అన్వేషించండి

Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

PM Modi vs Revanth Reddy: కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టేందుకు మోదీ కొత్త మైండ్ గేమ్ ఆడుతున్నారా? రేవంత్ రెడ్డిపై ప్రశంసల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?

Modi Political Strategy On Revanth:   జాతీయ,  తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని బలమైన , చురుకైన నాయకులను లక్ష్యంగా చేసుకుని మోదీ పన్నుతున్న  మైండ్ గేమ్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది.  
 
రాజకీయ వ్యూహంలో కొత్త కోణం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లో డైరెక్ట్ ఫైట్  కంటే  సైకలాజికల్ వార్ చేయడంలో దిట్ట. కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులను నేరుగా విమర్శించడం కంటే, వారిపై సొంత పార్టీలోనే అనుమానాలు కలిగేలా చేయడం మోదీ మార్కు రాజకీయం. గతంలో హిమంత బిస్వా శర్మ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఆయన దృష్టి దక్షిణాదిలో కాంగ్రెస్‌కు పవర్‌ హౌస్‌గా మారిన రేవంత్ రెడ్డిపై పడింది. రేవంత్‌ను ప్రశంసించడం ద్వారా లేదా ఆయనకు సానుకూల సంకేతాలు పంపడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఆయనను అనుమానితుడిగా నిలబెట్టాలనేది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది.

 మోదీ పిలుపు - రేవంత్ సంకట స్థితి 

హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి రావాలని నర్మగర్భంగా పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. విభజన హామీలు, నిధుల కోసం ఆయన ప్రధానితో భేటీ అవుతుంటే, దానిని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో బీజేపీ వ్యూహకర్తలు సఫలమవుతున్నారు. ఇది రేవంత్‌కు ఒక రకమైన  ధర్మసంకటం  లాంటిదే. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం, కలిసుంటే సొంత పార్టీలో ముద్ర పడే ప్రమాదం ఉంది. మరోవైపు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్  ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. రేవంత్ రెడ్డి ఏనాటికైనా బీజేపీలోకి వెళ్తారని, ఆయన ఆర్ఎస్ఎస్  భావజాలం ఉన్న వ్యక్తి అని కేటీఆర్ వంటి నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలతో రేవంత్ టచ్‌లో ఉన్నారనే పుకార్లను లేవనెత్తడం ద్వారా కాంగ్రెస్ కేడర్‌లో,  ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్నది వారి ప్లాన్. మోదీ వేస్తున్న పాచికలకు బీఆర్ఎస్ ప్రచారం తోడవ్వడం రేవంత్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే.

 రేవంత్ దూకుడు - మోదీపై విమర్శలు 

అయితే రేవంత్ రెడ్డి శైలి ఇందుకు భిన్నంగా ఉంటుంది. రాజకీయ అవసరం ఏర్పడినప్పుడు మోదీని  డెమోన్ అని విమర్శించడానికి కూడా ఆయన వెనుకాడరు. తెలంగాణా గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో ఆయన చూపిన దూకుడు వెనుక మోదీ-షా ద్వయాన్ని ఢీకొనే ధైర్యం ఉంది. కానీ, మోదీ విసిరే  ప్రశంసల అస్త్రాలు  విమర్శల కంటే ప్రమాదకరమైనవి. శత్రువును విమర్శించడం కంటే, శత్రువును పొగడటం ద్వారా అతడిని సొంత గూటిలోనే ఒంటరిని చేసే మోదీ ఎత్తుగడలను రేవంత్ ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తికరం.

కాంగ్రెస్ హైకమాండ్ బాధ్యత 

ఇక్కడ అసలైన పరీక్ష రేవంత్ రెడ్డికి కాదు, కాంగ్రెస్ హైకమాండ్‌కే. గతంలో బలమైన నేతలను అనుమానించి, వారిని అవమానించి దూరం చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఇప్పుడు రేవంత్ విషయంలో కూడా అదే తప్పు చేస్తే అది కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. మోదీ వేసే పాచికల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించి, రేవంత్‌ను  రక్షించుకోవాల్సిన సమయం ఇది. రేవంత్‌ను ఏ మాత్రం అనుమానించినా, అది బీజేపీకి రహదారి వేసినట్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది రేవంత్ కంటే ఎక్కువగా మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలే.మోదీ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి ఒక కీలకమైన  పావు  కాదు,  రాజు . ఆ రాజును కాపాడుకోవడం కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లోనే ఉంది. నాయకుల మధ్య అనుమానపు బీజాలు నాటి  కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే మోదీ వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే, కాంగ్రెస్ తన అంతర్గత బలాన్ని, నాయకత్వంపై నమ్మకాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి వంటి చురుకైన నాయకుడిని కాపాడుకోలేకపోతే, దక్షిణాదిలో కాంగ్రెస్ కోట బీటలు వారడం ఖాయం. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
Mamata Banerjee TMC Rebellion 2026: లీడర్లు వెళ్లినా మమతా బెనర్జీకి తిరుగులేదు - ప్రత్యామ్నాయం లేకపోవడమే బలం - దీదీ కాకపోతే ఇంకెవరు?
లీడర్లు వెళ్లినా మమతా బెనర్జీకి తిరుగులేదు - ప్రత్యామ్నాయం లేకపోవడమే బలం - దీదీ కాకపోతే ఇంకెవరు?
Delimitation 2026 Southern States Loss: నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
Advertisement

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Embed widget