అన్వేషించండి

Pm Modi: 'ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి' - ప్రజాగళం సభకు వస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్, పల్నాడు జిల్లా పసుపుమయం

Andhra News: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై కనిపించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Prajagalam Meeting in Palnadu District: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీట్ల షేరింగ్ కూడా పూర్తైంది. ఈ క్రమంలో 3 పార్టీలు కలిసి నిర్వహిస్తోన్న తొలి సభకు సర్వం సిద్ధమైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో 'ప్రజాగళం' పేరిట నిర్వహిస్తోన్న బహిరంగ సభకు మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సభలో ఒకే వేదికపై పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. దీంతో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏపీ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామని.. ప్రజాగళం సభ కోసం ఏపీకి వస్తున్నా అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'చంద్రబాబు, పవన్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా. ఎన్డీయేకు ఏపీ ప్రజల ఆశీర్వాదం కావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తాం.' అని ట్వీట్ లో పేర్కొన్నారు. 

గన్నవరం ఎయిర్ పోర్టుకు

అటు, బహిరంగ సభ వద్దకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేరుకోగా.. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్న ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

పసుపుమయంగా పల్నాడు

మరోవైపు, 'ప్రజాగళం' బహిరంగ సభతో పల్నాడు జిల్లా పసుపుమయంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు, ట్రాక్టర్లు, కార్లల్లో భారీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. బొప్పూడికి ఇరువైపులా దారి పొడవునా.. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2014 ఎన్నికల సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే సభలో పాల్గొన్నారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, ప్రధాని మోదీ కనిపించనుండడంతో శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ సభలో నేతల ప్రసంగంపైనే అందరి చూపూ ఉంది. ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోననే అటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 3 పార్టీల కీలక నేతలు సభ వద్దకు చేరుకున్నారు. అటు, ప్రధాని మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో సభా ప్రాంగణం వద్ద ఎస్పీజీ అధికారులు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Also Read: Weather Latest Update: గుడ్‌న్యూస్! చల్లబడ్డ వాతావరణం, మరో రెండు రోజులు వర్షాలు - ఈ జిల్లాల్లో కాస్త ఎక్కువగా: ఐఎండీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget