అన్వేషించండి

Maha Kumbh End Date 2025: కుంభమేళా కి కౌంట్ డౌన్.. ఎలాంటి కష్టం లేకుండా వెళ్లి వచ్చేయాలి అనుకుంటే ఇలా చేయండి!

Suggestions For Maha Kumbh Tourists: కుంభమేళాకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో రెండు వారాల్లో ముగిసిపోతుంది. ఈ లోగా త్రివేణి సంగమంలో స్నానమాచరించాలి అనుకుంటే ఇలా చేయండి....

Maha Kumbh End Date 2025:  జనవరి 13 భోగి రోజు ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగిసిపోతుంది. ఇప్పటికే దాదాపు నెల రోజులు గడిచిపోయింది. ఇక 15 రోజులు మాత్రమే ఉంది. ఆరంభంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆగిపోయినవారంతా.. ఆఖరి రెండువారాల్లో వెళ్లాలి అనుకుంటారు. అయితే మీ కోసమే ఈ సూచనలు. 

ఇప్పటివరకూ కుంభమేళాకు స్వయంగా వెళ్లి త్రివేణి సంగమంలో స్నానమాచరించి వచ్చిన భక్తులు షేర్ చేసుకున్న వివరాలివి. మీకు చాలా ఉపయోగపడతాయి..

కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోయి..మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అందుకే కుంభమేళాలో స్నానమాచరించి..పితృదేవతలను స్మరించుకుంటారు. పుణ్యం కోసం చేసే ఈ ప్రయాణం సంతోషంగా గుర్తుండిపోవాలి.

Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!

టీవీల్లో, పేపర్లలో చూపినంత క్రౌడ్ కుంభమేళా దగ్గర లేదంటున్నారు కొందరు భక్తులు. టీవీల్లో చూపిస్తున్న క్రౌడ్  విజువల్స్ నిజం కాదా అంటే.. నిజమే...అవన్నీ కేవలం సంగం ఘాట్ దగ్గరవి మాత్రమే. సంగం ఘాట్ కాకుండా చాలా ఘాట్స్ ఉన్నాయి...అక్కడ పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య తక్కువే ఉంది. అందుకే మీరు సంగం ఘాట్ కి కాకుండా మిగిలిన ఘాట్ లకు వెళ్లడం మంచిది

ప్రయాగ రాజ్ లో మొత్తం 41 ఘాట్ లు ఏర్పాటు చేశారు. ఏ ఘాట్ నుంచి అయినా త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేందుకు బోట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరికి 400 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు..భక్తుల రద్దీని బట్టి ఈ ఛార్జ్ పెరుగుతుంది.  

Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
 
కుంభమేళాకి వెళ్లేవారు కనీసం 10 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధపడండి. ఎందుకంటే సంగం ఘాట్ దగ్గరకు వాహనాలను అనుమతించడం లేదని ముందునుంచీ చెప్పుకుంటున్నాం. అక్కడివరకూ వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే.  ముఖ్యంగా ఫుడ్ గురించి టెన్షన్ పడొద్దు. ఎక్కడికక్కడ ఉచితి టిఫిన్లు ఇస్తున్నారు...చాలా కంపెనీలు స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు. 

సంక్రాంతి సమయంతో పోలిస్తే రథసప్తమి తర్వాత చలి బాగా తగ్గింది. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.   సింగిల్ గానో, ఫ్రెండ్స్ తోనో వెళితే పర్వాలేదు కానీ... చిన్నారులు, పెద్దోళ్లని తీసుకెళ్తే మాత్రం ముందుగానే అకామిడేషన్ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. రిటర్న్ జర్నీ విషయంలోనూ ఎలాంటి కంగారు అవసరం లేదు. నాగపూర్ వరకూ వెళ్లినా అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ఈజీగా చేరుకోవచ్చు. ట్రైన్లో వెళ్లేవారు మాత్రం రష్ విషయంలో ముందుగానే ప్రిపేర్ అవండి. 

సెక్టార్ త్రీలో మహాకుంభ డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్,  నాగసాధులు ఉండే సెక్టార్ ,  టెంట్ సిటీ చూసి వస్తే మీకు మాహా కుంభమేళా యాత్ర గుర్తుండిపోతుంది.

కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌రాజ్‌ దారులన్నీ నిండిపోతున్నాయ్. ప్రయాగ్‌రాజ్‌-కాన్పుర్‌, ప్రయాగ్‌రాజ్‌-లఖ్‌నవూ-ప్రతాప్‌గఢ్‌, ప్రయాగ్‌రాజ్‌-వారణాసి-మిర్జాపుర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. రోజుల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ రష్ గురించి సోషల్ మీడియాలో వరుస పోస్టులు, వీడియోస్ పెడుతున్నారు నెటిజన్లు.

Also Read:  ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!

 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit 2025: కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
Andhra Pradesh New districts :  ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
Asaduddin Owaisi:  మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit 2025: కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
కొన్ని సార్లు నోరుమూసుకుని ఉండాలని రాజకీయం నేర్పింది - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో అన్నామలై సంచల వ్యాఖ్యలు
Andhra Pradesh New districts :  ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
Asaduddin Owaisi:  మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Tata Sierra Launch : ఐకానిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా వచ్చేసింది; ప్రారంభ ధర ఎంత? బుకింగ్స్‌ ఎప్పటి నుంచి మొదలు?
ఐకానిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా వచ్చేసింది; ప్రారంభ ధర ఎంత? బుకింగ్స్‌ ఎప్పటి నుంచి మొదలు?
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Embed widget