అన్వేషించండి

YSRCP News : జూన్ 3న హైదరాబాద్‌లో వైఎస్ఆర్‌సీపీ ఐటీ విభాగ సదస్సు - పాల్గొనాలంటే ఇలా చేయాలి !

జూన్ 3వ తేదీన హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ విభాగ సదస్సు నిర్వహిస్తున్నారు.


YSRCP News :    వైఎస్సార్సీపీ ఐటీ విభాగం   జూన్ 3వ తేదీ హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్‌తో ఒక భారీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా క‌న్వెన్ష‌న్ హాలులో ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ స‌ద‌స్సు ప్రారంభ‌మ‌వుతుంది.  ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశానికి హైద‌రాబాద్‌ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆహ్వానిస్తున్నారు.  వైసీపీ ఐటీ విభాగం అధ్య‌క్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ సద‌స్సు జ‌రుగుతుంది. ఈ స‌ద‌స్సులో వైసీపీ పార్టీ బ‌లోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి,  ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌లపైన కూలం కుషంగా చ‌ర్చిస్తారు.

 ఈ స‌ద‌స్సుకు వైసీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులంద‌రూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. స‌ద‌స్సుకు హాజ‌రు కాద‌ల‌చిన‌వారు ముందుగా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌న్నారు. వివరాలకు  7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయ‌న సూచించారు. ఎన్నికలు సమీపిస్తూండటంతో వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతుంది. కొద్ది రోజులకిందట బెంగళూరులోనూ ఐటీ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఏపీలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి ఐటీ ఉద్యోగి.. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సునీల్‌ రెడ్డి సూచించారు.
 
రానున్న రోజుల్లో ఐటీ విభాగం పార్టీకి ఏ విధంగా సహాయపడుతుంది, చదువుకునే యువతకు ఉద్యోగుల ద్వారా భవిష్యత్ దిశానిర్దేశం గురించి సునీల్ రెడ్డి ఐటీ ఉద్యోగులకు సమావేశంలో వివరించే అవకాశం ఉంది.  వైసీపీ ఐటీ విభాగానికి 'ఐటీ ఆర్మీ' అని పేరు పెట్టినట్లు ఆయన చెబుతున్నారు.  రానున్న రోజుల్లో  చెన్నై, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి వైసీపీ అనుకూల ఐటీ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశం.. యువకుల ఓటు బ్యాంకుతోపాటు, ప్రజల ఓట్లను సొంతం చేసుకోవడంపై పూర్తి స్థాయిలో వైసీపీ దృష్టి సారించింది.  

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయింది.  ఈ మధ్యలో కరోనా మహమ్మారి రావడం, లాక్‌డౌన్‌ ప్రకటన వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది. ఈ తరుణంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ అందజేశారు. ఇప్పటికీ నెలకు ఒకటి రెండు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల నిధులను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందజేస్తున్నారు. దీంతోపాటు ప్రతిపక్షాల ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు సైతం ఇప్పటికే యాక్టివ్‌ అయ్యారు. ప్రతి ఇంటికీ వెళ్తూ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెబుతున్నారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వైసీపీ చేస్తున్న మంచిని ప్రజలకు చేరువ చేయాలని వైసీపీ ఐటీ విభాగం ప్రణాళికలు రచిస్తోంది.                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget