అన్వేషించండి

Yuvagalam: రేపటి నుంచి మలివిడత యువగళం యాత్ర, ఒంగోలు నుంచి ప్రారంభం- మే 6 వరకు లోకేశ్ ఎన్నికల ప్రచారం

Lokesh Election Campaign : నారా లోకేశ్ మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. ఏప్రిల్ 30న ఒంగోలు నుంచి ప్రారంభం కానుంది. మే 6 వరకు వివిధ ప్రాంతాల్లో లోకేశ్ పర్యటించనున్నారు.

Yuva Galam: తెలుగుదేశం యువనేత జనరల్‌ సెక్రటరీ నారా లోకేశ్( Nara Lokesh) మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం(Kuppam) నుంచి విశాఖ(Vizag) వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేశ్... ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం(Yuvagalam) యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు...

తెలుగుదేశం శ్రేణులు ఎన్నికలకు సిద్ధమయ్యేలా వారిలో ఉత్తేజం నింపిన లోకేశ్ యువగళం(Yuvagalam) యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మరోసారి ప్రజా క్షేత్రంలోకి దిగి ప్రజల మద్దతు కోసం ఆయన ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం(Telugudesam)అధినేత చంద్రబాబు(Chandrababu) విరామం లేకుండా కూటమి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా...లోకేశ్‌ కేవలం తన నియోజకవర్గం మంగళగిరి(Mangalairi)కే పరిమితమయ్యారు. అపార్ట్‌మెంట్‌ వాసులను కలిసి ఓట్లు అభ్యర్థించడంతోపాటు...నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లతో మమేకమయ్యారు. ఆయన భార్య బ్రాహ్మణీ(Nara Brahmani) సైతం మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే గతంలో లోకేశ్ పాదయాత్ర చేయని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతో తిరిగి ఆయా ప్రాంతాల్లో మరోసారి లోకేశ్(Lokesh) పర్యటించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి యువగళం యాత్రలో పాల్గొననున్నారు. రేపు(మంగళవారం) ఒంగోలు(Ongole) నుంచి యువగళం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా మే 6 వరకు ఆయన పర్యటనలు సాగనున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఏప్రిల్ 30 ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, మే 4 నంద్యాల, 5 వ తేదీ చిత్తూరు, 6 వ తేదీ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు.

పాదయాత్ర బదులు బహిరంగ సభలు
గతంలో లోకేశ్(Lokesh) పాదయాత్ర ద్వారా గ్రామాలను చుట్టివచ్చారు. కుప్పం నుంచి అట్టహాసంగా  ప్రారంభమైన ఆయన పాదయాత్ర అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇచ్చాపురం వరకు సాగాల్సి ఉండగా...చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌, బెయిల్ వ్యవహారంతో దాదాపు 2 నెలలకుపైగా పాదయాత్రకు లోకేశ్ విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడైతే పాదయాత్ర నిలుపుదల చేశారో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించినా...సమయం తక్కువగా ఉండటంతో కుదించి విశాఖ(Vizag) వరకే పరిమితం చేశారు. ఆ తర్వాత శంఖారావం పేరిట బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 

సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రచారం నిర్వహించాల్సి ఉండటంతో  శంఖారావం సభలకు ముగింపు పలికి...సొంత నియోజకవర్గంపై దృష్టిసారించారు. అప్పటి నుంచి తీరిక లేకుండా నియోజకవర్గ ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహించిన లోకేశ్(Lokesh)...ఇప్పుడు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా నేతల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా వారం రోజుల పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. గతంలో పర్యటించిన ప్రాంతాల్లో కాకుండా వేరే నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. లోకేశ్ యాత్రతో మరోసారి యువతనో జోష్‌రానుందని...అది తమ గెలుపునకు ఎంతో ఉపయోగపడనుందని తెలుగుదేశం(Telugudesam) అభ్యర్థులు భావిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో లోకేష్ ప్రత్యేకంగా  ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించి...వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ నిర్వహణ, నిరుద్యోగ యువతకు భృతి తదితర హామీలపై వారికి అవగాహన కల్పించనున్నారు.

చంద్రబాబు పర్యటనలు
మరోవైపు చంద్రబాబు(Chandrababu) విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచార సభల్లొ పాల్గొంటున్నారు. కూటమి నేతలు పవన్‌కల్యాణ్‌తో(Pavanakalyan) కలిసి ఉమ్మడి బహిరంగ సభలకు హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) పర్యటన ఖరారుకావడంతో ఆయనతో కలిసి NDA బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్నికలకు మరో 15 రోజులే సమయం ఉండటంతో నేతలంతా తీరికలేకుండా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget