అన్వేషించండి

Khammam Politics: ఖమ్మం కారులో రాజకీయ వేడి - టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకున్నా పోటీకి సీనియర్లు సై !

TRS Ponguleti Srinivas Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లా కారులో రాజకీయ వేడి రగులుకుంది.. అధికార టీఆర్‌ఎస్‌లో మాజీలు, ముఖ్య నేతలు పోటీకి సై అంటున్నారు.

Khammam TRS Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లా కారులో రాజకీయ వేడి రగులుకుంది.. అధికార టీఆర్‌ఎస్‌లో మాజీలు, ముఖ్య నేతలు పోటీకి సై అంటున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీలో చర్చకు దారి తీశాయి. తాజాగా తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్‌లో సమావేశమయ్యారు. పాలేరు నుంచే పోటీ చేసేలా తుమ్మలను ఒత్తిడి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గ కేంద్రంగా రాజుకున్న రాజకీయ వేడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ రగులుతోంది. పార్టీ నుంచి టికెట్‌ రాకున్నా పోటీకి సై అంటూ మాజీలు ఇస్తున్న సంకేతాలతో వారి అనుచర గణం, నేతల్లో జోష్‌ నెలకొంది. జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి కలిసి పనిచేయాలని, పార్టీ అధిష్టానం కూడా ఇద్దరికీ సముచిత స్థానం కల్పిస్తే బాగుంటుందనే చర్చ సాగుతోంది. 
ముందస్తు ప్రచారంతో జనంలోకి నేతలు..
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం సాగుతుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు దూకుడు పెంచారు. దీంతో వారి అనుచరులు, కేడర్‌ కూడా ఇదే స్థాయిలో నియోజకవర్గంలో కార్యక్రమాల జోరు పెంచింది. పక్షం రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు ప్రభుత్వ అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తుండగా.. మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పరామర్శలు, సొంత కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. ముందస్తు ఎన్నికల వేడితో ఇప్పటి నుంచే పోటీకి సై అంటున్న వారంతా కార్యాచరణకు దిగారు. అంతేకాకుండా పార్టీ టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకున్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్తామంటూ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు.
పాలేరు నుంచి మొదలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి గళం ఇప్పుడిప్పుడే బహిరంగ వేదికలకు ఎక్కే స్థాయికి చేరింది. తిరుమలాయపాలెంలో మాజీ ఎంపీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర పార్టీలో కూడా చర్చ జరిగింది. ‘ముళ్లు గుచ్చుకుంటున్నా ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నా, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రజాతీర్పు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అంతేకాకుండా ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాలు కూడా తనతో సంప్రదింపులు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో పొంగులేటి తన దూకుడు పెంచారని రాజకీయంగా విశ్లేషణ జరుగుతోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్‌గా ఉన్నా.. టికెట్‌ దక్కలేదని, ఈసారి తాడో పేడో తేల్చుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తేనే పొంగులేటికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అనుచరులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన మనోగతాన్ని వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా పాలేరు కేంద్రంగా పార్టీ అధిష్టానానికి పొంగులేటి తన నిర్ణయమేంటో చెప్పకనే చెప్పారని, ఇక పార్టీనే తేల్చుకోవాల్సి ఉంటుందని ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.
ఆత్మీయ సమావేశాలతో తుమ్మల..
పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరులు ఖమ్మంలోని జూబ్లీక్లబ్‌లో సమావేశమయ్యారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో పార్టీలోని నేతల కుట్రల వల్లే తుమ్మల ఓడిపోయారని, ఈసారి అక్కడినుంచే తుమ్మల పోటీ చేసేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని చర్చించుకున్నారు. అయితే ఈ సమావేశానికి మాజీమంత్రి తుమ్మల దూరంగా ఉన్నారు. ఆయన వెంట ఉన్న అనుచర నేతలే సమావేశంలో తుమ్మల భవిష్యత్‌ రాజకీయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఇటీవల సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల వర్గం.. తుమ్మల వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో తుమ్మల వర్గం తమ కార్యాచరణను నియోజకవర్గంలో వేగవంతం చేసింది. తుమ్మలతోపాటు ఆయన తనయుడు యుగంధర్‌ను ఆహ్వానిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుమ్మలకు టికెట్‌ ఇస్తారనే విశ్వసిస్తూ.. మరోవైపు టికెట్‌ ఇచ్చినా ఇవ్వకున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేలా ఒత్తిడి తేవాలని ఆయన అనుచరగణం జూబ్లీక్లబ్‌ వేదికగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి, తుమ్మల ఇద్దరు కలిసి అడుగేస్తే పార్టీకి జిల్లాలో తిరుగుండదనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. ఇద్దరు నేతలకు పార్టీ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చర్చించినట్లు తెలిసింది.
అన్నిచోట్లా అసమ్మతి గళం..
అధికార టీఆర్‌ఎస్‌లో సత్తుపల్లి, మధిరలోనూ అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఇటీవల తల్లాడలో ఎమ్మెల్యే సండ్రకు వ్యతిరేకంగా తుమ్మల, పొంగులేటి అనుచర నేతలు సమావేశమైన విషయం విదితమే. మధిరలోనూ పొంగులేటి అనుచరగణం జెడ్పీ చైర్మన్, ఆయన అనుంగు కేడర్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటోంది. ఇక వైరా నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ వర్గం ఎమ్మెల్యే రాములునాయక్‌ వర్గంతో విభేదించి కార్యక్రమాలు చేపడుతోంది. నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌తోపాటు పొంగులేటి వర్గం కూడా సై అంటే సై అంటోంది. ఇలా తమ నేతలు చేస్తున్న ప్రకటనలు, సంకేతాలకు అనుగుణంగా కేడర్‌ క్షేత్రస్థాయిలో కదం తొక్కుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget