అన్వేషించండి

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకి ఇంకొంచం దూరంగా ఉన్నా.. ఇప్పుడే ఎన్నికొస్తాయా? అన్న విధంగా ఉంది రాజకీయపార్టీల తీరు. ఎవరూ ఎక్కడా తగ్గడంలేదు. ఎన్నికలకు ప్రజల్ని సిద్దం చేస్తున్నారా? వారు సిద్ధం అవుతున్నారా?

సినిమావాళ్లకి ప్రేక్షకులే దేవుళ్లు. రాజకీయనాయకులకు ఓటర్లే దేవుళ్లు. అందుకే ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే ఎవరి రాజకీయాలు వాళ్లు మొదలెట్టారు. ప్రజలే మాకు అండాదండా అని ఎవరి స్టైల్లో వాళ్లు చెప్పడమే కాదు సెంటిమెంట్‌తో సక్సెస్‌ కావాలనుకుంటున్నారు. తెలుగురాష్ట్రాల్లో రాజకీయం సవాళ్ల నుంచి సెంటిమెంట్‌కి మారింది. 

నిన్నటివరకు తేల్చుకుందాం..చూసుకుందాం అన్న రాజకీయపార్టీలు, నేతలు ఇప్పుడు సెంటిమెంట్‌నే నమ్ముకొని రాజకీయాలు మొదలెట్టారు. ఎన్నికల టైమ్‌ ఇంకా ఉండగానే ముందస్తుగా రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు ప్రచారాలు, పర్యటనలో పంచ్‌ డైలాగులతోపాటు పవర్‌ ఫుల్‌ సెంటిమెంట్‌ని ప్రజల మైండ్‌లోకి ఎక్కిస్తున్నారు. అధికారపార్టీ వైసీపీని ఓడించేందుకు వరకు టిడిపి-జనసేన ఏకమయ్యాయి. ఆ పార్టీల పిలుపుతో ఆంధ్రాలోని అన్ని పార్టీలు ఏకమయ్యాయి. జగన్‌ రాక్షస, అవినీతి పాలనని అంతం చేయాలని పిలుపునిస్తున్నాయి. అంతేకాదు ఏపీని అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు కావాలంటే చంద్రబాబుని మళ్లీ గెలిపించాలని నిన్నటి వరకు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు సిఎం అభ్యర్థి గురించి ప్రస్తావించకుండా సెంటిమెంట్‌ని టచ్‌ చేస్తూ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు.

 హైదరాబాద్‌ హైటెక్‌ సిటీగా పేరురావడానికి తానే కారణమని పలు సందర్భాల్లో చెప్పిన చంద్రబాబు మొన్నా మధ్య తెలంగాణ టిడిపి అధ్యక్షుని ప్రమాణస్వీకారం రోజున కూడా ఆ మాటనే గుర్తు చేశారు. నేను సిఎంగా మొదలెట్టిన పనిని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారని తెలిపారు. అందుకే హైదరాబాద్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందని చెబుతూ అమరావతిని జగన్‌ నాశనం చేశారని విమర్శలు చేశారు. కొద్దిరోజుల క్రితం వచ్చే ఎన్నికలే తనకు, చివరివి అని చెప్పి మళ్లీ టిడిపికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. దీనికి అధికారపార్టీ కౌంటర్‌ ఇస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేసింది. దీంతో ఇప్పుడు టిడిపి అధినేత ఏలూరు పర్యటనలో మరోసారి తన వ్యాఖ్యలను సరిచేసుకుంటూ వచ్చే ఎన్నికలు తనకు, ప్రజలకు చివరి ఎన్నికలు అని హెచ్చరిస్తున్నారు. 

జగన్ని మళ్లీ సిఎం చేస్తే అమరావతి, పోలవరమే కాదు అసలు అభివృద్ధే ఉండదని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు. లోకేష్‌, తనను హత్య చేసేందుకు వైసీపీ కుట్రపన్నుతోందని చెబతూ వైఎస్‌ వివేకానంద హత్యని ప్రస్తావించారు. ప్రజల అండాదండా ఉన్నంతవరకు తనకేమీ కాదని సెంటిమెంట్‌తో కొట్టారు. 

జనసేన అధినేత కూడా ఈ మధ్యన జరుగుతున్న పార్టీ సమావేశాల్లో జగన్‌ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తూనే ప్రజల అండ తనకుందని చెప్పుకొచ్చారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌ అని ప్రాధేయపడుతూ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకుంటానని ప్రజల జోలికి వస్తే ఊరుకోనని ఇప్పటం గ్రామ పర్యటనలో అటు జగన్‌ సర్కార్‌కి వార్నింగ్‌ ఇటు ప్రజలని సెంటిమెంట్‌తో కొట్టారు పవన్‌.

ఇలా విపక్ష నేతలే కాదు జగన్‌ కూడా మళ్లీ తనకి కలిసొచ్చిన సెంటిమెంట్‌నే నమ్ముకొన్నారు. తండ్రి మృతితో ఓదార్పు యాత్ర చేసి దాదాపు 10ఏళ్లు ప్రజల మధ్యనే ఉన్న జగన్‌ సిఎం అయ్యాక కాస్తంత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు విపక్షాల పర్యటనలు, ప్రచారాల నేపథ్యంలో వైసీపీ అధినేత కూడా అధికార కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో విపక్షాలపై విమర్శలు చేస్తూనే తనకి పైనున్న ఆ దేవుడు, ఈ ప్రజల అండ ఉందని చెబుతూ తనకి ఏ పార్టీతో పొత్తులు లేవని ప్రజలతోనే నా పొత్తు ఉంటుందని సెంటిమెంట్‌ రాజేశారు. 

ఇలా నిన్నటి వరకు సవాళ్లు విసురుకున్న అధినేతలు ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్‌నే నమ్ముకొని ప్రజల మనసులను గెలుచుకోవాలనుకుంటున్నారు. మరి ఈ సెంటిమెంట్‌ వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తుందో !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Embed widget