అన్వేషించండి

Munugode ByPolls : సెంటిమెంటా ? అభివృద్ధా ? మునుగోడులో ఓటింగ్ ఎజెండా ఏమిటి ?

మునుగోడు ప్రజలు ఏ అంశాల ప్రతిపదికగా ఓటు వేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా ఓ వేవ్ లేకపోవడంతో .. తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.


Munugode ByPolls : మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకూ సవాల్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మునుగోడు ఓటర్ల నాడి మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలాంటి గాలి మునుగోడులో లేదు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వాదనను నమ్మించి ఓట్లు పొందాలని అనుకుంటున్నాయి. అయితే  ప్రజలు ఏమనుకుంటున్నారో మాత్రం బయటకు కనిపించనీయడం లేదు. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నాయి. 

ఎలాంటి అజెండా లేకుండా ఉపఎన్నికలు !

సాధారణంగా ఉపఎన్నికలు ఓ కారణంతో వస్తాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ కారణంతో రాజీనామాలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో  కేసీఆర్ పార్టీ నుంచి గెంటేశారు కాబట్టే రాజీనామా చేశానని ఈటల రాజేందర్ జనంలోకి వెళ్లారు. అయితే  ఇప్పుడు మునుగోడుకు ఉపఎన్నికలు ఏ కారణంతో వచ్చాయన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంకా గట్టిగా ఏడాది కూడా పదవి కాలం లేని మునుగోడుకు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఎందుకు.. మళ్లీ బీజేపీ తరపున పోటీ చేయడం ఎందుకన్నది చాలా మంది ఓటర్లకు అర్థం కాని విషయం. బీజేపీకి కూడా అసలు ఎన్నిక ఎందుకు వచ్చిందన్నది చర్చకు రాకపోతే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ అయితే అసలు ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పి.. ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ .. ఆ రెండు పార్టీలు ఒకటేనని చెబుతోంది. అయితే ప్రజలు ఎవరి వాదనను విశ్వసిస్తున్నారో మాత్రం స్పష్టత లేదు. 

ఉపఎన్నిక ఎందుకంటే చెప్పుకోలేని స్థితిలో బీజేపీ !

ఉపఎన్నిక పూర్తిగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వల్లనే వచ్చింది. నాలుగేళ్లపాటు ఆయన టీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా  చేశారు. ప్రజల కోసమే చేశానని ఆయన చెబుతున్నారు. నాలుగేళ్లలో చేయని రాజీనామా ఇప్పుడెందుకు చేశారనేది చాలా మందికి వస్తున్న సందేహం. దానికి సమాధానంగా కాంట్రాక్టుల్ని తెరపైకి తెచ్చాయి విపక్షాలు. దీన్ని కవర్ చేసుకోవడానికి రాజగోపాల్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారు. 

రాజగోపాల్ రెడ్డిపై వ్యతిరేకతనే నమ్ముకుంటున్న టీఆర్ఎస్ !

మరో వైపు రాజగోపాల్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ప్రజల్ని మోసం చేశారని.. రూ. ఇరవై వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే ఆయన ఉపఎన్నిక తీసుకొచ్చి పెట్టారని విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా ఉన్న తమకే పట్టం కట్టాలని కోరుతున్నారు. వీరి ప్రచారం కూడా ఎజెండా లేకుడానే సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి ని పెంచి ఓట్లు పొందాలనుకుంటోంది. అంతే కానీ గతంలోలా తెలంగాణ వంటి పవర్ ఫుల్ ఎజెండాతో ముందుకు రాలేకపోయింది. 

పాత సేవల్నే గుర్తు చేసుకోవాలంటున్న కాంగ్రెస్!

ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా ప్లస్ ..మైనస్ లాంటిది. కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారంలో లేదు. దీంతో ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చినపార్టీగా ఓ భావోద్వేగాన్ని సృష్టించి తమ వైపు ఓట్లు మల్చుకోవాలనుకుంటోంది. కానీ అలాంటి అంశమే  కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదు. 

రాజకీయ పార్టీలు ఓ వేవ్ సృష్టించగలిగితే సునాయాసంగా గెలుస్తాయి. ఎలాంటి వేవ్ లేకపోతే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. ప్రస్తుతం మునుగోడులో అలాంటి పరిస్థితే  ఉందనుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget