అన్వేషించండి

Madhyapradesh Elections: బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతుల ఆత్మహత్యలు: రాహుల్‌ గాంధీ

Madhyapradesh Elections: బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొని మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ల్యాబరేటరీలో రోజుకు ముగ్గురు రైతులు మరణిస్తున్నారని ఆయన విమర్శించారు. 'ఎల్‌కే అద్వానీ ఒక పుస్తకం రాశారు, అందులో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ఒరిజినల్‌ ల్యాబరేటరీ గుజరాత్‌లో లేదని అన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రయోగశాల మధ్యప్రదేశ్‌లో ఉందని, ఇక్కడ రైతులు మరణిస్తున్నారు. ప్రజల సంపద దోచుకుని వైద్యం చేస్తున్నారు' అంటూ రాహుల్‌ విమర్శలు చేశారు. వ్యాపమ్‌ కుంభకోణంపైనా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. దాదాపు కోటి మంది యువత భవిష్యత్తును నాశనం చేశారని, 40 మందిని చంపేశారని ఆయన ఆరోపణలు చేశారు.

ఎంబీబీఎస్‌ సీట్లను అమ్ముకున్నారని, వాటిని రిజిస్టర్‌ చేయించడానికి రూ.15లక్షలు డిమాండ్‌ చేశారని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ ఆగడాలు ఆగడం లేదని అన్నారు. బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ నేతలు ఆదివాసీలను అవమానిస్తారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ-ఆర్‌ఎస్ఎస్‌  లాబరేటరీ ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కాగ్‌ నివేదించినట్లు రాహుల్‌ తెలిపారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌ నేతలు కమల్‌ నాథ్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తర్వాత రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించిన తొలి ర్యాలీ ఇది. మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెలువడనున్నాయి. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో ఉన్న 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ ఆరు మాత్రమే గెలుచుకుంది. ఈ ప్రాంతంలో తిరిగి రాజకీయ పట్టు సాధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. పార్టీ ప్రాబల్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ర్యాలీని చేపట్టింది. ఇక్కడ రాహుల్‌ ఇది రెండో ర్యాలీ. మొదటి ర్యాలీ సెప్టెంబరు 30న షాజాపూర్‌ జిల్లాలో జరిగింది.

రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌లో పార్టీ అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశం కానున్నారు. బియోహరి ప్రాంతంలో చేపట్టబోయే ర్యాలీకి లక్ష మందికి పైగా హాజరవుతారని కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. వింధ్య ప్రాంతంలోని ముఫ్ఫై స్థానాల్లో అత్యధిక ప్రజలను సమీకరించేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తిరిగి ఇక్కడ తమ పార్టీ వైభవాన్ని నిలబెట్టుకోవాలని కృషి చేస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రచారాలు జోరందుకున్నాయి.  ఇరు వైపులా నేతలు ప్రచారాలు ప్రారంభించారు.  ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే  ప్రధాని నరేంద్ర మోదీ జులైలో షాదోల్‌ను సందర్శించి గిరిజనుల కోసం పలు పథకాలను ప్రకటించారు.  మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ ఈ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే బీజేపీ ఇప్పటికే నాలుగు వేర్వేరు జాబితాల్లో 136 మంది అభ్యర్థులను ప్రకటించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget