అన్వేషించండి

Ysrcp Mla Vasantha: కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా - వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Andhra Politics: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన ఆదివారం తెలిపారు.

Ysrcp Mla Vasantha Comments on His Political Future: వైసీపీ‍(Ycp)ని వీడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిక్కెట్లు దక్కలేదని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు వైసీపీని వీడగా, వారి బాటలోనే మరో కీలక ఎమ్మెల్యే వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో మైలవరం(Mylavaram) సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను ఇంఛార్జీగా నియమించారు. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (Vasantha Krishna Prasad) పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. సోమవారం కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చెబుతానని ఆయన స్పష్టం చేశారు. 

తెలుగుదేశం గూటికేనా..

మైలవరం టిక్కెట్‌పై తొలి నుంచి వివాదం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నా... నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) పెత్తనం ఎక్కువ అవ్వడంపై ఆయన పలుమార్లు సీఎం జగన్( Jagan) దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండు గ్రూప్‌లు పలుమార్లు గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రావెల్, ఇసుక తవ్వకాల్లో ఆధిపత్య పోరు పెచ్చు మీరడంతో, వైసీపీ అధిష్ఠానం ఇద్దరినీ పలుమార్లు మందలించింది. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీఎం జగన్ సీరియస్‌గా తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అలకబూనారు. కొన్నిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సీటుపైనా స్పష్టత ఇవ్వకపోవడంతో కొన్ని నెలల క్రితమే వసంత తెలుగుదేశం( Tdp) నేతలకు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. మంత్రి జోగి రమేశ్‌కు పెనమలూరు టిక్కెట్ కన్ఫార్మ్ చేసినా... మైలవరం టిక్కెట్‌పై జగన్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వసంత కృష్ణప్రసాద్‌ను మరింత ఆగ్రహానికి గురి చేసింది.

ముహూర్తం ఖరారు

పార్టీని వీడాలా వద్దా అన్న మీమాంసలో ఉన్న వసంత కృష్ణప్రసాద్‌కు ఇటీవల వైసీపీ విడుదల చేసిన జాబితాలో మైలవరం ఇన్‌ఛార్జిగా తిరుపతిరావు యాదవ్‌ను ప్రకటించడంతో ఇక తనదారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సమావేశమైన ఆయన వారికి తేల్చి చెప్పినట్లు తెలిసింది. సోమవారం స్వగ్రామం ఐతవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. రాజకీయంగా తమ కుటుంబానికి ఎప్పటి నుంచో అండగా ఉన్న వారి అభిప్రాయాలు తీసుకుని ఏ పార్టీలోకి వెళితే భవిష్యత్ ఉంటుందో వారితో చర్చించనున్నారు. వారందరి అభిప్రాయలు తీసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే వసంత కృష్ణప్రసాద్‌ ఎప్పటి నుంచో తెలుగుదేశం( Tdp) నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయనకు టిక్కెట్ ఇచ్చినా పార్టీని వీడటం ఖాయమని తెలిసిన తర్వాతే జగన్ మైలవరం ఇన్‌ఛార్జిని మార్చడం జరిగిందనేది వైసీపీ నాయకుల వాదన. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మైలవరంలో పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ( Devineni Uma) ఉన్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగానూ ఇరువురి వర్గాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్‌ తెలుగుదేశంలోకి వస్తే, మైలవరం టిక్కెట్టే కేటాయిస్తారా లేక మరేదైనా సీటు ఇస్తారా అన్నది సస్పెన్సే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget