అన్వేషించండి

Karthika Puranam: పాపాలన్నీ చేసేసి 'నారాయణ' అంటే పుణ్యం వస్తుందా? అజామిళుని కథ ద్వారా తెలుసుకోండి! కార్తీకపురాణం DAY-8

Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. ఎనిమిదవ రోజు చదువుకోవాల్సిన కథ ఇది

కార్తీకమాసం DAY-8 అక్టోబరు 29:  కార్తీకపురాణం  ఎనిమిదవ అధ్యాయం 

వశిష్ఠ మహర్షి  చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నీ శ్రద్దగా విన్నాను. ఆ ప్రకారం.. ధర్మం సుక్షమని, పుణ్యం సులభంగా కలుగుతుందని ... నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని చెప్పారు. ఇంత  స్వల్ప ధర్మములతోనే మోక్షం  లభించినప్పుడు వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని కూడా చెబుతారు కదా? మరి మీరు  సూక్ష్మములో మోక్షంగా కనబరచినందుకు ఆశ్చర్యం కలుగుతోంది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, మహాపాపాలు చేసినవారంతా తేలికగా మోక్షం పొందడం అంటే వజ్రపు కొండను గోటితో పెకిలించటం లాంటిదే..దీన్ని వెనుకున్న మర్మమును మరింత వివరంగా చెప్పమని అడిగాడు జనకమహారాజు

వశిష్ఠమహర్షి చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు

"జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగాలను పఠించాను. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవేంటంటే  సాత్త్విక, రాజస, తామసములు అనే మూడు రకాల ధర్మాలు
 
సాత్విక ధర్మం

మనోవాక్కాయ కర్మలతో ఆచరించేదే సాత్విక ధర్మం. సాత్త్విక ధర్మము సమస్త పాపాలను నశింపచేసి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణనది సముద్రంలో కలిసే మార్గంలో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాల సమయంలో స్నానమాచరించడం... దేవాలయముల్లో వేదాలు పఠిస్తూ, సదాచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు దానధర్మాలు చేసినవారు విశేష ఫలం పొందుతారు. 

రాజస ధర్మం

 ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసినదే రాజస ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగిస్తుంది

తామస ధర్మం

శాస్త్రోక్త విధులను విడిచి  డాంబికం కోసం చేసేదే తామస ధర్మం. ఇలాంటి ధర్మం ఫలాన్నీయదు
 

పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మం అయినట్టు  శ్రీ మన్నారాయణుని నామం, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి  పొందుతారు. ఇందుకు ఓ  ఇతిహాసం ఉంది చెబుతాను విను రాజా..
 
అజామిళుని కథ

పూర్వ కాలం కన్యాకుబ్జమనే నగరంలో నాల్గువేదములు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు సత్యవ్రతుడు. సకల సద్గుణరాశి   హేమవతి ఆయన భార్య. ఆ దంపతుల అన్యోన్య ప్రేమకు గుర్తుగా చాలా కాలానికి లేక లేక కుమారుడు జన్మించాడు. అతి గారాబంగా పెంచి అజామిళుడు అనే పేరు పెట్టారు. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాబంతో పెద్దల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.  దుష్ట సావాసాలు చేస్తూ, విద్య నేర్చుకోక, బ్రాహ్మణ ధర్మాలు పాటించక రోజులు గడిపేసేవాడు. కొంత కాలానికి యవ్వనుడు కాగానే మంచి చెడ్డలు మరిచి, కామాంధుడై, మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితాన్ని తెంచి..మద్యం సేవిస్తూ..పర స్త్రీలతో కామక్రీడల్లో తేలేవాడు. ఇంటికి రాకుండా తల్లిదండ్రులను కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోయేవాడు. 

అతిగారబం ఎంతపని చేసిందో విన్నావా జనకరాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా పైకి తెలియక చిన్నప్పటి నుంచి అదుపు  ఆజ్ఞలతో నుంచకపోతే ఇలాగే జరుగుతుందని చెప్పారు వశిష్ఠమహర్షి.

అలా అజామిళుడు కులభ్రష్టుడిగా మారడంతో బంధుమిత్రులు కూడా విడిచిపెట్టేశారు. మరింత రెచ్చిపోయిన అజామిళుడు వేటాడుతూ..కిరాతకుడిగా మారాడు. తాను కలసి ఉండే స్త్రీతో అడవికి వెళ్లాడు. కాసేపు వేయాడిన తర్వాత పండ్లు కోసేందుకు చెట్టెక్కిన ఆ స్త్రీ ... పక్కనే ఉన్న తేనెపట్టు తీయబోతూ జారిపడి మరణించింది. ఆ స్త్రీపై పడి ఏడ్చిన అజామిళుడు.. అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి చేరుకున్నాడు. ఆమెకు అప్పటికే ఓ కుమార్తె ఉండేది. ఆమె యుక్తవయసుకి రావడంతో అజామిళుడు ఆమెను కూడా వీడలేదు. వారిద్దరికీ ఓ కొడుకు కలిగాడు. ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టారు. అప్పటికే అయినవారంతా దూరం పెట్టేయడంతో కొడుకే ప్రాణంగా మారిపోయాడు. నారాయణ నారాయణ అంటూ అజామిళుడు కొడుకుని ‍ఒక్క క్షణం కూడా వీడకుండా ఉండేవాడు. కాని 'నారాయణ'యని స్మరిస్తేనే మోక్షం అని తనకు తెలియదు..కొంతకాలానికి శరీరపటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టాడు. నిత్యం నారాయణ అని స్మరిస్తూనే.. చావు అంచున ఉన్నప్పుడు కూడా నారాయణ నారాయణ అని ప్రాణం విడిచాడు. 

 అజామిళుడు చేసిన పాపాలకు నరకానికి తీసుకెళ్లేందుకు యమభటులు వచ్చారు. నారాయణ నారాయణ అని స్మరిస్తూ ప్రాణం వీడడంతో విష్ణు దూతలు వచ్చారు. అత్యంత దుర్మార్గుడు అయిన అజామిళుడిని వైకుంఠానికి ఎలా తీసుకెళ్తారని యమభటులు ప్రశ్నించారు. ఎన్ని పాపాలు చేసినా నారాయణ మంత్రం జపిస్తూ వచ్చాడు..ప్రాణం పోయే క్షణంలోనూ నారాయణ అంటూ ప్రాణం విడిచాడు.. అందుకే ఇతడిని వైకుంఠానికి తీసుకెళ్తామని చెప్పారు విష్ణుదూతలు

 స్కాంద పురాణం వశిష్ఠప్రోక్త కార్తిక మహాత్మ్యంలో ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Advertisement

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget