అన్వేషించండి

Nara Lokesh: ఎమ్మెల్యేల బదిలీ పేరుతో సీఎం జగన్ కొత్త పథకం - వైసీపీ నేతలు ఉత్రరాంధ్రను దోచుకున్నారని లోకేశ్ తీవ్ర విమర్శలు

Tdp Shankaravam: వైసీపీ నేతలు అడ్డగోలుగా ఉత్తరాంధ్రను దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శంఖారావం సభలో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.

Nara Lokesh Slams Ysrcp Government in Shankaravam: ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని (Narasannapeta) శంఖారావం బహిరంగ సభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతూ.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎమ్మెల్యేల బదిలీ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని.. ఒక నియోజకవర్గంలో పని చేయని వారు ఇంకో నియోజకవర్గానికి పని చేస్తారా.? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమి అంగీకరించారని అన్నారు. 'సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి.. మద్యం తయారీ, విక్రయం వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారు. 151 సీట్లు గెలిచిన జగన్ రాష్ట్రానికి ఏం సాధించారు?. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలే ఆయనకు బైబై అంటున్నారు. వంద సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ కట్ చేశారు. రాబోయేది టీడీపీ - జనసేన ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తాం. 3 రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం కానీయం. కేసుల మాఫీ కోసం సీఎం కేంద్రం ముందు తల వంచారు.' అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

'అందరినీ మోసం చేశారు'

సీఎం జగన్ పాలనలో అన్నీ వర్గాలను మోసం చేశారని.. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మాయ చేసి జీపీఎస్ తెచ్చారని లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ తాగేది ప్రజల రక్తమని.. మద్యం ద్వారా ఏడాదికి రూ.9 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు మింగేశారని ఆరోపించారు. 'జగన్ బ్లూ బటన్ నొక్కి రూ.10 అకౌంట్లో వేస్తే రెడ్ బటన్ నొక్కి రూ.100 లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అవకాశం ఇస్తే గాలిపై కూడా పన్ను వేస్తారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారు.' అంటూ ధ్వజమెత్తారు.

'రాబోయేది సంక్షేమ ప్రభుత్వం'

వచ్చే ఎన్నికల్లో రాబోయేది టీడీపీ - జనసేన ప్రభుత్వమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే దీపం కనెక్షన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర నేపథ్యంలో 3,132 కి.మీలు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని అన్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పాఠశాలలు వెళ్లే పిల్లలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.

Also Read: Janga Krishna Murthy: 'నమ్మి ఓట్లు వేసిన బీసీలకు మోసం - పవర్‌లెస్‌ పదవులతో అవమానం' జగన్‌పై వైసీపీ ఎమ్మెల్సీ తిరుగుబాటు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget