అన్వేషించండి

YSRCP News : జూన్ 3న హైదరాబాద్‌లో వైఎస్ఆర్‌సీపీ ఐటీ విభాగ సదస్సు - పాల్గొనాలంటే ఇలా చేయాలి !

జూన్ 3వ తేదీన హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ విభాగ సదస్సు నిర్వహిస్తున్నారు.


YSRCP News :    వైఎస్సార్సీపీ ఐటీ విభాగం   జూన్ 3వ తేదీ హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్‌తో ఒక భారీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా క‌న్వెన్ష‌న్ హాలులో ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ స‌ద‌స్సు ప్రారంభ‌మ‌వుతుంది.  ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశానికి హైద‌రాబాద్‌ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆహ్వానిస్తున్నారు.  వైసీపీ ఐటీ విభాగం అధ్య‌క్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ సద‌స్సు జ‌రుగుతుంది. ఈ స‌ద‌స్సులో వైసీపీ పార్టీ బ‌లోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి,  ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌లపైన కూలం కుషంగా చ‌ర్చిస్తారు.

 ఈ స‌ద‌స్సుకు వైసీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులంద‌రూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. స‌ద‌స్సుకు హాజ‌రు కాద‌ల‌చిన‌వారు ముందుగా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌న్నారు. వివరాలకు  7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయ‌న సూచించారు. ఎన్నికలు సమీపిస్తూండటంతో వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతుంది. కొద్ది రోజులకిందట బెంగళూరులోనూ ఐటీ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఏపీలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి ఐటీ ఉద్యోగి.. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సునీల్‌ రెడ్డి సూచించారు.
 
రానున్న రోజుల్లో ఐటీ విభాగం పార్టీకి ఏ విధంగా సహాయపడుతుంది, చదువుకునే యువతకు ఉద్యోగుల ద్వారా భవిష్యత్ దిశానిర్దేశం గురించి సునీల్ రెడ్డి ఐటీ ఉద్యోగులకు సమావేశంలో వివరించే అవకాశం ఉంది.  వైసీపీ ఐటీ విభాగానికి 'ఐటీ ఆర్మీ' అని పేరు పెట్టినట్లు ఆయన చెబుతున్నారు.  రానున్న రోజుల్లో  చెన్నై, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి వైసీపీ అనుకూల ఐటీ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశం.. యువకుల ఓటు బ్యాంకుతోపాటు, ప్రజల ఓట్లను సొంతం చేసుకోవడంపై పూర్తి స్థాయిలో వైసీపీ దృష్టి సారించింది.  

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయింది.  ఈ మధ్యలో కరోనా మహమ్మారి రావడం, లాక్‌డౌన్‌ ప్రకటన వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది. ఈ తరుణంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ అందజేశారు. ఇప్పటికీ నెలకు ఒకటి రెండు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల నిధులను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందజేస్తున్నారు. దీంతోపాటు ప్రతిపక్షాల ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు సైతం ఇప్పటికే యాక్టివ్‌ అయ్యారు. ప్రతి ఇంటికీ వెళ్తూ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెబుతున్నారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వైసీపీ చేస్తున్న మంచిని ప్రజలకు చేరువ చేయాలని వైసీపీ ఐటీ విభాగం ప్రణాళికలు రచిస్తోంది.                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
AP Politics: జగన్ శాశ్వత మిత్రుడన్న వివాదంతో బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు?
జగన్ శాశ్వత మిత్రుడన్న వివాదంతో బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు?
Pawan Kalyan Comments on Tamil Politics: అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
2026 TVS Jupiter 125 Colors: టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి... 
టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి... 
Embed widget