అన్వేషించండి

Rahul Bharat Jodo Yatra : అమరావతికే రాహుల్ గాంధీ సపోర్ట్ - ఏపీలో కోలాహలంగా తొలి రోజు జోడో యాత్ర !

ఏపీలో తొలి రోజు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా సాగింది. రాహుల్‌ను అమరావతి రైతులు, పోలవరం నిర్వాసితులు కలిశారు.

 

Rahul Bharat Jodo Yatra :   ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్నూలు జిల్లాలో గట్టి బందోబస్తు నడుమ సాగింది. ఆలూరు నియోజకవర్గం హాలహర్వి బస్టాండ్ వద్ద ఉదయం 7.05కు ప్రారంభం అయింది. కురవల్లి మీదుగా సాగుతూ అగ్రహారం శిబిరం వద్దకు 9 గంటలకు చేరుకుంది.  తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమై.. ఆలూరు, హులేబీడు మీదుగా మనేకుర్తి వరకు సాగింది. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యనాయకులు, యాత్రీకులు చాగి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో రాత్రికి బస చేశారు. యాత్రకు ముందుగా యువకుల బ్యాండ్ పరేడ్ ఆకట్టుకుంది. భారీ జనసందోహం మధ్య, డప్పుల చప్పుళ్ళతో యాత్ర సాగింది. ప్రజలు అడుడగుగునా స్వాగతం పలికారు. యాత్రలో రా ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్, ఏఐసిసి నాయకులు దిగ్విజయ్ సింగ్, జేడి శీలం, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి, బాపిరాజు, చింతా మోహన్, తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మరో మూడు రోజుల పాటు ఎపిలో యాత్ర సాగనుంది. బుధవారం చాగి నుండి అరేకల్ వరకూ యాత్ర సాగనుంది. 

అమరావతికి రాహుల్ సపోర్ట్ !

తాము అధికారంలోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతిని చేస్తామని రాహుల్ గాంధీ అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా విరామ సమయంలో అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలిశారు. వైసిపి ప్రభుత్వంలో అమరావతి రైతులకు తీరని అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని రైతులు తెలిపారు. తమ పార్టీ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని రైతులకు రాహుల్ హామీ ఇచ్చారు. దాదాపు 40 మంది రైతులు అమరావతి నుండి రాహుల్ గాంధీని కలిసేందుకే రాగా కొందరికే అనుమతి ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం రైతులకు ఆర్ ఓ ఆర్ ప్యాకేజీ అమలు చేసిన తరువాతనే ముందుకు వెళ్తామని రాహుల్ గాంధీ పోలవరం రైతులకు హామీ ఇచ్చారు. జోడో యాత్ర విరామ సమయంలో పోలవరం రైతులు రాహుల్ ను కలిశారు. ఆర్ ఓ ఆర్ ప్యాకేజీ ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడం లేదని, ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని రైతులు రాహుల్ గాంధీకి వివరించారు.

బీజేపీ విభజన రాజకీయాలు దేశానకి ప్రమాదమన్న రాహుల్ !
 
 కార్పొరేట్లకు ఉపయోగపడేలా బిజెపి పాలన సాగిస్తోందని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మనేకుర్తి వద్ద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రైతులు తనను కలిశారని, రాజధాని కోసం భూములిస్తే రాజధాని మార్చాలని వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మూడు రాజధానులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అమరావతి రైతుల సమస్య పట్ల తాము చిత్తశుద్దితో ఉన్నామని, రైతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. బిజెపి విభజన రాజకీయాలు చేస్తూ దేశాన్ని ఎక్కడికక్కడ విడదీస్తోందని, అందుకోసమే ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. యాత్రలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
   
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న నేతలు!

2024లో తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర విరామ శిబిరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పటి వరకు 41 రోజులు భారత్ జోడో యాత్ర సాగిందని, ఏపీలో నాలుగు రోజులు యాత్ర సాగిన తరువాత తిరిగి కర్ణాటకలోకి ప్రవేశిస్తుందని, ఆ తరువాత తెలంగాణలో సాగుతుందని తెలిపారు. ఈ యాత్ర ఓట్ల కోసం చేస్తున్న యాత్ర కాదని భారతీయులను ఐక్యం చేసేందుకు చేస్తున్న యాత్రని తెలిపారు. ఏపీలో చాలా సవాళ్లు ఉన్నాయని, యువ నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం పొందుతుందని చెప్పారు. ఆర్థిక అసమానతలు, కుల, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీయటం, ఏక చత్రాధిపత్యంతో రాష్ట్రాల హక్కులను హరించే వాటికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget