అన్వేషించండి

YSRCP News : జూన్ 3న హైదరాబాద్‌లో వైఎస్ఆర్‌సీపీ ఐటీ విభాగ సదస్సు - పాల్గొనాలంటే ఇలా చేయాలి !

జూన్ 3వ తేదీన హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ విభాగ సదస్సు నిర్వహిస్తున్నారు.


YSRCP News :    వైఎస్సార్సీపీ ఐటీ విభాగం   జూన్ 3వ తేదీ హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్‌తో ఒక భారీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా క‌న్వెన్ష‌న్ హాలులో ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ స‌ద‌స్సు ప్రారంభ‌మ‌వుతుంది.  ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశానికి హైద‌రాబాద్‌ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆహ్వానిస్తున్నారు.  వైసీపీ ఐటీ విభాగం అధ్య‌క్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ సద‌స్సు జ‌రుగుతుంది. ఈ స‌ద‌స్సులో వైసీపీ పార్టీ బ‌లోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి,  ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌లపైన కూలం కుషంగా చ‌ర్చిస్తారు.

 ఈ స‌ద‌స్సుకు వైసీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులంద‌రూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. స‌ద‌స్సుకు హాజ‌రు కాద‌ల‌చిన‌వారు ముందుగా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌న్నారు. వివరాలకు  7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయ‌న సూచించారు. ఎన్నికలు సమీపిస్తూండటంతో వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతుంది. కొద్ది రోజులకిందట బెంగళూరులోనూ ఐటీ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఏపీలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి ఐటీ ఉద్యోగి.. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సునీల్‌ రెడ్డి సూచించారు.
 
రానున్న రోజుల్లో ఐటీ విభాగం పార్టీకి ఏ విధంగా సహాయపడుతుంది, చదువుకునే యువతకు ఉద్యోగుల ద్వారా భవిష్యత్ దిశానిర్దేశం గురించి సునీల్ రెడ్డి ఐటీ ఉద్యోగులకు సమావేశంలో వివరించే అవకాశం ఉంది.  వైసీపీ ఐటీ విభాగానికి 'ఐటీ ఆర్మీ' అని పేరు పెట్టినట్లు ఆయన చెబుతున్నారు.  రానున్న రోజుల్లో  చెన్నై, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి వైసీపీ అనుకూల ఐటీ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశం.. యువకుల ఓటు బ్యాంకుతోపాటు, ప్రజల ఓట్లను సొంతం చేసుకోవడంపై పూర్తి స్థాయిలో వైసీపీ దృష్టి సారించింది.  

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయింది.  ఈ మధ్యలో కరోనా మహమ్మారి రావడం, లాక్‌డౌన్‌ ప్రకటన వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది. ఈ తరుణంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ అందజేశారు. ఇప్పటికీ నెలకు ఒకటి రెండు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల నిధులను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందజేస్తున్నారు. దీంతోపాటు ప్రతిపక్షాల ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు సైతం ఇప్పటికే యాక్టివ్‌ అయ్యారు. ప్రతి ఇంటికీ వెళ్తూ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెబుతున్నారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వైసీపీ చేస్తున్న మంచిని ప్రజలకు చేరువ చేయాలని వైసీపీ ఐటీ విభాగం ప్రణాళికలు రచిస్తోంది.                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget