అన్వేషించండి

TRS Politics : టీఆర్ఎస్‌కు వలస భయం లేనట్లే - బీజేపీలో చేరికలూ కష్టమే ! కథ మార్చేసిన ఫామ్ హౌస్ !

బీజేపీలో ఇక నుంచి టీఆర్ఎస్ నేతల చేరికలు ఆగిపోయే అవకాశం ఉంది. ఎవరు చేరినా అందరూ అనుమానంగా చూసే పరిస్థితి ఉండటమే దీనికి కారణం.

TRS Politics :   "ఫామ్‌హౌస్" వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. బుధవారం రాత్రి ప్రారంభమై గురువారం ఉదయం వరకూ పెను తుఫాన్‌గా మారినట్లుగా కనపించింది. కానీ టీఆర్ఎస్ ఒక్క సారిగా వెనక్కి తగ్గడంతో గురువారం సాయంత్రానికి ప్రశాంతత ఏర్పడింది. కానీ ఇది తుపాను ముందు ప్రశాంతతేనని .. ఈ వ్యవహారంలో బ్లాస్టింగ్ విషయాలు బయట పెడతామని.. బీజేపీ ఢిల్లీ పెద్దల బండారం బయటపెడతామని టీఆర్ఎస్ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. తర్వాత ఏం చేస్తారో కానీ ఇప్పటికైతే సద్దుమణిగింది ఈ విషయంలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గటిల్గు కనపిస్తుంది కానీ ఇప్పటికిప్పుడు ఈ ఎపిసోడ్‌ను ఇంతటితో ఆపేసినా ఆ పార్టీకి ఊహించనంత లాభం కలుగుతుంది. అది అంచనా వేయలేని లాభం. ఈ పద్దతిలో కాకుండా మరో రకంగా సాధించలేని ప్రయోజనం అది. అదే ఫిరాయింపులను నిరోధించడం. 

టీఆర్ఎస్‌ను చేరికలు కొంత కాలం ఆగిపోయినట్లే ! 

తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నాయకులు పలువురు బీజేపీ బాట పట్టారు. మనుగోడు ఉపఎన్నిక తర్వాత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. బీజీపీ నేతలే ఈ రకమైన మైండ్‌గేమ్‌కు పాల్పడ్డారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు నాలుగు జిల్లాల నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతారని నేరుగానే చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఫలితం తేడా వస్తే.. ఆ పార్టీ నాయకుల్లో కూడా భవిష్యత్‌పై భయం ప్రారంభమవుతుంది. అదే సమయంలో అక్కడ బీజేపీ విజయం సాధిస్తే వలసల్ని ఆపడం టీఆర్ఎస్ హైకమాండ్‌కు కూడా సాధ్యం కాదు. రాజకీయం పూర్తిగా బీజేపీ వైపు ఉన్న సమయంలో.. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రయత్నిస్తే .. అడ్డుకునేంత సానుకూలత టీఆర్ఎస్ హైకమాండ్‌కు ఉండదు. ఈ విషయంలో బీజేపీ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ హైకమాండ్ ఏమీ చేయకుండానే ఎమ్మెల్యేలు ఆగిపోతారు. 

బీజేపీలో చేరిన వారి వైపు అనుమానంగా చూసే చాన్స్ !

భారతీయ జనతా పార్టీతో కొంత మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనేది చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మాట. తెలంగాణ నుంచి మరో ఏక్‌నాథ్ షిండే వస్తారని బండి సంజయ్ లాంటి నేతలు చెబుతూ వస్తున్నారు. అలాంటి ప్రయత్నం జరిగిందో లేదో కానీ ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగు చూసింది. అక్కడ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. వంద కోట్ల బేరం జరిగిందని చెబుతున్నారు. అంటే ఒక్కో ఎమ్మెల్యే రూ. వంద కోట్లకు పార్టీ ఫిరాయించబోతున్నారన్న  అభిప్రాయానికి జనం వచ్చారు. రేపు ఎవరైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి.. బీజేపీలో చేరితే.. వారు కూడా రూ. వంద కోట్లు తీసుకున్నారా అనే ప్రశ్న మొదటగా వస్తుంది. ఈ నింద భరించడం ఎమ్మెల్యేలకు అంత  తేలిక కాదు. టీఆర్ఎస్‌లో టిక్కెట్ రాదని..బీజేపీలో చేరామన్నా.. ఎవరూ నమ్మరు. రూ. వంద కోట్లు అందాయనుకుంటారు. 

ఆపరేషన్ ఆకర్ష్‌ను  బీజేపీ పక్కకు పెట్టక తప్పని పరిస్థితి ! 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు బీజేపీలో చేరినా..  ఆ నేతలపై అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత తీసుకున్నారని  ప్రశ్నలొస్తాయి. అంతే కాదు.. తమ  నియోజకవర్గంలోనూ ఈ రకమైన చర్చ జరుగుతుంది. ఇది పార్టీ మారాలనుకుంటున్న నేతలకు అగ్నిపరీక్ష లాంటిదే. ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధమై బీజేపీతో చర్చలు కూడా పూర్తి చేసిన వారికి ఇబ్బందికర పరిస్థితే. అందుకే చర్చలు పూర్తి చేసుకున్న వారు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇది బీజేపీ నేతలకు ఆశనిపాతమేనని అనుకోవచ్చు. కేసులతో భయపెట్టి.. డబ్బులు ఆశ చూపి బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకుంటుందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇలా ఎప్పుడూ బయటపడలేదు. తెలంగాణలో బయటపడటంతో ఆ పార్టీలో చేరికలకు బ్రేక్ పడినట్లేనని చెప్పుకోవచ్చు. 

మునుగోడు ఫలితం ఎలా ఉన్నా.. టీఆర్ఎస్‌కు వలస భయం లేనట్లే ! 

నిజానికి ఫామ్ హస్ కేసులో బీజేపీ నేతలున్నారని ఎవరూ చెప్పడం లేదు. ఆ స్వామిజీలు బీజేపీ నేతలకు సన్నిహితలని చెబుతున్నారు. నందకుమార్ అటు బీజేపీతో పాటు టీఆర్ఎస్ నేతలకూ సన్నిహితుడే. ఆయన ఫలానా పార్టీ కోసం మధ్యవర్తిత్వం చేశారని ఎవరూ అనుకోవడం లేదు. ఇక్కడ బీజేపీది తప్పు ఉన్నా లేకపోయినా రాజకీయంగా లాభం టీఆర్ఎస్‌కు..నష్టం బీజేపీకి ఇప్పటికే కలిగింది. బీజేపీ నేతలు ఇక నుంచి  ఎవరనైనా తమ పార్టీలోకి చేర్చుకోవాలంటే.. ఈ వ్యవహారం సద్దుమణిగిదేకా ఉండాలి. లేకపోతే బేరాలతోనే చేర్చుకున్నారని అంటారు. మొత్తంగా ఈ ఫామ్ హౌస్ వ్యవహారం టీఆర్ఎస్ అధినేతకు పెద్ద చిక్కు తొలగించినట్లయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget