అన్వేషించండి

తహసీల్దార్‌ రమణయ్య హత్య.. విశాఖలో రేగిన రాజకీయ దుమారం

విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ సనపల రమణమయ్య విశాఖ నగరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటన సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Tahsildar Ramanaiahs Murder: విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ సనపల రమణమయ్య విశాఖ నగరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖ నగరాన్ని హత్యలు, కిడ్నాప్‌లకు కేంద్రంగా అధికార వైసీపీ నేతలు మార్చారంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో సాక్షాత్తూ విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను కిరాయి గూండాలు కిడ్నాప్‌ చేశారు. తాజాగా మండల స్థాయిలో మెజిస్ర్టేట్‌గా వ్యవహరించే తహసీల్దార్‌ను హత్య చేయడం, అదీ నగర నడిబొడ్డులోని ఆయన ఇంటికి వెళ్లి మరీ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధాని చేస్తామని చెబుతున్న వైసీపీ నాయకులు.. కనీస స్థాయిలో నగర పౌరులకు భద్రత లేకుండా చేస్తున్నారన్న విమర్శలను గుప్పిస్తున్నారు. ఇప్పుడే నగరంలో ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటుంటే.. భవిష్యత్‌లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇంటికెళ్లి మరీ దారుణ హత్య

విశాఖ జిల్లా రూరల్‌ తహీల్దార్‌గా పని చేస్తూ రెండు రోజులు కిందట రమణయ్యకు విజయనగరం బదిలీ అయింది. మొదటి రోజు విధులకు హాజరైన రమణయ్య రాత్రి 8 గంటలు సమయంలో ఇంటికి చేరుకున్నారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆయన ఇంటికి రాత్రి సుమారు 10.15 గంటలు సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఫోన్‌ చేశారు. ఫోన్‌ వచ్చిన వెంటనే వారిని కలిసేందుకు రమణయ్య కిందకు వచ్చారు. ఓ వ్యక్తితో ఏడు నిమిషాలపాటు సీరియస్‌గా చర్చించారు. ఇద్దరి మధ్య వాదనలు పెరగ్గా, బయటి నుంచి వచ్చిన వ్యక్తి తనతోపాటు తీసుకువచ్చిన ఇనుప రాడ్డుతో రమణయ్యను బలంగా బాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తహసీల్దార్‌ అక్కడికక్కడే కూలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను అపోలో ఆస్పత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. కొమ్మాదిలోని ఎస్‌టీబీఎల్‌ సినీ థియేటర్‌ వెనక ఉన్న చరణ్‌ క్యాస్టల్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ల్యాండ్‌ ఇష్యూకు సంబంధించి ఇరు వర్గాలు మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రమణకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండల పరిధిలోని దిమ్మిలాడ గ్రామం. పదేళ్లు కిందట విధుల్లో చేరారు. డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, కలెక్టరేట్‌లో ఏవోగా పని చేశారు. వజ్రపుకొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్‌ చిన గదిలి ఎమ్మార్వోగా పని చేసి.. రెండు రోజులు కిందట విజయనగరం బదిలీపై వెళ్లారు. 

రాజకీయంగా పెను దుమారం.. అధికార పార్టీపై ఒత్తిడి

విశాఖ అంటే ప్రశాంతమైన నగరంగా పేరుతుంది. అటువంటి నగరంలో గడిచిన కొన్నాళ్ల నుంచి హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపు వ్యవహారాలు సాధారణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కడప ఫ్యాక్షన్‌ రాజకీయాలను వైసీపీ పెంచి పోషిస్తోందని, ఈ ఘటనలు దానికి మచ్చు తునకలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా జరిగిన ఈ ఘటన వైసీపీని కూడా డిఫెన్స్‌లోకి నెట్టినట్టు అయింది. కొద్ది నెలలు కిందట వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేయడం, తాజాగా మండల స్థాయి అధికారి హత్యకు గురి కావడం వంటి వ్యవహారాలన్నీ విశాఖ నగరంలో క్రైమ్‌ రేటు పెరగడాన్ని తెలియజేస్తున్నాయని పలు వర్గాలు నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇళ్లకు వెళ్లి మరీ హత్యలు, కిడ్నాప్‌లు చేసే సంస్కృతికి విశాఖలో పెరుగుతోందంటే దానికి కారణం ప్రభుత్వ ఉదాసీన వైఖరేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. హత్యకు కారణమైన వారిని తక్షణమే పట్టుకుని వారిపై యాక్షన్‌ తీసుకునేలా అధికార పార్టీ పోలీసులపై ఒత్తిడి పెడుతోంది. ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నాయి.

హత్యను ఖండించిన అసోసియేషన్‌

తహసీల్దార్‌ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని నాయకులు తెలియజేశారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని అసోసియేషన్‌ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు రమణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల్లో పని చేసే తహసీల్దార్‌కు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు తీసుకురావాలని కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget