అన్వేషించండి

Sajjala ON PK : పీకే, ఐ ప్యాక్ సేవలు వైఎస్ఆర్‌సీపీ తీసుకోవడం లేదు - సజ్జల కీలక ప్రకటన

ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్‌సీపీకి పని చేయడం లేదని.. ఇక ముందు పని చేయకపోవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ , ఆయనకు చెందిన సంస్థ ఐ ప్యాక్‌ వైఎస్ఆర్‌సీపీకి ఎలాంటి సేవలు అందించడం లేదని ఆ పార్టీ కీలక నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పీకేతో జగన్‌కు వ్యక్తిగతంగా స్నేహం ఉందన్నారు.  2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. వైఎస్ఆర్‌సీపీకి  కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని సజ్జల మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఏ పార్టీతోనూ  పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతమన్నారు.  వైఎస్ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. .కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారని గుర్తు చేశారు.  

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన బ్లూ ప్రింట్‌లో పలు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచించారు. ఆ  బ్లూ ప్రింట్‌లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని సూచించారు. ఆ విషయంపై జాతీయ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. కానీ వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ మాత్రం స్పందించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ విషయంలో వైఎస్ఆర్‌సీపీ సానుకూలంగా ఉందన్న అభిప్రాయం ప్రారంభమయింది. పీకే సేవలు వైఎస్ఆర్‌సీపీకి ఇంకా అందుతున్నాయని ఆయన స్ట్రాటజీ మేరకే పొత్తుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందడుగు వేస్తుందన్న అభిప్రాయాలు వినిపించాయి. స్పందించకపోవడంతో ఇవి పెరిగిపోతున్నాయని గమనించిన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ స్థాయిలో పెట్టుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు మాత్రం... రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఏ పార్టీకి అయినా మద్దతిస్తామని చెబుతున్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని కాగితంపై సంతకం పెట్టి ఇస్తే మద్దతిస్తామని చెబుతున్నారు. అంటే జాతీయ స్థాయిలో పొత్తుల ఆప్షన్స్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్‌ ఓపెన్‌గానే పెట్టుకున్నట్లుగా భావిస్తున్నారు. 

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించారని సీఎం జగన్ ప్రకటించారు. ఆయన వచ్చే ఎన్నికలకూ సేవలు అందిస్తారని గతంలో  మంత్రులకు కేబినెట్  భేటీలో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పీకే కానీ ఆయన కంపెనీ ఐ ప్యాక్ కానీ ఎన్నికలకు సేవలు అందించడం లేదని సజ్జల చెప్పడంతో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ ఓ క్లారిటీ వచ్చినట్లయింది. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Embed widget