మాసంలో శివుడిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఉత్తరాదిన జూలై 30 నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయ్. ఆలయాల వద్ద భారీ క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. సాధారణ రోజులతో పోలిస్తే శ్రావణ మాసంలో 12 జ్యోతిర్లింగ ఆలయాల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!
స్కంద పురాణంలోని కాశీ ఖండం ప్రకారం, శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రియమైనది. ఈ సమయంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించే భక్తులు గ్రహ దుష్ప్రభావాల నుంచి విముక్తి పొంది, మోక్ష మార్గాన్ని పొందుతారని నమ్ముతారు. ఒకవేళ ఏదైనా కారణంతో మీరు శ్రావణ మాసంలో జ్యోతిర్లింగాన్ని దర్శించుకోలేకపోతే, ఇంట్లోనే శివ భగవానునికి అభిషేకం చేసి ద్వాదశ జ్యోతిర్లింగ మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయువు మంచి ఆరోగ్యం, విజయం, వైవాహిక జీవితంలో సుఖం , సంతానం వంటి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
ఆది శంకరాచార్యులు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా అన్నారు
"ద్వాదశైతానీ నామానీ ప్రతరుత్థాయ యః పతేత్"
అంటే, సకల పాపాల నుంచి విముక్తి పొందడం, సకల పరిపూర్ణతల ఫలాలను పొందడం. దీని అర్థం ఏంటంటే ప్రతి ఉదయం 12 జ్యోతిర్లింగాల నామాలను స్మరించే లేదా పఠించే వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొంది, సకల సిద్ధులను శుభ ఫలితాలను పొందుతాడు. ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో పఠించడం వల్ల రెట్టింపు ఫలాలు లభిస్తాయి.
12 జ్యోతిర్లింగాలు - సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ (మమ్లేశ్వర్), కేదార్నాథ్, భీమశంకర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వరం, ఘృష్ణేశ్వర్.
మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?
శివ పురాణం ప్రకారం, పరమశివుడు అనంతమైన అగ్ని స్తంభం (జ్యోతి) రూపంలో అవతరించాడు. ఆయన తన భక్తుల సంక్షేమం కోసం భూమిపై 12 ప్రదేశాలలో జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరాడు.
జ్యోతిర్లింగ స్తోత్రం
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిನ್ಯಾಂ మహాకాలం ఓంకారమమలేశ్వరమ్ ||
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥
ఫలశృతి
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
చాతుర్మాస్యం ప్రారంభం.. నాలుగు నెలలు దీక్ష ఎవరైనా చేయొచ్చా , నియమాలేంటి, దీని వెనుకున్న ఆరోగ్యం రహస్యం తెలుసా?
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
Frequently Asked Questions
శ్రావణ మాసం ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో ఎప్పుడు మొదలవుతుంది?
శ్రావణ మాసంలో శివారాధన ప్రాముఖ్యత ఏమిటి?
ఈ నెలలో శివారాధన చేయడం, జ్యోతిర్లింగ దర్శనం అత్యంత పుణ్యఫలం. శివ పురాణం ప్రకారం, ఈ మాసంలో శివుడిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి.
శ్రావణ మాసంలో జ్యోతిర్లింగాలను దర్శించడం వల్ల లేదా మంత్ర పఠనం వల్ల కలిగే లాభాలు ఏమిటి?
గ్రహ దుష్ప్రభావాల నుండి విముక్తి పొంది, మోక్ష మార్గాన్ని పొందుతారు. దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, విజయం, వైవాహిక సుఖం మరియు సంతానం వంటి ఆశీస్సులు లభిస్తాయి.
శ్రావణ మాసంలో జ్యోతిర్లింగాన్ని దర్శించలేనివారు ఏమి చేయాలి?
ఇంట్లోనే శివ భగవానునికి అభిషేకం చేసి, ద్వాదశ జ్యోతిర్లింగ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు లభిస్తాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























