అన్వేషించండి

Lord Balabhadra idol: ఒరిగిన బలభద్రుడి విగ్రహం.. పూరీ జగన్నాథుడి రథయాత్రలో వరుస అపశ్రుతులు - ఆందోళనలో భక్తులు!

Puri Rath Yatra: పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఈ ఏడాది వరుస అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. రథయాత్ర ప్రారంభమయ్యే సమయంలో తొక్కిసలాట జరిగి వందలమంది భక్తులు గాయపడ్డారు..ఇప్పుడు మరో అపశ్రుతి జరిగింది...

Puri Jagannath Rath Yatra 2024: ఏటా ఆషాఢమాసం రెండో రోజు...విదియ రోజు పూరీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది. పది రోజుల పాటూ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. తొమ్మిదిరోజుల పాటూ గుండిచా ఆలయం వద్ద ప్రత్యేక పూజలందుకునే జగన్నాథుడు..తిరిగి పదో రోజు బలభద్ర, సుభద్రతో కలసి బుహుదా యాత్రలో భాగంగా ఆలయానికి చేరుకుంటాడు. రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలమంది భక్తులు తరలివస్తారు. గర్భగుడి నుంచి కదలివచ్చే జగన్నాథుడి దర్శనం జన్మధన్యం అని భావిస్తారు. ఈ రథయాత్ర ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరగగా  ఇప్పుడు మరో అపశ్రుతి చోటుచేసుకుంది

Also Read: పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మపదార్థం కృష్ణుడి గుండె..ఈ ప్రచారంలో నిజమెంత!

ఒరిగిన బలభద్రుడి విగ్రహం

జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథాలు గుండిచా మందిరానికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సూర్యాస్తమయం అనంతరం  చతుర్థామూర్తుల పొహండి జరిగింది. ఇందులో భగంగా విగ్రహాలను రథం నుంచి కిందకు దించారు. బలభద్రుడి విగ్రహం కిందకు దించుతుండగా పక్కకు ఒరిగిపోయింది..ఈ ఘటనలో గాయపడిన తొమ్మిదిమందిని చికిత్సకోసం హాస్పిటల్ కి తరలించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అపశ్రుతులు జరగలేదని సేవాయత్ లు, భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆషాడమాసం శనివారం ప్రారంభకావడంతో..ఆదివారం రథయాత్ర జరిగింది. సాయంత్ర ప్రారంభమైన రథయాత్రలో లక్షలమంది భక్తులు పాల్గొన్నారు. ఐదు దశాబ్దాల తర్వాత ఒకేసారి మూడు వేడుకలు నిర్వహించడంతో రథయాత్ర మొదలయ్యేసరికి ఆలస్యం అయింది. పొద్దుపోవడంతో ఆదివారం సాయంత్రం రథయాత్ర మొదలైనా..సోమవారం కూడా కొనసాగింది. అయితే ఆదివారం సాయంత్రం రథయాత్ర ప్రారంభసమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందనా 400 మంది గాయపడ్డారు. ఆ తర్వాత చీకటి పడడంతో రథయాత్ర నిలిపేసి..సోమవారం ఉదయం తిరిగి ప్రారంభించారు...గుండిచా ఆలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. సంప్రదాయం ప్రకారం జగన్నాథ,బలభద్ర, సుభద్ర రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్న తర్వాత రోజు పొహండి జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ  సమయంలోనూ బలభద్రుడి విగ్రహం పక్కకు ఒరిగి అపశ్రుతి జరిగింది. దీంతో కొద్దిసేపు ఎక్కడి పనులు అక్కడ నిలిపేసి ఆ తర్వాత మూర్తులను ఆలయంలోకి చేర్చారు.  

Also Read: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!

జూలై 15 బహుదా యాత్ర

జూలై 07న రథయాత్ర మొదలైంది..తిరిగి జూలై 15న బహుదా యాత్ర జరగనుంది. అప్పటివరకూ గుండిచా ఆలయంలోనే పూజలందుకుని  బహుదాయాత్ర అనంతరం గర్భగుడికి చేరుకుంటాడు. పొహండి సమయంలో  జరిగిన ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పూరీ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వాస్తవానికి ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎలాంటి అపశ్రుతులు జరగవని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ చెప్పారు. శ్రీక్షేత్ర యంత్రాంగం సేవాయత్‌లకు పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా స్వామివారి సేవలతో ప్రమేయం ఉన్నవారు మాత్రమే రథాలపై ఉండారని పాలనాధికారి వీర్‌విక్రం యాదవ్‌ చెప్పారు కానీ రథయాత్రలో ఆ పరిస్థితి కనిపించలేదు. ఇంకా... జగన్నాథుని నందిఘోష్‌ రథంపై 70 మంది, బలభద్రుని వద్ద 60 మంది, దేవీ సుభద్ర సన్నిధిలో 50 మంది  సేవకులను మాత్రమే నియమించారు కానీ...ఆయా రథాలపై లెక్కలు మించి కనిపించారు. స్వామివారి దర్శనంకోసం తరలివచ్చిన లక్షలమంది భక్తులకు మూర్తులు కనిపించకుండా అడ్డంగా నిల్చున్నారు. తొక్కిసలాట జరిగేందుకు ఇది కూడా ఓ కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నయి. 

Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget