అన్వేషించండి

Mystery Of Madhurai Meenakshi Temple: చారిత్రక మీనాక్షి ఆలయంలో ఉన్న శ్రీ చక్రం గురించి మీకు తెలియని రహస్యం - ఇది తెలుసుకోవడమే జన్మ ధన్యం!

Pawan Kalyan: మధురై పట్టణంలో కొలువైన శ్రీ మీనాక్షి అమ్మన్, శ్రీ సోమసుందరేశ్వన్ ను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు..ఈ ఆలయం గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

Madhura Meenakshi Story : అష్టాదశ  శక్తిపీఠాల్లో ఒకటి మధురై మీనాక్షి ఆలయ. మీనాల్లాంటి విశాలలమైన కళ్లతో మరకతశిలతో చెక్కిన అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ కళ్లనిండుగా దర్శించుకోవచ్చు. మధురైను పాలించిన పాండ్యరాజులంతా మీనాక్షిని తమ ఇంటి ఆడపడుచుగా , కులదేవతగా ఆరాధించేవారు. 

దేవీ భాగవతపురాణంలో ఉండే మణిద్వీప వర్ణనను అనుసరిస్తూ ఆలయాన్ని నిర్మించారు. చతుష్షష్టి కళానిలయమైన  ఈ ఆలయం ఒకప్పుడు పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో...రాత్రి వేళ ఆ వైపు చూడాలంటనే భయపడేలా ఉండేది. రోజంతా భక్తులతో పూజలందుకునే మీనాక్షి..చీకటి పడేసరికి నగరంలో సంచరిస్తూ సంహారానికి పాల్పడేది. అమ్మవారిని శాంతపరిచేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక చీకటి పడిన తర్వాత నగరంలో ఎవరూ తిరగకూడదనే నిబంధన విధించారు. అమ్మవారిలో సగభాగం అయిన సుందరేశ్వరుడు మధురై క్షేత్ర పాలకుడు అయిఉండి  కూడా ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు.

Also Read: పవన్ కళ్యాణ్ వెళ్లిన స్వామిమలై విశిష్టత ఏంటి - ఈ ఆలయానికి చేరుకోవడం ఇంత సులభమా!
 
ఇలాంటి సమయంలో మధురైలో అడుగుపెట్టారు ఆదిశంకరులు. ఘనంగా ఆహ్వానం పలికిన పాండ్యరాజు సకల మర్యాదలు చేసి రాజ్యంలో బస ఏర్పాటు చేశారు. అయితే ఈ రాత్రికి ఆలయంలోనే బస చేస్తానన్నాడు శంకరాచార్యులు. ఆ మాట విని కంగారుపడిన పాండ్యరాజులు నగరంలో జరుగుతున్నదంతా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడకు వెళ్లొద్దంటూ ప్రాధేయపడ్డాడు పాండ్యరాజు. కానీ భిక్షకు వచ్చేవారు గృహస్తుల ఇంట్లో బస చేయకూడదని చెప్పి ఆలయానికే వెళతా అన్నాడు. శంకరుడి తేజస్సుతో ఉన్న ఆబాలుడిని మాళ్లీ చూడలేనేమో అనుకున్నాడు పాండ్యరాజు.  

సూర్యస్తమయం అవడంతో నగరం మొత్తం ప్రశాంతంగా మారిపోయంది. ఆలయంలో గంటలు మోగాయ్...దీపాలు మొత్తం వాటంతట అవే వెలిగాయ్..అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది.  అమ్మవారు కళ్లు తెరిచి నెమ్మదిగా లేచి నిల్చుంది. గర్భగుడి నుంచి బయటకు అడుగుపెట్టింది. ఎందురుగా ఉన్న మండపంలో ధ్యానంలో ఉన్న బాల శంకరులను చూసింది. ఎవరీ బాలుడు..చూస్తుంటే పుత్రుడిలా అనిపిస్తున్నాడు అనుకుంటుంది ( శంకరుడి అంశ అంటే శివయ్య తనయుడే కదా మరి పుత్ర వాత్సల్యం వస్తుంది కదా). గర్భగుడిలో ప్రశాంతంగా కనిపించిన మీనాక్షి అమ్మ...గర్భగుడి దాటగానే ఓ మాయా స్వరూపం ఆవహించింది. అప్పుడే అమ్మను చూసిన శంకరులు.. స్తుతించడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి అమ్మ అడుగులు ముందుకు పడడంలేదు. నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించింది మీనాక్షి. అప్పుడు కూడా బాల శంకరులు ప్రణామం చేసి..."అంబా శంభవి! చంద్ర మౌళి రబలా అంటూ కీర్తించడం కొనసాగించారు. 

బాల శంకరుల స్తుతికి కరిగిపోయిన మీనాక్షి అమ్మ..వరం కోరుకో అని అడిగింది. పాచికలు ఆడుదాం అని ఠక్కున అడిగారు శంకరులు. నేను ఓడితే నా భర్త ఆజ్ఞమేరకు నడుచుకుంటా ..నువ్వు ఓడితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటుంది. కానీ ఆటలో ఉన్నప్పుడే ప్రశ్నలు సంధిస్తుంది మీనాక్షి.  అలా అమ్మకు శంకరులు చెప్పిన సమాధానాలే  దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్రనామాలు, అష్టోత్తర శతనామస్తోత్రాలు. ఇక శంకరులు కూడా..అమ్మా నేను ఓడితే నీకు ఆహారం అవుతా..నువ్వు ఓడితే నగర సంహారం ఆపేయాలి అంటాడు. అదే క్షణం బాల శంకరుడిలో ఓ మెరుపు వచ్చి చేరిది. అదే శంకరుడిది. ఇక శంకరాచార్యులి మాటకు అంగీకరించిన అమ్మ వెనక్కు వెళ్లి గర్భగుడిలో కూర్చుంది. ఆట ప్రారంభించారు. 

Also Read: ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం - పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!
 
తెల్లవారిపోతోంది..త్వరగా ఆట ముగించేస్తే సంహారానికి వెళ్లిపోవచ్చని అమ్మవారు చకచకా పాచికలు కదుపుతోంది. ఇదే చివరి పందెం అని పాచికలు వేసిన అమ్మవారు నేను గెలిచా అంది. తల్లి చేతిలో ఓడడం కన్నా బిడ్డకు ఏం కావాలి చెప్పు అన్న శంకరులు.. ఓసారి ఆటమొత్తం చూడమ్మా అన్నాడు. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా ఈ గెలుపు నాదే అన్నాడు. పాచికలు ఆడడంలో భాగంగా  శ్రీ చక్రాన్ని గీశారు శంకరులు. ఈ చక్రం నీ దేహం..రాత్రంతా నా తపస్సు శక్తిని ధారపోసి వేసిన ఈ చక్రాన్ని తిరిస్కరిస్తావా అని అడుగుతాడు. అంటే పాచికల కోసం గడులు గీస్తున్నట్టే గీస్తూ..అక్కడ శ్రీ చక్రం వేసి అమ్మవారిని నిలిపేశారు శంకరులు. ఆ శ్రీ చక్రం దాటి మీనాక్షి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అప్పుడు ప్రత్యక్షమైన సుందరేశ్వరుడు నీ తామస శక్తిని అదుపుచేసేందుకు కారణ జన్ముడు దిగిరావాలి అందుకే నా అంశతో జన్మించిన శంకరులు నీ పుత్రుడిగా వచ్చాడని చెబుతాడు.  
 
తెల్లారేసరికి ఆలయం వైపు పరుగుతీసిన పాండ్యరాజు..అక్కడ ఏం జరుగుతోందో చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి దూరంగా నిల్చుని అమ్మవారిని అయ్యవారిని స్తుతిస్తూ ఆది శంకరులు కనిపించారు. ఇకపై అమ్మవారు తామస శక్తిగా మారదనే అభయం ఇచ్చారు. అందుకే శ్రీ చక్రాన్ని దర్శించుకుంటే చాలు..న్యాయబద్ధమైన ఏ కోర్కెలు అయినా నెరవేరుతాయని చెబుతారు. మీనాక్షి కొలువైన గర్భగుడి కింద ఉందా శ్రీ చక్రం.. అందుకే ఆ పరిసరాల్లో అడుగుపెడితే చాలు ఏదో దివ్య శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది.

Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!
Karimnagar Cricketer Aman Rao : రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
Director Kiran Kumar Death: తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
Telangana Latest News: పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget