అన్వేషించండి

TRS Politics : టీఆర్ఎస్‌కు వలస భయం లేనట్లే - బీజేపీలో చేరికలూ కష్టమే ! కథ మార్చేసిన ఫామ్ హౌస్ !

బీజేపీలో ఇక నుంచి టీఆర్ఎస్ నేతల చేరికలు ఆగిపోయే అవకాశం ఉంది. ఎవరు చేరినా అందరూ అనుమానంగా చూసే పరిస్థితి ఉండటమే దీనికి కారణం.

TRS Politics :   "ఫామ్‌హౌస్" వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. బుధవారం రాత్రి ప్రారంభమై గురువారం ఉదయం వరకూ పెను తుఫాన్‌గా మారినట్లుగా కనపించింది. కానీ టీఆర్ఎస్ ఒక్క సారిగా వెనక్కి తగ్గడంతో గురువారం సాయంత్రానికి ప్రశాంతత ఏర్పడింది. కానీ ఇది తుపాను ముందు ప్రశాంతతేనని .. ఈ వ్యవహారంలో బ్లాస్టింగ్ విషయాలు బయట పెడతామని.. బీజేపీ ఢిల్లీ పెద్దల బండారం బయటపెడతామని టీఆర్ఎస్ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. తర్వాత ఏం చేస్తారో కానీ ఇప్పటికైతే సద్దుమణిగింది ఈ విషయంలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గటిల్గు కనపిస్తుంది కానీ ఇప్పటికిప్పుడు ఈ ఎపిసోడ్‌ను ఇంతటితో ఆపేసినా ఆ పార్టీకి ఊహించనంత లాభం కలుగుతుంది. అది అంచనా వేయలేని లాభం. ఈ పద్దతిలో కాకుండా మరో రకంగా సాధించలేని ప్రయోజనం అది. అదే ఫిరాయింపులను నిరోధించడం. 

టీఆర్ఎస్‌ను చేరికలు కొంత కాలం ఆగిపోయినట్లే ! 

తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నాయకులు పలువురు బీజేపీ బాట పట్టారు. మనుగోడు ఉపఎన్నిక తర్వాత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. బీజీపీ నేతలే ఈ రకమైన మైండ్‌గేమ్‌కు పాల్పడ్డారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు నాలుగు జిల్లాల నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతారని నేరుగానే చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఫలితం తేడా వస్తే.. ఆ పార్టీ నాయకుల్లో కూడా భవిష్యత్‌పై భయం ప్రారంభమవుతుంది. అదే సమయంలో అక్కడ బీజేపీ విజయం సాధిస్తే వలసల్ని ఆపడం టీఆర్ఎస్ హైకమాండ్‌కు కూడా సాధ్యం కాదు. రాజకీయం పూర్తిగా బీజేపీ వైపు ఉన్న సమయంలో.. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రయత్నిస్తే .. అడ్డుకునేంత సానుకూలత టీఆర్ఎస్ హైకమాండ్‌కు ఉండదు. ఈ విషయంలో బీజేపీ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ హైకమాండ్ ఏమీ చేయకుండానే ఎమ్మెల్యేలు ఆగిపోతారు. 

బీజేపీలో చేరిన వారి వైపు అనుమానంగా చూసే చాన్స్ !

భారతీయ జనతా పార్టీతో కొంత మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనేది చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మాట. తెలంగాణ నుంచి మరో ఏక్‌నాథ్ షిండే వస్తారని బండి సంజయ్ లాంటి నేతలు చెబుతూ వస్తున్నారు. అలాంటి ప్రయత్నం జరిగిందో లేదో కానీ ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగు చూసింది. అక్కడ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. వంద కోట్ల బేరం జరిగిందని చెబుతున్నారు. అంటే ఒక్కో ఎమ్మెల్యే రూ. వంద కోట్లకు పార్టీ ఫిరాయించబోతున్నారన్న  అభిప్రాయానికి జనం వచ్చారు. రేపు ఎవరైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి.. బీజేపీలో చేరితే.. వారు కూడా రూ. వంద కోట్లు తీసుకున్నారా అనే ప్రశ్న మొదటగా వస్తుంది. ఈ నింద భరించడం ఎమ్మెల్యేలకు అంత  తేలిక కాదు. టీఆర్ఎస్‌లో టిక్కెట్ రాదని..బీజేపీలో చేరామన్నా.. ఎవరూ నమ్మరు. రూ. వంద కోట్లు అందాయనుకుంటారు. 

ఆపరేషన్ ఆకర్ష్‌ను  బీజేపీ పక్కకు పెట్టక తప్పని పరిస్థితి ! 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు బీజేపీలో చేరినా..  ఆ నేతలపై అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత తీసుకున్నారని  ప్రశ్నలొస్తాయి. అంతే కాదు.. తమ  నియోజకవర్గంలోనూ ఈ రకమైన చర్చ జరుగుతుంది. ఇది పార్టీ మారాలనుకుంటున్న నేతలకు అగ్నిపరీక్ష లాంటిదే. ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధమై బీజేపీతో చర్చలు కూడా పూర్తి చేసిన వారికి ఇబ్బందికర పరిస్థితే. అందుకే చర్చలు పూర్తి చేసుకున్న వారు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇది బీజేపీ నేతలకు ఆశనిపాతమేనని అనుకోవచ్చు. కేసులతో భయపెట్టి.. డబ్బులు ఆశ చూపి బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకుంటుందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇలా ఎప్పుడూ బయటపడలేదు. తెలంగాణలో బయటపడటంతో ఆ పార్టీలో చేరికలకు బ్రేక్ పడినట్లేనని చెప్పుకోవచ్చు. 

మునుగోడు ఫలితం ఎలా ఉన్నా.. టీఆర్ఎస్‌కు వలస భయం లేనట్లే ! 

నిజానికి ఫామ్ హస్ కేసులో బీజేపీ నేతలున్నారని ఎవరూ చెప్పడం లేదు. ఆ స్వామిజీలు బీజేపీ నేతలకు సన్నిహితలని చెబుతున్నారు. నందకుమార్ అటు బీజేపీతో పాటు టీఆర్ఎస్ నేతలకూ సన్నిహితుడే. ఆయన ఫలానా పార్టీ కోసం మధ్యవర్తిత్వం చేశారని ఎవరూ అనుకోవడం లేదు. ఇక్కడ బీజేపీది తప్పు ఉన్నా లేకపోయినా రాజకీయంగా లాభం టీఆర్ఎస్‌కు..నష్టం బీజేపీకి ఇప్పటికే కలిగింది. బీజేపీ నేతలు ఇక నుంచి  ఎవరనైనా తమ పార్టీలోకి చేర్చుకోవాలంటే.. ఈ వ్యవహారం సద్దుమణిగిదేకా ఉండాలి. లేకపోతే బేరాలతోనే చేర్చుకున్నారని అంటారు. మొత్తంగా ఈ ఫామ్ హౌస్ వ్యవహారం టీఆర్ఎస్ అధినేతకు పెద్ద చిక్కు తొలగించినట్లయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Embed widget