అన్వేషించండి

Madhyapradesh Elections: బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతుల ఆత్మహత్యలు: రాహుల్‌ గాంధీ

Madhyapradesh Elections: బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొని మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ల్యాబరేటరీలో రోజుకు ముగ్గురు రైతులు మరణిస్తున్నారని ఆయన విమర్శించారు. 'ఎల్‌కే అద్వానీ ఒక పుస్తకం రాశారు, అందులో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ఒరిజినల్‌ ల్యాబరేటరీ గుజరాత్‌లో లేదని అన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రయోగశాల మధ్యప్రదేశ్‌లో ఉందని, ఇక్కడ రైతులు మరణిస్తున్నారు. ప్రజల సంపద దోచుకుని వైద్యం చేస్తున్నారు' అంటూ రాహుల్‌ విమర్శలు చేశారు. వ్యాపమ్‌ కుంభకోణంపైనా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. దాదాపు కోటి మంది యువత భవిష్యత్తును నాశనం చేశారని, 40 మందిని చంపేశారని ఆయన ఆరోపణలు చేశారు.

ఎంబీబీఎస్‌ సీట్లను అమ్ముకున్నారని, వాటిని రిజిస్టర్‌ చేయించడానికి రూ.15లక్షలు డిమాండ్‌ చేశారని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ ఆగడాలు ఆగడం లేదని అన్నారు. బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ నేతలు ఆదివాసీలను అవమానిస్తారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ-ఆర్‌ఎస్ఎస్‌  లాబరేటరీ ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కాగ్‌ నివేదించినట్లు రాహుల్‌ తెలిపారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌ నేతలు కమల్‌ నాథ్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తర్వాత రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించిన తొలి ర్యాలీ ఇది. మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెలువడనున్నాయి. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో ఉన్న 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ ఆరు మాత్రమే గెలుచుకుంది. ఈ ప్రాంతంలో తిరిగి రాజకీయ పట్టు సాధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. పార్టీ ప్రాబల్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ర్యాలీని చేపట్టింది. ఇక్కడ రాహుల్‌ ఇది రెండో ర్యాలీ. మొదటి ర్యాలీ సెప్టెంబరు 30న షాజాపూర్‌ జిల్లాలో జరిగింది.

రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌లో పార్టీ అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశం కానున్నారు. బియోహరి ప్రాంతంలో చేపట్టబోయే ర్యాలీకి లక్ష మందికి పైగా హాజరవుతారని కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. వింధ్య ప్రాంతంలోని ముఫ్ఫై స్థానాల్లో అత్యధిక ప్రజలను సమీకరించేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తిరిగి ఇక్కడ తమ పార్టీ వైభవాన్ని నిలబెట్టుకోవాలని కృషి చేస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రచారాలు జోరందుకున్నాయి.  ఇరు వైపులా నేతలు ప్రచారాలు ప్రారంభించారు.  ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే  ప్రధాని నరేంద్ర మోదీ జులైలో షాదోల్‌ను సందర్శించి గిరిజనుల కోసం పలు పథకాలను ప్రకటించారు.  మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ ఈ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే బీజేపీ ఇప్పటికే నాలుగు వేర్వేరు జాబితాల్లో 136 మంది అభ్యర్థులను ప్రకటించింది.

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget