అన్వేషించండి

Meters For Motors : మోటార్లకు మీటర్లతో రాజకీయ సాహసం - రైతులు వ్యతిరేకిస్తే మొదటికే మోసం ! జగన్ ఎందుకు రిస్క్ చేస్తున్నారు ?

మోటార్లకు మీటర్లు పెట్టి తీరాలని నిర్ణయించడం ద్వారా జగన్ రాజకీయ రిస్క్ చేస్తున్నారు. రైతుల్ని కన్విన్స్ చేయలేకపోతే రాజకీయ నష్టం తీవ్రంగా ఉంటుంది.

 

Meters For Motors : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు మోటార్‌కు మీటర్ పెట్టాల్సిందేనని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే ఉరితాడు బిగించడమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా అదే చెబుతోంది. ఏపీ ప్రభుత్వంలా తాము రైతుల మెడకు ఉరి తాళ్లు వేయడం లేదని అక్కడి రైతులకు తాము ఎంత మంచి చేశామో చెబుతోంది. మీటర్లు పెడితే బిల్లులొస్తాయి..బిల్లులు వస్తే కట్టాల్సింది రైతులే. మోటార్లు కాలిపోయినా.. మరో సమస్య వచ్చినా తంటాలు పడాల్సింది రైతులే. నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా సమయానికి ఇవ్వకపోతే.. రైతుల ఖాతాలోనే బాకీ ఉంటుంది. ఈ ఆందోళనల నడుమ రైతులు కూడా ఇప్పటిదాకా లేని మీటర్ల గొడవ ఇప్పుడెందుకని రైతులు కూడా అనుకుంటున్నారు. అయితే సీఎం  మాత్రం మీటర్లు పెట్టాల్సిందేనని అంటున్నారు. రాజకీయంగా ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారోనన్న  సందేహం వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో వినిపిస్తోంది. 

వంద శాతం మీటర్ల ఏర్పాటు దిశగా ఏర్పాట్లు !

 రాష్ట్ర వ్యాప్తంగా 18,61,302 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించారు. ఇందులో ఎపిడిసిఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,61,302 మీటర్లు, సిపిడిసిఎల్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో ఐదు లక్షల మీటర్లు, ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో 11 లక్షల మీటర్లు బిగించనున్నారు.  అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,92,980 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.   మొత్తం ప్రాంతాల వారీగా చూస్తే అత్యధికంగా రాయలసీమలోనే ఎక్కువ మీటర్లు  పెట్టనున్నారు. ఇప్పటికి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మీటర్లను అమర్చారు.  సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మీటర్లను ఏర్పాటుచేస్తే కొంత అదనపు రుణాన్ని కూడా ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించింది. దానికి అపీ ప్రభుత్వం అంగీకరించింది. అప్పులు తెచ్చుకుంటోంది. తప్పని సరిగా సంస్కరణలు అమలు చేస్తేనే పెండింగ్‌లో ఉన్న అప్పులు వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్ల ఏర్పాటు పూర్తి  చేయాలనుకుంటున్నారు. 

మీటర్లు పెడితే బిల్లులు వచ్చేది రైతుల పేరు మీదనే - బాకీ వాళ్లదే !
  
రైతుల మోటార్లకు మీటర్లు పెడితే  బిల్లులు కూడా వారే కట్టుకోవాలి. ప్రభుత్వం రీ ఎంబర్స్ చేస్తుంది. అంటే ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసి  ఎంత కరెంట్ వినియోగిస్తే.. అంత డబ్బులిస్తామంటున్నారు.  నెలవారీ బిల్లు మొత్తాన్ని ముందుగానే రైతు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం నుంచి అందుకున్న మొత్తాన్ని రైతు తిరిగి విద్యుత్ కంపెనీకి చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతులకు స్పష్టమవుతుంది. ఇది రైతుల్లో ఆందోళనకు కారణయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుందో  అన్న ఆందోళన సహజంగానే వస్తుంది. గ్యాస్ బండకు సబ్సిడీ ఎలా నగదు బదిలీ చేస్తున్నారో ఇప్పుడు కళ్ల ముందే ఉంది. సిలిండర్ ధర రూ. వెయ్యి దాటిపోయింది. ఇచ్చే సబ్సిడీ రూ. నలభైకు పడిపోయింది. నగదు బదిలిలో ఉండే మ్యాజిక్ అది.   ప్రభుత్వాలు… పథకాలకు బదులు తాము ఎందుకు నగదు బదిలీ చేయాలని కోరుకుంటాయో.. ఇదో పెద్ద ఉదాహరణ. ఈ గ్యాస్ సబ్సిడీనే… కేస్ స్టడీగా తీసుకుంటే… ఆంధ్రప్రదేశ్ రైతులు … నగదు బదిలీ  అంటే భయపడుతున్నారు. పైగా ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగుల జీతాలే సరిగ్గా ఇవ్వడం లేదని.. కరెంట్ బిల్లులు ఎక్కడ ఇస్తుందని వారు సందేహంలో ఉన్నారు.

రైతులకు సెంటిమెంట్ ఉచిత విద్యుత్ !  
 
ఉచిత విద్యుత్ పథకం.. ఏపీలో ఓ ట్రెండ్ సెట్టర్ లాంటిది. 2004లో వైఎస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉచిత విద్యుత్. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని.. ఆరు గంటలు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తామని.. అదే సమయంలో.. రైతుల బోర్లకు మీటర్లే బిగించబోమని హామీ ఇచ్చారు. ఇది రైతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఆయన ఘన విజయం సాధించారు. ఈ ఉచిత విద్యుత్ పథకం జోలికి తర్వాత ఏ ప్రభుత్వమూ వెళ్లలేదు. రైతుల్లో వచ్చిన ఆదరణ చూసి.. ఇంకా ఎక్కువ సమయం ఇస్తామని చెప్పడం ప్రారంభించాయి. అలాంటి ఫ్లాగ్ షిప్ పథకంలో జగన్మోహన్ రెడ్డి మార్పులు చేస్తున్నారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించారు.
 
రైతుల్లో వ్యతిరేకత వస్తే వైఎస్ఆర్‌సీపీకీ తీవ్ర నష్టం...!

తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఇప్పుడు.. ఉచిత విద్యుత్ పథకాన్ని మార్చేసి.. నగదు బదిలీగా చేస్తున్నారు. విద్యుత్ సబ్సిడీలను పెద్ద ఎత్తున ఇస్తున్న ప్రభుత్వం.. వాటిని డిస్కంలకు తిరిగి చెల్లించడం లేదు. దాంతోనే సమస్య వచ్చింది. విద్యుత్ కంపెనీలకే కట్టని ప్రభుత్వాలు.. ఇక నేరుగా ఎలా రైతుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తాయన్నది ఊహించలేని విషయం. ప్రభుత్వం నగదు బదిలీ చేయకపోతే… రైతులే కట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత కామన్‌గా పెరుగుతింది. ఓ రకంగా ఈ పథకం అమలు సవాల్ లాంటిదే. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Abbas Re Entry: 'ప్రేమ దేశం' అబ్బాస్ రీ ఎంట్రీ... 11 ఏళ్ళ తర్వాత 'హ్యాపీ రాజ్'తో - లుక్కు చూశారా?
'ప్రేమ దేశం' అబ్బాస్ రీ ఎంట్రీ... 11 ఏళ్ళ తర్వాత 'హ్యాపీ రాజ్'తో - లుక్కు చూశారా?
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Abbas Re Entry: 'ప్రేమ దేశం' అబ్బాస్ రీ ఎంట్రీ... 11 ఏళ్ళ తర్వాత 'హ్యాపీ రాజ్'తో - లుక్కు చూశారా?
'ప్రేమ దేశం' అబ్బాస్ రీ ఎంట్రీ... 11 ఏళ్ళ తర్వాత 'హ్యాపీ రాజ్'తో - లుక్కు చూశారా?
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్
వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్
Nora Fatehi Car Accident: హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
Embed widget