అన్వేషించండి

Rahul Bharat Jodo Yatra : అమరావతికే రాహుల్ గాంధీ సపోర్ట్ - ఏపీలో కోలాహలంగా తొలి రోజు జోడో యాత్ర !

ఏపీలో తొలి రోజు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా సాగింది. రాహుల్‌ను అమరావతి రైతులు, పోలవరం నిర్వాసితులు కలిశారు.

 

Rahul Bharat Jodo Yatra :   ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్నూలు జిల్లాలో గట్టి బందోబస్తు నడుమ సాగింది. ఆలూరు నియోజకవర్గం హాలహర్వి బస్టాండ్ వద్ద ఉదయం 7.05కు ప్రారంభం అయింది. కురవల్లి మీదుగా సాగుతూ అగ్రహారం శిబిరం వద్దకు 9 గంటలకు చేరుకుంది.  తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమై.. ఆలూరు, హులేబీడు మీదుగా మనేకుర్తి వరకు సాగింది. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యనాయకులు, యాత్రీకులు చాగి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో రాత్రికి బస చేశారు. యాత్రకు ముందుగా యువకుల బ్యాండ్ పరేడ్ ఆకట్టుకుంది. భారీ జనసందోహం మధ్య, డప్పుల చప్పుళ్ళతో యాత్ర సాగింది. ప్రజలు అడుడగుగునా స్వాగతం పలికారు. యాత్రలో రా ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్, ఏఐసిసి నాయకులు దిగ్విజయ్ సింగ్, జేడి శీలం, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి, బాపిరాజు, చింతా మోహన్, తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మరో మూడు రోజుల పాటు ఎపిలో యాత్ర సాగనుంది. బుధవారం చాగి నుండి అరేకల్ వరకూ యాత్ర సాగనుంది. 

అమరావతికి రాహుల్ సపోర్ట్ !

తాము అధికారంలోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతిని చేస్తామని రాహుల్ గాంధీ అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా విరామ సమయంలో అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలిశారు. వైసిపి ప్రభుత్వంలో అమరావతి రైతులకు తీరని అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని రైతులు తెలిపారు. తమ పార్టీ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని రైతులకు రాహుల్ హామీ ఇచ్చారు. దాదాపు 40 మంది రైతులు అమరావతి నుండి రాహుల్ గాంధీని కలిసేందుకే రాగా కొందరికే అనుమతి ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం రైతులకు ఆర్ ఓ ఆర్ ప్యాకేజీ అమలు చేసిన తరువాతనే ముందుకు వెళ్తామని రాహుల్ గాంధీ పోలవరం రైతులకు హామీ ఇచ్చారు. జోడో యాత్ర విరామ సమయంలో పోలవరం రైతులు రాహుల్ ను కలిశారు. ఆర్ ఓ ఆర్ ప్యాకేజీ ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడం లేదని, ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని రైతులు రాహుల్ గాంధీకి వివరించారు.

బీజేపీ విభజన రాజకీయాలు దేశానకి ప్రమాదమన్న రాహుల్ !
 
 కార్పొరేట్లకు ఉపయోగపడేలా బిజెపి పాలన సాగిస్తోందని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మనేకుర్తి వద్ద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రైతులు తనను కలిశారని, రాజధాని కోసం భూములిస్తే రాజధాని మార్చాలని వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మూడు రాజధానులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అమరావతి రైతుల సమస్య పట్ల తాము చిత్తశుద్దితో ఉన్నామని, రైతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. బిజెపి విభజన రాజకీయాలు చేస్తూ దేశాన్ని ఎక్కడికక్కడ విడదీస్తోందని, అందుకోసమే ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. యాత్రలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
   
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న నేతలు!

2024లో తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర విరామ శిబిరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పటి వరకు 41 రోజులు భారత్ జోడో యాత్ర సాగిందని, ఏపీలో నాలుగు రోజులు యాత్ర సాగిన తరువాత తిరిగి కర్ణాటకలోకి ప్రవేశిస్తుందని, ఆ తరువాత తెలంగాణలో సాగుతుందని తెలిపారు. ఈ యాత్ర ఓట్ల కోసం చేస్తున్న యాత్ర కాదని భారతీయులను ఐక్యం చేసేందుకు చేస్తున్న యాత్రని తెలిపారు. ఏపీలో చాలా సవాళ్లు ఉన్నాయని, యువ నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం పొందుతుందని చెప్పారు. ఆర్థిక అసమానతలు, కుల, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీయటం, ఏక చత్రాధిపత్యంతో రాష్ట్రాల హక్కులను హరించే వాటికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Botsa Anusha Political Entry: రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget