అన్వేషించండి

Chaturmasya Deeksha 2025: చాతుర్మాస్యం ప్రారంభం.. నాలుగు నెలలు దీక్ష ఎవరైనా చేయొచ్చా , నియమాలేంటి, దీని వెనుకున్న ఆరోగ్యం రహస్యం తెలుసా?

Chaturmasya 2025 : చతుర్మాసాలు అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి నుంచి కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి వరకు గల సమయం. ఈ నాలుగు నెలలు ఆచరించే దీక్ష నియమాలేంటి?

Chaturmasya Deeksha 2025: ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలు ప్రత్యేకమే. వాటిలో మొదటిది తొలి ఏకాదశి..దీనినే శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రసమయం ప్రారంభమవుతుంది. శ్రీ మహా విష్ణువు శయనించే ఈ నాలుగు నెలల కాలంలో చేపట్టేదే చతుర్మాస దీక్ష. ఈ నాలుగు నెలలు నేలపైనే నిద్రించడం, ఉద్రేకాన్ని కలిగించే ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం,  నిరంతరం దైవారధనలో సమయం గడపడం, రోజూ ఒక పూటమాత్రమే భోజనం చేయడం లాంటి ధర్మాలు పాటిస్తారు. 

పీఠాధిపతులు ఈ నాలుగు నెలలు దీక్షలో భాగంగా ఒకే దగ్గర ఉండిపోతారు..ఈ సమయంలో క్షురకర్మలు నిషేధిస్తారు. 

అసత్యమాడక, ధర్మ తప్పని సత్య హరిశ్చంద్రుడు తన భార్యకు దూరమైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించారు. అందుకే మంచే జరిగింది. సత్యమే గెలిచింది

చాతుర్మాస్య దీక్ష గురించి పురాణాల్లో ఉన్న కథ ఇది
 
ఓసారి కైలాసంలో శివపార్వతులిద్దరూ ఆశీనులై ఉండగా.. భర్త చేతిని తీసుకుని స్వామీ మీ చేయి ఇంత మృదువుగా ఉంది కారణం ఏంటని అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మృదువుగా, సున్నితంగా ఉంటాయని చెప్పాడట శివయ్య. ఎముకలేని చేయి అనే మాట వినే ఉంటారుగా..అదే ఇది. అంటే దానం చేసే చేయి అని అర్థం. ఆ మాట విన్న పార్వతీదేవికి పరోపకారం చేయాలనిపించింది. అందుకే మారువేషంలో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే  గర్భిణికి  సహాయంగా ఉంటూ సేవచేసి 11 రోజుల తర్వాత ఐశ్వర్యాన్ని కలగజేసి,   చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి మాయమైపోయింది. ఐదేళ్లు గడిచిన తర్వాత తిరిగి అదే ఇంటికి వెళ్లింది పార్వతీదేవి. అప్పుడు ఆమె వ్రతం ఆచరిస్తోంది. ఓ వృద్ధురాలి రూపంలో వెళ్లిన పార్వతీదేవి దాహం తీర్చమని అడిగితే..వ్రతంతో ఉన్నానని చెప్పి నీరిమ్మని తనవారిని ఆదేశించిందట. అవమానంగా భావించిన పార్వతీదేవి తిరిగి శివుడి దగ్గరకు వెళ్లి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయమని కోరిందట. చాతుర్మాస్య వ్రతం ఆచరించింది కావున ఐశ్వర్యం తిరిగి తీసుకోవడం సాధ్యంకాదన్నాడు. విష్ణువును అడిగితే అక్కడి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. చివరకు నారదుడు వెళ్లి నారేళ్లనాచికి అసలు విషయం చెప్పడంతో..ఆమె పార్వతీదేవిని శరణువేడి ప్రాయశ్చిత్తం కోరిందట  

చాతుర్మాస్యం వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు

ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః

చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల పాటూ  నాలుగు ఆశ్రమాల వారు  బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసంలో ఉన్నవారు అందరూ పాటించవచ్చు.  కుల, వర్గ నియమాలు లేవు..లింగవివక్ష లేదు. 

వాస్తవానికి చాతుర్మాస్య వ్రతం ఆరోగ్యానికి సంబంధించినది. వాతావరణంలో మార్పులు వచ్చే సమయం , సూర్య కిరణాలు వేడి తగ్గే సమయం కావడంతో రోగాలు విజృంభించే సమయం ఇది. అందుకే ఈ నాలుగు నెలలు ఆహార నియమాలు పాటిస్తారు. 

శ్రావణమాసంలో ఆకుకూరలు తినకూడదు
భాద్రపద మాసంలో పెరుగు ఎక్కువగా తీసుకోకూడదు
ఆశ్వయుజ మాసంలో పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండాలి
కార్తీక మాసంలో పప్పు పదార్థాలను ఆహారంలో తీసుకోపోవడమే మంచిది
ఈ నెలల్లో ఉసిరికాయలు వినియోంచవచ్చు...

చాతుర్మాస్య దీక్ష చేసేవారు ఈ నాలుగు నెలలు తాను నివసించే గ్రామం  ఎల్లలు దాటరాదు. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి వ్రతం ఆచరిస్తారు. ఈ దీక్ష చేపట్టిన వారు బ్రహ్మచర్యం పాటిస్తారు, ఒకపూటే భోజనం చేస్తారు. అసత్యమాడరు, హింస చేయరు, నిత్యం దైవారాధనలోనే ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు, యోగసాధన చేస్తారు.  

గమనిక: వివిధ గ్రంథాల నుంచి సేకరించిన వివరాలు, ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్న అంశాలను ఇక్కడ యథాతథంగా అందించాం.  ఇందులో పేర్కొన్న అంశాలు ప్రాధమిక సమాచారం కోసం మాత్రమే. మీరు పరిగణలోకి తీసుకుని ఆచరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget