అన్వేషించండి

Swami Ramdev On 31st Sanyas Diwas: అందరూ శ్రీరామచంద్రుడి లాంటి వ్యక్తిత్వాన్ని కలిగిఉండాలన్న బాబా రామ్‌దేవ్ 

Baba Ramdev: శ్రీ రాముడి సద్గుణాలను, వ్యక్తిత్వాన్ని అంతా అనుసరించాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్ . స్వామి రామ్‌దేవ్ 31వ సన్యాస దివస్ సందర్భంగా  హరిద్వార్‌లోని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు

Swami Ramdev On 31st Sanyas Diwas Baba Ramdev: స్వామి రామ్‌దేవ్ 31వ సన్యాస దివస్‌ను హరిద్వార్‌లోని పతంజలి వెల్‌నెస్‌లో యోగా భవన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నవరాత్రి యజ్ఞం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ స్వామి రామ్‌దేవ్‌కు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రసగించించిన యోగా గురువు బాబా రాందేవ్ భారతదేశం సనాతన సంస్కృతి, ఋషి-వేద సంప్రదాయం, రాముడు-కృష్ణుడు, ఆదిశక్తి గురించి మాట్లాడారు. మనిషిలో పేరుకుపోయిన చీకటి, అజ్ఞానం, ప్రతికూలత అనే రాక్షసులను జయించి రాముడి లాంటి స్వభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు బాబా రాందేవ్. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. దుష్టశిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మనిషి రూపంలో భూమిపై అవతరించి ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది.  చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో జన్మించాడు దశరథ తనయుడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను  సొంతబిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రాముడిని షోడస గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి  నిలువెత్తు నిర్వచనంగా రాముడిని చూపిస్తారు. మనిషి అంటే ఇలా బ్రతకాలి అని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. ఈ జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు శ్రీరాముడు. అయనము అంటే నడక అని అర్థం.. రామాయణం అంటే రాముని నడక అని అర్థం. ఆ నడకను అనుసరించాలి, ఆ గుణాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు బాబా రాందేవ్.
 
తాను సన్యాసిగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సన్యాసి జీవితంలోకి అడుగుపెడుతున్నానని చెప్పారు. సన్యాసికి ఒకే ఒక విధి ఉందని - యోగధర్మం ద్వారా రాష్ట్రధర్మం, సేవాధర్మం, యుగధర్మాన్ని నిర్వర్తించడం, ఈ దేశానికి ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు , సంస్కృతిని అందించడం అని ఆయన అన్నారు. చైత్ర నవరాత్రుల సందర్భంగా నవమి రోజు ప్రత్యేకంగా బాల పూజ చేశారు. ఈ పూజలో పాల్గొన్న బాబా రాందేవ్  బాలికల పాదాలు కడిగి, వారికి తినిపించి, ఆశీర్వాదాలు పొందారు. సాధారణంగా ఆశ్వయుజమాసంలో వచ్చే దసరా నవరాత్రుల్లో బాలపూజ/కౌమారీ పూజ చేస్తారు. అలాగే చైత్ర మాసంలో వచ్చే మొదటి తొమ్మిది రోజులను చైత్ర నవరాత్రులు పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు రోజుకే అలంకారంలో అమ్మవారిని అలంకరించి నవదుర్గలను ఆరాధిస్తారు. ఇందులో భాగంగా బాలపూజ చేశారు బాబా రాందేవ్.  
 
బాబా రామ్‌దేవ్ సన్యాసం తీసుకోవడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువలకు కీర్తిని అందించారని..భారతదేశ వైభవ సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేశారని ఆచార్య బాలకృష్ణ అన్నారు. సనాతన ధర్మంలో నవరాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. తల్లి భగవతి అందరినీ ఆశీర్వదించాలి, ప్రతి ఒక్కరి జీవితంలో శుభం, ఆరోగ్యం, శ్రేయస్సు,  ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన ప్రార్థించారు. బాల పూజతో మనిషిలో దుర్గుణాలు, దుష్టశక్తులు, చెడు అలవాట్లు, రాక్షస స్వభావాన్ని జయించాలని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర నవరాత్రి భారతదేశ గొప్ప సంస్కృతి , సంప్రదాయంలో ఒక భాగం. దానిని అనుసరించడం మన కర్తవ్యం అని పిలుపునిచ్చారు ఆచార్య బాలకృష్ణ.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Guru Purnima Wishes 2026: మహామహుల సందేశాలు, శ్లోకాలతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి!
మహామహుల సందేశాలు, శ్లోకాలతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి!
2026 సూర్యగ్రహణం: ఆగస్టు 11న శుభప్రదమైన పనులు, సూతకం లేకున్నా ఇవి చేయడం మంచిది!
2026 సూర్యగ్రహణం: ఆగస్టు 11న శుభప్రదమైన పనులు, సూతకం లేకున్నా ఇవి చేయడం మంచిది!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
శ్రావణంలో శివుడికి నీటి అభిషేకం ఎందుకు? నీలకంఠుడి కథతో మన జీవితానికి లింకేంటి?
శ్రావణంలో శివుడికి నీటి అభిషేకం ఎందుకు? నీలకంఠుడి కథతో మన జీవితానికి లింకేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget