అన్వేషించండి

Bangladesh: అజాన్..నమాజ్ సమయంలో దుర్గాపూజ ఆపేయండి!

Bangladesh : అజాన్..నమాజ్ సమయాల్లో దుర్గా పూజ కార్యక్రమాలను ఆపివేయండి...బంగ్లాదేశ్‌ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎండీ జహంగీర్ ఆలం హిందూ సంఘాలకు చేసిన విజ్ఞప్తి ఇది..

Bangladesh Dussehra 2024: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల గొడవలు చినికి చినికి గాలివానగా మారి , తీవ్రమైన హింసకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి వచ్చే పరిస్థితులు ఎదురయ్యాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత  హిందువులపై దాడులు పెరిగాయి. ఆలయాలను ధ్వంసం చేశారు, హిందూ వ్యాపారులను హింస పెట్టారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. త్వరలో శరన్నవరాత్రులు ప్రారంభం కానుండడంతో...బంగ్లా ప్రభుత్వం..అక్కడి హిందూ సమాజం ముందు కీలకమైన ప్రతిపాదన ఉంచింది. 

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!

అజాన్, నమాజ్ సమయాల్లో దుర్గాపూజకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిలిపేయాలని... ముఖ్యంగా సంగీత వాయిద్యాలు, పాటలు పాడడం లాంటివి చేయకూడదన్నది ఆ ప్రతిపాదన సారాంశం...

బంగ్లా దేశ్ హోం వ్యవహరాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) ఎండీ జహంగీర్ అలం చౌదరి స్వయంగా ఈ విజ్ఞప్తి చేశారు. నమాజ్ సమయంలో దుర్గా పూజ నిలిపేయాలని, అజాన్ కి ఐదు నిముషాల ముందే విరామం పాటించాలని కోరారు. సంగీత వాయిద్యాలు, సౌండ్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలన్న విజ్ఞప్తులను హిందూ సంఘాలు అంగీకరించాయని చెప్పారు జహంగీర్ అలం. 

దుర్గా పూజ అంటే బంగ్లాదేశ్ లో హిందువులకు అతి పెద్ద పండుగ. ఈ మధ్య జరిగిన మత ఘర్షణలను పరిగణలోకి తీసుకుని బంగ్లా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది.

ఈ ఏడాది బంగ్లా వ్యాప్తంగా 32,666 పూజా మండపాలను ఏర్పాటు చేయనున్నట్లు జహంగీర్ అలం చౌదరి తెలిపారు.  వీటిలో 157 మండపాలు ఢాకా సౌత్ సిటీలో, 88 నార్త్ సిటీ కార్పొరేషన్లలో ఉంటాయని ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్న దుర్గా మండపాల సంఖ్య ఎక్కువే. 2023 లో మండపాల సంఖ్య 33,431 కాగా....2024 లో 32,666 దుర్గా మండపాలు..

Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!

విగ్రహాల తయారీ మొదలు దసరా నవరాత్రులు పూర్తయ్యేవరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తాం. పూజా మండపాల వద్ద 24/7 భద్రతపై అధికారులతో చర్చించాం. సంఘ విద్రోహ శక్తులను అరికట్టి తీరుతాం - బంగ్లా దేశ్ హోం వ్యవహరాల సలహాదారు జహంగీర్ అలం చౌదరి హామీ ఇచ్చారు 

మనది మత సామరస్యం ఉన్న దేశం..మత సామరస్యాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను కూడా ప్రోత్సహించం..చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. ఎవరైనా అల్లర్లకి కారణమైతే వారికి కఠిన శిక్ష తప్పదు -  బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్  

Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!

ఈ ఏడాది శరన్నవరాత్రులు అక్టోబరు  03 న ప్రారంభమై...9 రోజుల పాటూ సాగుతాయి. తొమ్మిది రోజులు శక్తి స్వరూపిణి తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. శరన్నరవాత్రుల్లో మూల నక్షత్రం రోజు నుంచి అత్యంత ముఖ్యమైన రోజులుగా భావిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. దుర్గాష్టమి, మహర్నవమి, విజయ దశమి..అక్టోబరు 12తో ముగుస్తాయి. 
  
దుర్గా గాయత్రి 
ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి తన్నోదుర్గా ప్రచోదయాత్

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget