అన్వేషించండి

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణకు నరసింహ వారాహి గణం - జనసేన చీఫ్ సంచలన నిర్ణయం

Narasimha Varahi Ganam: బీజేపీకి భజరంగ్ దళ్ లాగా జనసేన కు నరసింహ వారాణి గణాన్ని ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు. పవన్ ప్రకటన రాజకీయంగా కీలక మలుపులకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Narasimha Varahi Ganam  to protect Sanatana Dharma soon: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హిందూత్వ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం రకరకాల చర్చలకు కారణం అవుతోంది. నరసింహ వారాహి గణం పేరుతో త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించారు. ఇవి అదికారికంగా జనసేన పార్టీకి  అనుబందంగా ఉన్నట్లుగా ప్రకటించినా ప్రకటించకపోయినా ఆ పార్టీ హిందూత్వ కార్యకర్తలే అందులో ఉంటారని అనుకోవచ్చు. 

భజరంగ్ దళ్ తరహాలో జనసేన నరసింహ వారాహి గణం

ఈ నరసింహ వారాహి గణం ఏం చేస్తుందో పవన్ ఇంకా  ప్రకటించలేదు. కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. బీజేపీకి ఇలాంటి గ్రూప్ భజరంగ్ దళ్ ఉంటుంది. అలాగే అనేక హిందూ సంస్థలకూ బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తుంది. వాటి ఏర్పాటులోనూ కీలంగా వ్యవహరించింది. ఇప్పుడు భజరంగ్ దళ్ తరహాలో పవన్ కల్యాణ్ ఈ నారసింహ వారాహి గణాన్ని నియమించనున్నారని అనుకోవచ్చు. వాటిపై ప్రస్తుతానికి కసరత్తు జరుపుతున్నారని  సనాతన ధర్మ పరిరక్షణకు ఏం చేయాలన్నది విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత కొత్త విభాగాన్ని ప్రకటించి అందులో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు

సెక్యూలర్ పేరుతో హిందూత్వాన్ని కించ పర్చకూడదంటున్న పవన్ 

సెక్యూలర్ అన్న భావనతో హిందూ ధర్మాన్ని విమర్శించడం.. ఇతర మతాల విషయంలో సైలెంట్ గా ఉండటాన్ని పవన్ ప్రశ్నిస్తున్నారు. అన్ని మతాల పట్ల ఒకే రకమైన భావన ఉండాలని ఆయన అంటున్నారు. హిందువుల్లో చాలా మంది హిందూత్వాన్ని విమర్శిస్తూంటారు. హిందూత్వం అని చెప్పుకుంటే తమ వాదం అంటారు. అదే ఇతర మతాల్లో వారు అలాంటి ప్రవచనాలే చెబితే సెక్యూలరిజం అంటారు. ఇలాంటి వివక్షను పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మం అనేది  ప్రజలకు మంచి చేయమనే చెబుతుంది కానీ అంట రాని తనాన్ని ప్రోత్సహించదని పవన్ అంటున్నారు. ఈ క్రమంలో హిందూత్వానికి ముప్పు  ఉందని ఆయన భావిస్తున్నారు. 

Also Read: YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు

అందుకే తిరుపతి లడ్డూల అంశం వచ్చినప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. అందులో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేకమైన బోర్డు జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. పవన్ కల్యాణ్ ఇలా వ్యూహాత్మకంగా ఒక దాని తర్వాత ఒకటి హిందూత్వ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నారసింహ వారాహి గణం ఏర్పాటైన తర్వాత రాజకీయంగానూ ఈ అంశం కలకలం రేపే అవకాశం ఉంది.     

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget