అన్వేషించండి

Ram Mandir: అయోధ్య రామమందిరానికి ఐదు వేల పెర్ఫ్యూమ్ బాటిళ్లు, ప్రత్యేకత ఏంటంటే?

Ram Mandir Pran Pratishtha: భారతదేశ చరిత్రలో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు వందల ఏళ్లుగా భారతీయలు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సోమవారం జరుగనుంది. 

Ayodhya Ram Mandir Updates: భారతదేశ చరిత్రలో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు వందల ఏళ్లుగా భారతీయలు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సోమవారం జరుగనుంది. ఈ మేరకు  ప్రారంభోత్సవానికి అయోధ్య పూర్తిగా సిద్ధమైంది. జగభిరాముడిని కొలువు తీర్చేందుకు అయోధ్య ముస్తాబైంది. ఆలయ సముదాయం, అయోధ్యా నగరంలో రామనామస్మరణలతో మర్మోగుతోంది. ఆలయంలో ప్రతి మూల,  దీపాలు, పూలతో అలంకరించబడ్డాయి. 

ప్రాణప్రతిష్ట వేడుకలను చూసేందుకు వేలాదిగా రామభక్తులు, ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా  ఓ ప్రత్యేకమైన సువాసనతో ఆలయం వారికి స్వాగతం పలుకనుంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా, అయోధ్యలో సువాసనలు వెదజల్లేలా బరేలీకి చెందిన ఓ వ్యాపారి ప్రత్యేకంగా పరిమళాలను (పెర్ఫ్యూమ్‌)ను తయారు చేశారు.   

బరేలికి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ మిట్టల్ ఈ ప్రత్యేక పరిమళాలను తయారు చేయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ప్రత్యేక పరిమళ ద్రవ్యాలను అయోధ్య, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా అందించామని చెప్పారు. అలాగే అయోధ్యకు వచ్చే ప్రముఖులకు అందించేలా సుగంధ ద్రవ్యాల సీసాలు, ధూపద్రవ్యాలను ప్రత్యేకంగా పంపారట.  బరేలీ నుంచి మొత్తం 5,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు, 7,000 కుంకుమపువ్వు అగరుబత్తీలను ఆయన పంపించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రత్యేకమైన పరిమళాన్ని సృష్టించమని నన్ను అడిగారు. ఇందుకోసం కస్తూరి పరిమళం, కుంకుమ ధూపం తయారు చేశాను. రాముడు జన్మించినప్పుడు, దశరథుడు అయోధ్య అంతటా చందనం, కస్తూరిని చల్లారని రామచరితమానస్‌లో ప్రస్తావించారు. నేను కూడా అదే మూలకాలను ఉపయోగించి సహజమైన సువాసనను సృష్టించాను’ అని మిట్టల్ చెప్పారు. పెర్ఫ్యూమ్‌ను రూపొందించడానికి మిట్టల్ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఆ బృందం ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్‌ను తయారు చేశారు. 

అయోధ్యలో రామమందిర మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా అతిథులు,  విదేశీ ప్రముఖులు అయోధ్యకు చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడి జీవితం, ఆలయ ప్రాణ ప్రతిష్టను జరుపుకునేలా వివిధ ప్రాంతాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Weather Update 2026: జూన్ లోనూ భయపెట్టనున్న కరెంట్ బిల్లులు, వేడి గాలుల నుంచి ఉపశమనం ఎప్పుడంటే?
జూన్ లోనూ భయపెట్టనున్న కరెంట్ బిల్లులు, వేడి గాలుల నుంచి ఉపశమనం ఎప్పుడంటే?
Unique Baby Names: చిన్నారుల కోసం నదులు, పర్వతాలకు సంబంధించిన 10 అందమైన పేర్లు!
చిన్నారుల కోసం నదులు, పర్వతాలకు సంబంధించిన 10 అందమైన పేర్లు!
Jupiter Transit 2026: అక్టోబర్ 31 వరకు గురు సంచారం వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
అక్టోబర్ 31 వరకు గురు సంచారం వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget