అన్వేషించండి

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకి ఇంకొంచం దూరంగా ఉన్నా.. ఇప్పుడే ఎన్నికొస్తాయా? అన్న విధంగా ఉంది రాజకీయపార్టీల తీరు. ఎవరూ ఎక్కడా తగ్గడంలేదు. ఎన్నికలకు ప్రజల్ని సిద్దం చేస్తున్నారా? వారు సిద్ధం అవుతున్నారా?

సినిమావాళ్లకి ప్రేక్షకులే దేవుళ్లు. రాజకీయనాయకులకు ఓటర్లే దేవుళ్లు. అందుకే ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే ఎవరి రాజకీయాలు వాళ్లు మొదలెట్టారు. ప్రజలే మాకు అండాదండా అని ఎవరి స్టైల్లో వాళ్లు చెప్పడమే కాదు సెంటిమెంట్‌తో సక్సెస్‌ కావాలనుకుంటున్నారు. తెలుగురాష్ట్రాల్లో రాజకీయం సవాళ్ల నుంచి సెంటిమెంట్‌కి మారింది. 

నిన్నటివరకు తేల్చుకుందాం..చూసుకుందాం అన్న రాజకీయపార్టీలు, నేతలు ఇప్పుడు సెంటిమెంట్‌నే నమ్ముకొని రాజకీయాలు మొదలెట్టారు. ఎన్నికల టైమ్‌ ఇంకా ఉండగానే ముందస్తుగా రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు ప్రచారాలు, పర్యటనలో పంచ్‌ డైలాగులతోపాటు పవర్‌ ఫుల్‌ సెంటిమెంట్‌ని ప్రజల మైండ్‌లోకి ఎక్కిస్తున్నారు. అధికారపార్టీ వైసీపీని ఓడించేందుకు వరకు టిడిపి-జనసేన ఏకమయ్యాయి. ఆ పార్టీల పిలుపుతో ఆంధ్రాలోని అన్ని పార్టీలు ఏకమయ్యాయి. జగన్‌ రాక్షస, అవినీతి పాలనని అంతం చేయాలని పిలుపునిస్తున్నాయి. అంతేకాదు ఏపీని అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు కావాలంటే చంద్రబాబుని మళ్లీ గెలిపించాలని నిన్నటి వరకు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు సిఎం అభ్యర్థి గురించి ప్రస్తావించకుండా సెంటిమెంట్‌ని టచ్‌ చేస్తూ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు.

 హైదరాబాద్‌ హైటెక్‌ సిటీగా పేరురావడానికి తానే కారణమని పలు సందర్భాల్లో చెప్పిన చంద్రబాబు మొన్నా మధ్య తెలంగాణ టిడిపి అధ్యక్షుని ప్రమాణస్వీకారం రోజున కూడా ఆ మాటనే గుర్తు చేశారు. నేను సిఎంగా మొదలెట్టిన పనిని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారని తెలిపారు. అందుకే హైదరాబాద్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందని చెబుతూ అమరావతిని జగన్‌ నాశనం చేశారని విమర్శలు చేశారు. కొద్దిరోజుల క్రితం వచ్చే ఎన్నికలే తనకు, చివరివి అని చెప్పి మళ్లీ టిడిపికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. దీనికి అధికారపార్టీ కౌంటర్‌ ఇస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేసింది. దీంతో ఇప్పుడు టిడిపి అధినేత ఏలూరు పర్యటనలో మరోసారి తన వ్యాఖ్యలను సరిచేసుకుంటూ వచ్చే ఎన్నికలు తనకు, ప్రజలకు చివరి ఎన్నికలు అని హెచ్చరిస్తున్నారు. 

జగన్ని మళ్లీ సిఎం చేస్తే అమరావతి, పోలవరమే కాదు అసలు అభివృద్ధే ఉండదని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు. లోకేష్‌, తనను హత్య చేసేందుకు వైసీపీ కుట్రపన్నుతోందని చెబతూ వైఎస్‌ వివేకానంద హత్యని ప్రస్తావించారు. ప్రజల అండాదండా ఉన్నంతవరకు తనకేమీ కాదని సెంటిమెంట్‌తో కొట్టారు. 

జనసేన అధినేత కూడా ఈ మధ్యన జరుగుతున్న పార్టీ సమావేశాల్లో జగన్‌ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తూనే ప్రజల అండ తనకుందని చెప్పుకొచ్చారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌ అని ప్రాధేయపడుతూ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకుంటానని ప్రజల జోలికి వస్తే ఊరుకోనని ఇప్పటం గ్రామ పర్యటనలో అటు జగన్‌ సర్కార్‌కి వార్నింగ్‌ ఇటు ప్రజలని సెంటిమెంట్‌తో కొట్టారు పవన్‌.

ఇలా విపక్ష నేతలే కాదు జగన్‌ కూడా మళ్లీ తనకి కలిసొచ్చిన సెంటిమెంట్‌నే నమ్ముకొన్నారు. తండ్రి మృతితో ఓదార్పు యాత్ర చేసి దాదాపు 10ఏళ్లు ప్రజల మధ్యనే ఉన్న జగన్‌ సిఎం అయ్యాక కాస్తంత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు విపక్షాల పర్యటనలు, ప్రచారాల నేపథ్యంలో వైసీపీ అధినేత కూడా అధికార కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో విపక్షాలపై విమర్శలు చేస్తూనే తనకి పైనున్న ఆ దేవుడు, ఈ ప్రజల అండ ఉందని చెబుతూ తనకి ఏ పార్టీతో పొత్తులు లేవని ప్రజలతోనే నా పొత్తు ఉంటుందని సెంటిమెంట్‌ రాజేశారు. 

ఇలా నిన్నటి వరకు సవాళ్లు విసురుకున్న అధినేతలు ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్‌నే నమ్ముకొని ప్రజల మనసులను గెలుచుకోవాలనుకుంటున్నారు. మరి ఈ సెంటిమెంట్‌ వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తుందో !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget