అన్వేషించండి

Navaratri Festival: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రం, రోజుకో నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఏ ఇవన్నీ ప్రాంతాన్ని బట్టి మారుతాయి. భక్తి ప్రధానం కానీ ఇలాగే చేయాలనేం లేదంటారు పండితులు.

విజయ దశమి, దసరాగా పిలిచే పర్వదినాలు మొదలయ్యాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మనలో ఉండే చెడుని నాశనం చేయాలని మొదటి మూడు రోజులు, సంపదను ప్రసాదించాలని తర్వాతి మూడు రోజులు, జ్ఞానాన్నివ్వాలని చివరి మూడు రోజులు ప్రార్థిస్తారు. అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రంగు వస్త్రం సమర్పిస్తారు. ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం నివేదిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా పాటిస్తారు...
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి: మొదటి రోజు  శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా  అలంకరిస్తారు. ఈ రోజున అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎరుపు రంగు ఉత్తేజానికి సంకేతం.  కట్టు పొంగలిని నైవేద్యం పెడతారు.
ఆశ్వయుజశుద్ధ విదియ: రెండో రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. ఈ రోజు బంగారు వర్ణ వస్త్రంతో అలంకరిస్తారు. బంగారు రంగు చెడు శక్తులను తొలగిస్తుందని విశ్వాసం. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెడతారు. 
ఆశ్వయుజ శుద్ధ తదియ: .మూడో రోజు అమ్మవారి అవతారం గాయత్రీదేవి.  ఈ అమ్మవారిని జ్ఞానానికి ప్రతిరూపంగా చెబుతారు.  ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఆటంకాలు తొలగించి సకల శుభాలనిచ్చే రంగు ఇది.  కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. కొబ్బరిని పూర్ణఫలం అంటారు..అందుకే పూర్ణ ఫలితం దక్కాలని కొబ్బరి అన్న నివేదిస్తారు. 
ఆశ్వయుజ శుద్ధ చవితి: ఈరోజు  శ్రీ లలితా దేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు.  లిలితా అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించి కేసరి నైవేద్యం పెడతారు. 
ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి:  ఈ రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు రావడంతో అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాలక్ష్మీ దేవిని  గులాబీరంగు వస్త్రంతో అలంకరించి కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు, 
ఆశ్వయుజ శుద్ధ సప్తమి: శ్రీ సరస్వతీ దేవి అలంకారం: మూల నక్షత్రం రోజున సరస్వతిదేవిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై తెల్లని వస్త్రంతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం.  ఈ రోజున దధ్యోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. 
ఆశ్వయుజ శుద్ధ అష్టమి: ఈ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.  దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజు అమ్మవారిని  ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించి...చక్కెరపొంగలి వైవేద్యంగా సమర్పిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ నవమి: మహర్నవమి రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో కనిపించే అమ్మవారికి  నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. నీలం రంగు యుద్ధానికి సంకేతం అని..ఈ రంగు వస్త్రం ధరించి మహిషాసురుడిని అమ్మవారు సంహరించారని చెబుతారు. ఈ రోజున శుభానికిసంకేతంగా పాయసం నివేదిస్తారు. 
ఆశ్వయుజ శుద్ధ దశమి: ఇదే విజయదశమి. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇది శుభానికి సంకేతం. గారెలు, పాయసం అన్ని అమ్మవారికి పెట్టవచ్చు.
ఇలా చేస్తేనే అమ్మవారి కరుణ ఉంటుందనే భ్రమలో ఉండొద్దని కూడా పండితులు చెబుతారు. నిశ్చలమైన భక్తి ముఖ్యం అంటారు. 

Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read:ఈ రాశుల వారు శుభవార్త వింటారు..వారు ఆర్థికంగా లాభపడతారు..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget