అన్వేషించండి

Pulivendula YSRCP: పులివెందుల కౌన్సిలర్లకు అవినాష్ రెడ్డి బుజ్జగింపులు - బిల్లుల కోసం కోర్టులో పోరాటం చేద్దామని భరోసా

YSRCP : బిల్లులు రాలేదని ఆందోళన చెందుతున్న పులివెందుల వైసీపీ కౌన్సిలర్లకు ఎంపీ అవినాష్ రెడ్డి సర్ది చెప్పారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే న్యాయపోరాటం చేద్దామని సలహా ఇచ్చారు.

MP Avinash Reddy Meeting Wiht the YCP councilors of Pulivendula : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పులివెందులకు ప్రత్యేకమైన అభివృద్ధి అధారిటీ ఏర్పాటు చేశారు. ఆ అధారిటీ కేంద్రంగా వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని కౌన్సిలర్లే కాంట్రాక్టులు తీసుకుని చేపట్టారు. పనులు వేగంగా చేపట్టారు. అయితే ఎన్నికలకు ముందు వారికి బిల్లులు ఇవ్వలేదు. మరోసారి వైసీపీనే గెలుస్తుందని.. ఆ తర్వాత బిల్లులు మంజూరు చేస్తామని వైసీపీ అగ్రనేతలు చెప్పడంతో వారంతా మిన్నకుండిపోయారు. వైసీపీ ఓడిపోవడంతో వారికి బిల్లులపై ఆందోళన ప్రారంభమయింది. 

ఇటీవల జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనూ వారు జగన్మోహన్ రెడ్డిని బిల్లుల కోసం ప్రత్యేకంగా ప్రశ్నించినట్లుగా ప్రచారం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన  అభివృద్ధి పనులకు సంబంధిచి రెండు వందల యాభై కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్న విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన సన్నిహితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని.. గతంలో తమ ప్రభుత్వం  టీడీపీ కార్యకర్తలు చేపట్టిన పనులకు కూడా బిల్లులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు బిల్లులు ఇవ్వకపోతే కోర్టుకు అయినా వెళ్లి పోరాడదామని భరోసా ఇచ్చారు.                                       

జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డితో మహిళా కౌన్సిలర్లు సమావేశమై..బిల్లులు ప్రస్తావన తెచ్చరని చెబుతున్నారు. తమ ఆస్తులు తాకట్టు పెట్టినా అప్పు తీరదని బిల్లులు రాకపోతే సంక్షోభంలో కూరుకుపోతామని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే  ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఏమీ చేయలేమని న్యాయపోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని పులివెందుల కౌన్సిలర్లకు జగన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు తాము ఆర్థిక సాయం చేయలేమని అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి కౌన్సిలర్లతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.  అందరి సమస్యలనూ జగన్ తెలుసుకున్నారని .. న్యాయపోరాటం చేసి అయినా బిల్లులు ఇప్పిస్తారని అధైర్యపడవద్దని కోరినట్లుగా తెలుస్తోంది.                     

అయితే బిల్లుల కోసం అయినా కొంత మంది కౌన్సిలర్లు పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారని  పులివెందులలో ప్రచారం జరుగుతోంది. కొంత మంది కౌన్సిలర్లు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలియడంతోనే అవినాష్ రెడ్డి కౌన్సిలర్లతో భేటీ అయ్యారని.. పార్టీ మార్పు లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని  చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక పరమైనసమస్యలను పరిష్కరిస్తామని బుజ్జగించినట్లుగా చెబుతున్నారు. ముందుగానే బిల్లులు చెల్లించకపోవడంతో వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jack Twitter Review - జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Ramya Moksha Kancharla: మేమూ హిందువులమే... గొర్రె బిడ్డలంటూ ట్రోల్ చేస్తున్నారు... అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీలో రమ్య క్లారిటీ
మేమూ హిందువులమే... గొర్రె బిడ్డలంటూ ట్రోల్ చేస్తున్నారు... అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీలో రమ్య క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP DesamKKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jack Twitter Review - జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Ramya Moksha Kancharla: మేమూ హిందువులమే... గొర్రె బిడ్డలంటూ ట్రోల్ చేస్తున్నారు... అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీలో రమ్య క్లారిటీ
మేమూ హిందువులమే... గొర్రె బిడ్డలంటూ ట్రోల్ చేస్తున్నారు... అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీలో రమ్య క్లారిటీ
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
IPL 2025 GT VS RR Result Update: టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Embed widget