అన్వేషించండి

౩ Capitals Garjana : అధికార పార్టీనే గర్జనలు చేస్తే రాజధానులు ఎవరు పెట్టాలి ? వైఎస్ఆర్‌సీపీ వ్యూహంలోనే లోపం ఉందా?

తిరుగులేని మెజార్టీ ఉన్న వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానులు ఎందుకు చేయలేకపోతోంది ? సాధ్యం కావని తెలిసినా అధికార పార్టీగా ప్రజల్ని మభ్య పెడుతున్నారా ?


౩ Capitals  Garjana :  ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. విశాఖలో వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల పేరుతో గర్జన నిర్వహించింది. ఆ గర్జన.. హిట్టా, ఫ్లాపా అన్న సంగతి పక్కన పెడితే అసలు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉండి ..151 మందిసొంత ఎమ్మెల్యేలు.. మరో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తిరుగులేని స్థానంలో ఉండి ఎందుకు గర్జనలు నిర్వహిస్తోంది. చేయాలనుకుంటే మూడు రాజధానుల్ని తక్షణం చేయవచ్చు కదా? చేయడం సాధ్యం కాకపోతే.. మూడు రాజధానుల గర్జనల పేరుతో ప్రజల్ని మోసం చేసినట్లు కాదా?

అధికార పార్టీ గర్జనలు నిర్వహించడం వింత !

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా.. అధికార పార్టీ నిరసనలు.. గర్జనలు నిర్వహించదు. సొంత ప్రభుత్వంపై అసలు నిర్వహించదు. కేంద్రానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నిరసనలు నిర్వహించింది. అయితే ఏపీలో వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల కోసం అంటూ గర్జనలు నిర్వహిస్తోంది. అధికార పార్టీగా ఉండి... ఎందుకు గర్జనలు నిర్వహిస్తున్నరన్నది ప్రజలకు ప్రాథమికంగా వచ్చే సందేహం.  చేయాలనుకుంటే చేయవచ్చు కదా.. ఈ నిరసనలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం.. ఎందుకనేది ఎక్కువ మంది అభిప్రాయం.

మూడు రాజధానులు ఎందుకు చేయడం లేదు ?

తిరుగులేని మెజార్టీ ఉన్న వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల్నిఎందుకు చేయడం లేదు. అలా చేయకుండా గర్జనలు నిర్వహిస్తే రాజధాని ఏర్పడుతుందా ? రాష్ట్రం చేతుల్లో ఉన్న రాజధాని ఏర్పాటు ఎందుకు సాధ్యం కావడం లేదు  ? వైఎస్ఆర్‌సీపీ పాలనపై ప్రజల్లో వస్తున్న సందేహాలు ఇవి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌కు చాలాస్పష్టంగా తెలుసు.. మూడు రాజధానులు అనేది అసాధ్యం అని. కోర్టు తీర్పు కానీ.. రాజ్యాంగ నిబంధనలు కూడా మూడు రాజధానులకు సహకరించవని తెలుసు. అందుకే మూడు రాజధానులు చేయలేకపోతున్నారు. కానీ ఆ పేరుతో రాజకీయం మాత్రం చేస్తున్నారు. 

సాధ్యం కావని తెలిసీ ప్రజల్ని మభ్య పెడుతున్నారా?

మూడు రాజధానులు.. రాజకీయ పరంగానేకాదు.. సాంకేతికపరంగా కూడా సాధ్యం కావని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా రిట్ ఆప్ మాండమస్ ప్రకటించింది. సుప్రీంకోర్టుకువెళ్లి స్టే తెచ్చుకుంటే తప్ప మూడు రాజధానులు సాధ్యం కాదు. కానీ తీర్పు వచ్చిన  ఆరు నెలల వరకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. ఆరు నెలల తర్వాత సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే తమ వాదనలు వినాలని రైతులు కూడా  పిటిషన్ వేశారు. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అసాధ్యం. ఈ విషయం అందరికీ తెలుసు. అధికార పార్టీకి.. ముఖ్య నేతలకు తెలియని అనుకోలేం. మరి మూడు రాజధానులు పెట్టేస్తామని.. గర్జనలు ఎలా చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ?

ప్రజల్ని రెచ్చగొడితే ఏం వస్తుంది ?

మూడు రాజధానులు సాధ్యం కావని తెలిసిన తర్వాత కూడా.. ఏర్పాటు చేయలేమని తెలిసిన తర్వాత కూడా .. అవి చేస్తామని ..  విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రచారం చేయడం వల్ల రాజకీయంగా లాభం కలగవచ్చు కానీ.. రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితుల వల్ల పెట్టుబడులు ఆగిపోతాయి. ప్రజల్లో విద్వేషాలు  పెరుగుతాయి. ఇది అధికార పార్టీగా బాధ్యతగా వ్యవహరించడం కాదన్న అభిప్రాయం ఎక్కువగా  వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Assam Assembly Elections: అస్సాంలో ఎన్నికల ఎజెండా సీఎం హిమంతనే - ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా?
అస్సాంలో ఎన్నికల ఎజెండా సీఎం హిమంతనే - ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా?
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
Simsa Mata Temple: జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Embed widget