అన్వేషించండి

Mla Vasantha Krishna Prasad: 'దేవినేనితో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు' - రెండ్రోజుల్లో టీడీపీలో చేరతానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Mylavaram: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ చేరనున్నారు. ఈ మేరకు రెండ్రోజుల్లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు.

Ysrcp Mla Vasantha Krishna Prasad Will Join in Tdp: తాను రెండ్రోజుల్లో టీడీపీలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) తెలిపారు. ఐతవరంలో (Ithavaram) సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మైలవరం (Mylavaram) నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని.. ఆయన సమక్షంలో టీడీపీలో చేరతానని స్పష్టం చేశారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని.. టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటామని అన్నారు. 'చంద్రబాబు, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారు. ఆ పార్టీలో ఉండలేక టీడీపీలో చేరుతున్నా. వైసీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారు.' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, చాలాకాలంగా వసంత కృష్ణప్రసాద్ సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై కూడా పరోక్షంగా విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని మైలవరం ఇంఛార్జీగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

'ఉమతో కలిసి పని చేస్తా'

దేవినేని ఉమతో కలిసి పని చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. మైలవరం సీటుపై టీడీపీ అధిష్టానం రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తుందని చెప్పారు. తనతో పాటు టీడీపీలోకి వచ్చే వైసీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెత్తనం చేయడం కాదని.. వారి సారథ్యంలోనే తాము కలిసి పని చేస్తామని అన్నారు. 'ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారు. ఉమాతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. ఇప్పటివరకూ ఉమ, నేను చెరో దారిలో పని చేశాం. ఇప్పుడు ఒకేదారిలో ప్రయాణం చేస్తాం. అవసరమైతే పార్టీ అధిష్టానం సమక్షంలో మాట్లాడి దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీ హైకమాండ్ నియోజకవర్గం ఎవరికి అప్పచెప్పితే దాని ప్రకారం నడుచుకుంటాను. దేవినేని ఉమతో ఇప్పటివరకూ జరిగిన విషయాలపై క్లారిటీ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు సీఎం కావడానికి ఎవరితో అయినా కలిసి పని చేసేందుకు సిద్ధం.' అని స్పష్టం చేశారు.

మరోవైపు, టీడీపీ - జనసేన ఉమ్మడి జాబితా విడుదలైన నేపథ్యంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఆయా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇవ్వడంతో అసంతృప్తులు ఒక్కొక్కరిగా శాంతిస్తున్నారు. అటు, కీలకమైన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తలనొప్పిగా మారింది. ఈ సీటును టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ ఆశిస్తున్నారు. అయితే, గోరంట్ల బుచ్చయ్యకే రాజమండ్రి రూరల్ సీటు అప్పగించి.. కందుల దుర్గేశ్ కు నిడదవోలు సీటు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దుర్గేశ్ కు పవన్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. అయితే, కార్యకర్తలు, నేతలతో మాట్లాడిన తర్వాతే తన అభిప్రాయం చెబుతానని కందుల దుర్గేశ్ పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 

Also Read: Rajahmundry News: బుచ్చయ్యకే రాజమండ్రి రూరల్- నిడదవోలుకు కందుల దుర్గేశ్ షిప్టు

 

టాప్ హెడ్ లైన్స్

New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Embed widget