అన్వేషించండి

Nadendla Manohar: 'వాలంటీర్ల వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా?' - ఏపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు

Andhrapradesh Politics: ఏపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.

Nadendla Manohar Slams Ysrcp Government on Volunteer System: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేక బాధ పడుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై ఏనాడైనా సీఎం జగన్ మాట్లాడారా.? అని ప్రశ్నించారు. 'వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి జనసేనాని పవన్ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ప్రతి ఏడాది రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తుండగా.. దానిలో రూ.617 కోట్ల డేటా సేకరణ కోసం కేటాయించారు. ఇంటింటి సమాచారం సేకరించాలని వారికి ఎవరు చెప్పారు.? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా.? అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు.?. ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పకుండా మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. జనసేన పార్టీకి వాలంటీర్లపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు.' అని స్పష్టం చేశారు. కాగా, పవన్ గతంలో వాలంటీర్లను కించపరిచేలా వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపైనే తాజాగా నాదెండ్ల స్పందించారు.

ఇదీ జరిగింది

గత ఏడాది జులై 9న ఏలూరులో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో సుమారు 29 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు సమాచారం తెలిసిందన్నారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళ అదృశ్యం వెనుక వాలంటీర్ల పాత్ర ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వాలంటీర్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంత మంది సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని, వారి ద్వారా వల వేసి అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్‌ అప్పట్లో వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం వాటిలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా పవన్‌పై కేసు దాఖలు చేసింది. 

ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలకంగా పని చేస్తున్నారని, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పవన్‌ వ్యాఖ్యలున్నాయని ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వంపై కావాలనే బురదజల్లేలా పవన్ మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. అంతకు ముందు జులై 20న పవన్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు 20న ఉత్తర్వులిచ్చింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీరు బి.పవన్‌కుమార్‌తో పాటు మరికొంత మంది ఇచ్చిన వాంగ్మూలం మేరకు పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మార్చి 25న విచారణ

పవన్ పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు దాఖలు చేయగా.. జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు మార్చి 25న పవన్‌ కల్యాణ్ విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు నోటీసులిచ్చారు. 

Also Read: Ganta Srinivasa Rao comments: జగన్‌కి బై బై చెప్పాలి, విశాఖ రక్షించుకోవాలి: మాజీ మంత్రి గంటా

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Capital Strategy: రాజధానిపై వైసీపీ సెల్ఫ్ గోల్ - వ్యూహకర్తల వైఫల్యమా.. జగన్ మొండితనమా?
రాజధానిపై వైసీపీ సెల్ఫ్ గోల్ - వ్యూహకర్తల వైఫల్యమా.. జగన్ మొండితనమా?
YSRCP ON AMARAVATI: మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
MAVIGUN: అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే..  --జగన్
అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే.. !  
Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP ON AMARAVATI: మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
Hyderabad Gold Man Vijay Kumar: ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
ఆరేళ్ల క్రితం లక్షలు.. ఇప్పుడు కోట్లు! మొదటిసారి తన ఒంటిపై బంగారం లెక్కలు చెప్పిన గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్!
Happy Hanuman Jayanti 2026 Wishes in Telugu: హనుమాన్ జయంతి - మీ బంధు మిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
హనుమాన్ జయంతి - మీ బంధు మిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
Daily Shower in Summer : వేసవిలో స్నానం చేయడం మానేయకండి.. రోజూ చల్లటి నీటితో ఉదయం, సాయంత్రం చేస్తే కలిగే లాభాలివే
వేసవిలో స్నానం చేయడం మానేయకండి.. రోజూ చల్లటి నీటితో ఉదయం, సాయంత్రం చేస్తే కలిగే లాభాలివే
2026 ఏప్రిల్ 2 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 ఏప్రిల్ 2 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
IPL 2026 DC VS LSG Result Update: ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ! రాణించిన స‌మీర్, స్ట‌బ్స్, ఎంగిడి, న‌ట‌రాజ‌న్.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ల‌క్నో బోల్తా!
Cabinet Committee Security Meeting: పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రధానమంత్రి మోదీ కీలక సమావేశం!
పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రధానమంత్రి మోదీ కీలక సమావేశం!
Kerala Elections: కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య చీకటి ఒప్పందం - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య చీకటి ఒప్పందం - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
Embed widget