అన్వేషించండి

YSRCP inside : పార్టీని ప్రక్షాళన చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత - ప్రస్తుత టీంతో గట్టెక్కలేమని భావిస్తున్నారా ?

వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. అన్ని వ్యవస్థల్లో కీలకమైన మార్పులు చేస్తున్నారు. ప్రస్తుత టీంతో ఎన్నిలను ఎదుర్కోవడం కష్టమని ఆయన అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

YSRCP inside :  వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ ..పాలనా వ్యవహారలతో పాటు పార్టీ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రతీ రోజూ పార్టీ కోసం సమయం కేటాయించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్‌ టీం ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీతో కలిసి పని చేస్తోంది. ఆ టీంను రిషిరాజ్ లీడ్ చేస్తున్నారు. ఆయన  ఎప్పటికప్పుడు నివేదికలను నేరుగా సీఎం జగన్‌కు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలను పరిశీలించి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

గడప గడపకూ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షలు !

సీఎం జగన్ ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని పంపించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఆ ప్రకారం ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జులు ఇంటింటికి వెళ్తున్నారు. తాము చేసిన మేలు గురించి వివరిస్తున్నారు. అయితే ఆ కార్యక్రమం సమయంలో  వెల్లడవుతున్న అసంతృప్తి ..  ఇతర సమస్యల విషయంలోనూ జగన్ సీరియస్‌గా స్పందిస్తున్నారు. సచివాలయానికి రూ. ఇరవై లక్షల చొప్పున కేటాయించారు. ఇలా వెళ్లడం వల్ల ప్రజలు ప్రభుత్వం తమ మేలు చేయడానికే ఉందన్న భావనకు వస్తారని నమ్ముతున్నారు. అయితే కొంత మంది నేతలు సరిగ్గా పని చేయడంలేదని.. ఇంటింటికి వెళ్లడం లేదన్న అసంతృప్తిలో జగన్ ఉన్నారు. అందుకే మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ప్రతి నియోజకవర్గానికి ఓ పరిశీలకుని నియామకం !

పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారే ఇంచార్జులు ఉన్నారు. లేని చోట్ల ఓడిన వారు కొంత మంది..  కొత్తగా నియమితులైన వారు కొంత మంది ఇంచార్జులుగా ఉన్నారు. తాజాగా నియోజకవర్గాలకు పరిశీలకుడ్ని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు.  ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించాలని.. నిర్ణయించి ఇప్పటికే జాబితారె డీ చేశారు.  ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటారు.   తుది జాబితా సిద్ధమవుతోందని వారం, పది రోజుల్లో ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిశీలకుడు ఏం చేస్తాడన్నది మాత్రం వైసీపీ వర్గాలు క్లారిటీగా చెప్పలేకపోతున్నాయి. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే.. ఇంచార్జిని ఐ ప్యాక్ టీం ఫాలో చేస్తోంది. వారేం చేస్తున్నారో పరిశీలిస్తోంది. నివేదికలిస్తోంది. అందుకే  జగన్... ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడం లేదని కొంత మందిపై మండి పడుతున్నారు. అయితే ఈ సారి నియమంచబోయే పరిశీలకులు.. రాజకీయ నేతలేనని అదే నియోజకవర్గానికి చెందిన వారై ఉంటారని చెబుతున్నారు.  

పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మార్పు  !

ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఈ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనను తప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి చేతికి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగాన్ని అప్పగించారు. ఈ నిర్ణయం కూడా వైఎస్ఆర్‌సీపీలో ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఎఫెక్టివ్‌గా పని చేయడం లేదని ఆ పార్టీలో అసంతృప్తి ఉంది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టి జిల్లాకు ఓ కన్వీనర్ ను కో కన్వీనర్లను నియమించారు. మరికొంత మంది సోషల్ మీడియా వారియర్స్‌ను కూడా రెడీ చేశారు. ఈ క్రమంలో సజ్జల తన కుమారుడికి పదవి వచ్చేలా చూసుకోవడంతో ఆ విభాగం కూడా ఇక ముందు మరితం క్రియాశీలకంగా మారుతుందని భావిస్తున్నారు. 

మరికొన్ని కీలక మార్పులు చేయనున్న జగన్ ?

ఎమ్మెల్యేల్లో దాదాపుగా 70 మంది వరకూ ఈ సారి టిక్కెట్లు ఉండవని వైఎస్ఆర్‌సీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మరికొన్ని కీలక మార్పులను పార్టీలో జగన్ చేయబోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే స్పష్టమైన మార్పులు కనిపిస్తూండగా.. వ్యవస్థలోనే కొత్తదనాన్ని నింపాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టీం రొటీన్‌గా పని చేస్తోందని ..  మరోసారి అధికారాన్ని దక్కించుకునేలా ... కొత్త టీంతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget