అన్వేషించండి

1000 Days Jagan Ruling : సీఎంగా జగన్ పాలనకు వెయ్యి రోజులు ! ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుస్తోందా ?

సీఎం జగన్ పాలనకు నేటితో వెయ్యి రోజులు పూర్తయింది. భారీ మెజార్టీతో అధికారం దక్కించుకున్న జగన్‌ వారిఆశలను నెరవేరుస్తున్నారా ? ప్రజాభీష్టం ప్రకారం పరిపాలిస్తున్నారా ?

 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి వెయ్యి రోజులయింది. అయితే ఈ ఉత్సాహం వైఎస్ఆర్‌సీపీలో కనిపించడం లేదు. ఆ పార్టీ అనుబంధ  విభాగాలకు ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తేనే అందరికీ తెలిసింది.  వెయ్యి రోజులంటే అరవై శాతం తన పరిపాలనా సమయం ముగిసింది. వెయ్యి రోజుల్లో జగన్ పాలన ఎలా సాగింది ? 

సంక్షేమ పథకాలతో లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు !

రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన ప్లస్ పాయింట్లలో ఒకటి నుంచి వంద వరకు చెప్పుకోవాల్సింది నగదు బదిలీ పథకాల గురించే. మేనిఫెస్టో ప్రకారం ఒక్కో కుటుంబానికి ఏటా రూ. రెండు లక్షలకుపైగానే లబ్ది కలిగిస్తామని జగన్ లెక్క చెప్పారు. ఆ ప్రకారం ఆయన చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినా  అప్పుల కోసం తీవ్రంగా శ్రమించి పథకాలు అమలు చేస్తున్నారు.  ఆదాయం కోసం... మద్యం విధానాన్ని మార్చడంతో పాటు.. వివిధరకాల పన్నులు పెంచడం, అప్పుల కోసం క్రియేటివిటీగా ఆలోచించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వంటివి చేశారు. ఇన్ని చేసినా ఈ ఏడాది అమ్మఒడి ఇవ్వలేకపోయారు. అటెండెన్స్‌కు లింక్ పెట్టి ఇస్తామని జూన్‌కు మార్చారు. మామూలుగా అయితే జనవరిలో ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామని సగం మందికిపైగా లబ్దిదారుల వద్ద వాలంటీర్లు అంగీకార పత్రాలు కూడా తీసుకున్నారు. కానీ నేరుగా చెప్పకపోయినా ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. 

అభివృద్ధి పనులు అంతంత మాత్రమే !

వెయ్యి రోజుల కాలంలో ఏపీలో జరిగిన అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగాహనే ఉద్దానం వెళ్లి ఓ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వెయ్యి రోజులయినా ఆ ఆస్పత్రి పునాదులు కూడా పూర్తి కాలేదు. అది ఉదాహరణ మాత్రమే... రాష్ట్రంలో అన్ని అభివృద్ది పనులూ అంతే. గత ప్రభుత్వం చేపట్టినవన్నీ ఎక్కడవక్కడ ఆపేశారు. రోడ్ల మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి. పోలవరం కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ప్రతి నెలా ఐదారు వేల కోట్లు అప్పు పుట్టించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వద్ద ఉంది.  చివరికి ప్రభుత్వ పార్కులు, మార్కెట్లు... క్వార్టర్స్ ఏమైనా ఉంటే తాకట్టు పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని మంత్రులే నేరుగా చెబుతున్నారు. 

కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు !

వెయ్యి రోజుల కాలంలో ప్రభుత్వం హైకోర్టు వద్ద నుంచి తిన్న ఎదురు దెబ్బలకు లెక్క లేదు. అదే సమయంలో వెనక్కి తీసుకున్న నిర్ణయాలపైనా లెక్కలేయడం కష్టం.  అత్యంత కీలకమైన మూడు రాజధానుల బిల్లు, శాసనమండలి రద్దు బిల్లులను కూడా వెనక్కి తీసుకున్నారు.  వెయ్యి రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, ఇంగ్లిష్ మీడియం, ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను తొలగించడం..ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ ఒక్క నిర్ణయమూ అమలు చేసిన పరిస్థితులు కనిపించలేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న రెండు వందల నిర్ణయాల వరకూ కోర్టులు ప్రశ్నించాయి.. కొట్టి వేశాయి. ఇప్పుడు తమంతట తాము తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. అంటే... మెథడ్ ఏదైనా.. వెనక్కి పోవడమే . అందుకే రివర్స్ పాలన అన్న విమర్శలు వస్తున్నాయి. 
  
రివ్యూ చేసుకోవాల్సిన సమయం !

ఏపీ ప్రభుత్వానికి వెయ్యి రోజులు నిండాయి. మహా అయితే ఇంకో ఆరు వందల రోజులు మాత్రమే పాలనకు సమయం ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేసుకోవాల్సింది సమీక్ష. తమ పాలనా వైఫల్యాలను ..  ప్రజలను అసంతృప్తి గురి చేస్తున్న అంశాలను గుర్తించి తక్షణం సరి చేసుకోవాలి. పార్టీ నేతలు తమ సీఎం ప్రపంచానికి ఆదర్శంగా పాలన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ ప్రజల నుంచి వచ్చేదే అసలైన అభిప్రాయం. అది తెలుసుకుని రివ్యూ చేసుకుంటే ప్రజారంజక పాలన అందివవచ్చు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget