అన్వేషించండి

జగన్‌ మంచోడే, తప్పుడు సలహాలతోనే ఇలా- ట్రబుల్‌ షూటర్‌నే టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యేలు!

ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా సజ్జలను టార్గెట్ చేశారు. జగన్ కి తప్పుడు సలహాలిస్తున్నారని అంటున్నారు. జగన్ కోసమే ఈ నిందలన్నిటినీ సజ్జల భరిస్తున్నారా, లేక అసలిదంతా సజ్జల స్క్రిప్టేనా? తేలాల్సి ఉంది. 

నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసింది. ఆ నలుగురిపై డబ్బులు తీసుకున్నారనే అపవాదు కూడా వేసింది. ఇదంతా సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో ఆ ఎమ్మెల్యేలకు ఉమ్మడిగా టార్గెట్ అయింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల ఇప్పుడు అంతా తానై పార్టీని నడిపిస్తున్నట్టుగా వ్యవహారం ఉంది. విజయసాయిరెడ్డి ప్రాధాన్యం పార్టీలో తగ్గిన తర్వాత సజ్జల ఆల్ ఇన్ వన్ అయ్యారు. పార్టీ తరపున ఏది మాట్లాడాలన్నా ఆయనే, ఎవరు జగన్ దగ్గరకు వెళ్లాలన్నా ముందు సజ్జలను దాటాలి. ఏ విభాగంలో సమస్యలు వచ్చినా సజ్జలే ట్రబుల్ షూటర్. అలాంటి ట్రబుల్ షూటర్ నే టార్గెట్ చేశారు అసమ్మతి ఎమ్మెల్యేలు. 

కోటంరెడ్డి గతంలోనే..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే సజ్జలను టార్గెట్ చేశారు. తనని ఫోన్లో తిట్టించింది కూడా సజ్జలేనని అన్నారు. ఆయన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్నారు. కాకాణికి మంత్రి పదవి ఇచ్చే క్రమంలో వారిద్దరి మధ్య లాలూచీ నడిచిందని, తనను కావాలనే పక్కనపెట్టారని కూడా ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడి పేరు కూడా తెరపైకి తెచ్చారు కోటంరెడ్డి. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు కోటంరెడ్డి. ఆయన్ను ఎన్నికల కమిషన్ విచారించాలన్నారు. రహస్య ఓటింగ్ గురించి సజ్జలకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. తమకు డబ్బులు ముట్టాయని అంటున్ను సజ్జల, టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంతెంత ముట్టజెప్పారని ప్రశ్నించారు. 

ఆయన సంగతి నాకు బాగా తెలుసు..
సజ్జల జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి ఆయన సంగతి తనకు బాగా తెలుసన్నారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇప్పుడు ఆయన వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. అందరూ ఆయన లాగే డబ్బులు తీసుకుంటారనుకోవడం సజ్జలకు సరికాదని హితవు పలికారు. తమపై వేసిన అపవాదులపై న్యాయపోరాటం చేస్తామన్నారు ఆనం. ఈ వ్యవహారంలో ఆయన సజ్జలకు తీవ్రంగా తప్పుబట్టారు. 

నాకేమైనా జరిగితే దానికి సజ్జలదే బాధ్యత..
ఏపీలో తనకు ప్రాణహాని ఉందని, అందుకే అక్కడికి రాలేకపోతున్నానని అన్నారు సస్పెన్షన్ కి గురైన మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ప్రజలే తన కుటుంబం అనుకుని కష్టపడ్డానని, ఇంత దారుణంగా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారామె. తాను డబ్బులు తీసుకోలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయలేదని, అమరావతి మట్టి మీద ప్రమాణం చేస్తానన్నారు. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధం అని చెప్పారు. తన ప్రాణాలకు హాని జరిగితే సజ్జలదే బాధ్యత అని అన్నారు ఉండవల్లి శ్రీదేవి. తనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వాటన్నిటికీ పార్టీదే బాధ్యత అన్నారు. ముఖ్యంగా సజ్జలన తమను టార్గెట్ చేశారని చెప్పారు శ్రీదేవి. 

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా జగన్ ని టార్గెట్ చేశారు. ఆయన్ను నమ్ముకున్న మేకపాటి కుటుంబానికి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సజ్జల విషయంలో చంద్రశేఖర్ రెడ్డి పెద్దగా రెస్పాండ్ కాలేదు కానీ, జగన్ నే ఆయన టార్గెట్ చేశారు. సస్పెండ్ అయిన మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా సజ్జలను టార్గెట్ చేశారు. ఆయన వల్లే ఇదంతా జరిగిందని, జగన్ కి తప్పుడు సలహాలిస్తున్నారని, తమని వేధించారని, బయటకు పంపించారని అంటున్నారు ఎమ్మెల్యేలు. జగన్ కోసమే ఈ నిందలన్నిటినీ సజ్జల భరిస్తున్నారా, లేక అసలిదంతా సజ్జల స్క్రిప్టేనా తేలాల్సి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget