అన్వేషించండి

Dussehra 2022: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని పూజిస్తారు. విజయవాడలో దుర్గమ్మ మొదటి రోజున స్వర్ణకవచ అలంకృతరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపం వెనుక ఎంతో విశిష్టత ఉంది తెలుసా..

మాతర్మే మధు కైటభఘ్ని మహిష ప్రాణాప హారోద్యమే
హేలా నిర్మిత ధూమ్రలోచన వధే, హేచండ ముండార్దిని!
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే! నిత్యే! నిశుంభావహే
శుంభధ్వంసిని సంహారాశు దురితం దుర్గే - నమస్తేంబికే!!

స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి రూపం ఎలా వచ్చిందంటే..
దుర్గముడు అనే రాక్షసుడి ఘోర తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అని అడగ్గా.."నాకు వేదములన్నీ వశము కావాలి ", దేవతలను జయించాలి " అని అన్నాడు. అప్పుడు చతుర్ముఖుడు తధాస్తు అనక తప్పలేదు. వేదాలన్నీ దుర్గముడిలోకి ప్రవేశించాయి..బ్రాహ్మణులంతా వేదాలు మర్చిపోయారు, సంధ్యావందనాలు లేవు, యజ్ఞయాగాలు లేవు, దేవతలకు హవిస్సు లేక విలవిల్లాడిపోయారు. దేవతలు సంతృప్తి చెందకపోవడంతో వర్షాలు లేవు, పంటలు లేవు భూమండలం అంతా క్షీణించిపోయింది. జనులంతా నాశనమైపోతుంటే దుర్గముడు సంతోషిస్తాడు. అప్పుడు దేవతలంతా కలసి అమ్మని ప్రార్థిస్తారు. అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపానికి " శతాక్షి " అని పేరు పెట్టారు.

Also Read: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!

ఒంటి నిండా కళ్లతో దర్శనమిచ్చిన శతాక్షి అమ్మ..దేవతల ఆవేదనంతా విని..మిమ్మల్ని చూసేందుకు ఇన్ని కళ్లు పెట్టుకుని ఉన్నాను ఎందుకు భయం అని అభయం ఇచ్చింది. అప్పుడు అమ్మవారు..తన ఒంటినిండా ఉన్న కళ్లనుంచి నీరు కారుస్తూ బ్రహ్మాండం అంతా కరుణరసాన్ని నింపేసింది. అప్పటికప్పుడే మళ్లీ పరిస్థితులన్నీ మారిపోయాయి. యజ్ఞయాగాదులు లేక హవిస్సు సమర్పించకపోవడం వల్ల ఆకలిగా ఉందమ్మా..నిన్ను స్తుతి చేయడానికి కూడా ఓపిక లేదని అనడంతో శాకాంబరిదేవిగా అవతరించింది అమ్మవారు. అందరికి పళ్ళు,కాయగూరలు ఇచ్చింది. మళ్లీ హోమాలు మొదలయ్యాయి, యజ్ఞాలు జరిగాయి..దేవతలకు హవిస్సు వచ్చింది. 

Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం

ఎండి నీరసపడిపోయిన బ్రహ్మాండం అంతా మళ్ళీ చిగిరించడం చూసి దుర్గముడు ఆలోచనలో పడతాడు. అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది. దుర్గముడితో యుద్ధానికి సిద్ధమైన అమ్మ..ముందు దేవతలందరకీ రక్షణ కవచం వేసి పదకొండు రోజుల పాటూ యుద్ధం చేసి దుర్గముడి బాధనుంచి విముక్తి కల్పించింది, వేదాలను రక్షించింది. దేవతలకు రక్షణ కవచం వేసి అందర్నీ కాపాడినందునే నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మని " స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి" రూపంలో పూజిస్తారు. 

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.... 

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురాలైన మహాతల్లి, రక్కసి మూకలను అడ్డగించిన అమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనం, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం విశిష్ఠత తెలిసినా, తెలియకపోయినా పోతనరాసిన ఈ పద్యం చదివినట్టైతే అన్నీ సత్ఫలితాలుంటాయని పండితులు చెబుతారు. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mrigashira Karte 2026 Dates: రోహిణి కార్తె ముగింపు, మృగశిర కార్తె ప్రారంభం - వానలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?
రోహిణి కార్తె ముగింపు, మృగశిర కార్తె ప్రారంభం - వానలు ఎప్పటి నుంచి మొదలవుతాయి?
World Oldest Religion: ప్రపంచంలో అత్యంత పురాతన మతం ఏది? శాస్త్రీయ , చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయ్?
ప్రపంచంలో అత్యంత పురాతన మతం ఏది? శాస్త్రీయ , చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయ్?
The Legend of Kirtimukha: దిష్టి నుంచి రక్షించే దెయ్యం రహస్య కథ! దాని మూలం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
దిష్టి నుంచి రక్షించే దెయ్యం రహస్య కథ! దాని మూలం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
Yamuna Pushkaralu 2026: యుమునా కేవలం నది కాదు - శ్రీ కృష్ణుడికి లీలలకు సాక్షి, ప్రేమికురాలు, సహచరి!
యుమునా కేవలం నది కాదు - శ్రీ కృష్ణుడికి లీలలకు సాక్షి, ప్రేమికురాలు, సహచరి!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget