అన్వేషించండి

Ram Mandir: అయోధ్య రామమందిరానికి ఐదు వేల పెర్ఫ్యూమ్ బాటిళ్లు, ప్రత్యేకత ఏంటంటే?

Ram Mandir Pran Pratishtha: భారతదేశ చరిత్రలో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు వందల ఏళ్లుగా భారతీయలు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సోమవారం జరుగనుంది. 

Ayodhya Ram Mandir Updates: భారతదేశ చరిత్రలో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు వందల ఏళ్లుగా భారతీయలు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సోమవారం జరుగనుంది. ఈ మేరకు  ప్రారంభోత్సవానికి అయోధ్య పూర్తిగా సిద్ధమైంది. జగభిరాముడిని కొలువు తీర్చేందుకు అయోధ్య ముస్తాబైంది. ఆలయ సముదాయం, అయోధ్యా నగరంలో రామనామస్మరణలతో మర్మోగుతోంది. ఆలయంలో ప్రతి మూల,  దీపాలు, పూలతో అలంకరించబడ్డాయి. 

ప్రాణప్రతిష్ట వేడుకలను చూసేందుకు వేలాదిగా రామభక్తులు, ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా  ఓ ప్రత్యేకమైన సువాసనతో ఆలయం వారికి స్వాగతం పలుకనుంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా, అయోధ్యలో సువాసనలు వెదజల్లేలా బరేలీకి చెందిన ఓ వ్యాపారి ప్రత్యేకంగా పరిమళాలను (పెర్ఫ్యూమ్‌)ను తయారు చేశారు.   

బరేలికి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ మిట్టల్ ఈ ప్రత్యేక పరిమళాలను తయారు చేయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ప్రత్యేక పరిమళ ద్రవ్యాలను అయోధ్య, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా అందించామని చెప్పారు. అలాగే అయోధ్యకు వచ్చే ప్రముఖులకు అందించేలా సుగంధ ద్రవ్యాల సీసాలు, ధూపద్రవ్యాలను ప్రత్యేకంగా పంపారట.  బరేలీ నుంచి మొత్తం 5,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు, 7,000 కుంకుమపువ్వు అగరుబత్తీలను ఆయన పంపించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రత్యేకమైన పరిమళాన్ని సృష్టించమని నన్ను అడిగారు. ఇందుకోసం కస్తూరి పరిమళం, కుంకుమ ధూపం తయారు చేశాను. రాముడు జన్మించినప్పుడు, దశరథుడు అయోధ్య అంతటా చందనం, కస్తూరిని చల్లారని రామచరితమానస్‌లో ప్రస్తావించారు. నేను కూడా అదే మూలకాలను ఉపయోగించి సహజమైన సువాసనను సృష్టించాను’ అని మిట్టల్ చెప్పారు. పెర్ఫ్యూమ్‌ను రూపొందించడానికి మిట్టల్ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఆ బృందం ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్‌ను తయారు చేశారు. 

అయోధ్యలో రామమందిర మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా అతిథులు,  విదేశీ ప్రముఖులు అయోధ్యకు చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడి జీవితం, ఆలయ ప్రాణ ప్రతిష్టను జరుపుకునేలా వివిధ ప్రాంతాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget