అన్వేషించండి

Srikakulam Politics: సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?

YSRCP: శ్రీకాకుళం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇంచార్జ్ పదవుల్ని మార్చాలని జగన్ నిర్ణయించారు. చురుగ్గా పని చేసేవారికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు.

Srikakulam YSRCP:  శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చిన అధినేత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ నియోజకవర్గ నేతనుమారుస్తారోనన్న ఉత్కంఠ పార్టీ క్యాడర్ లో నెలకొంది. 2024 సార్వత్రికఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు శ్రీకాకుళం,నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, పాతపట్నం ,ఆమదావలస, ఎచ్చెర్ల శాసనసభ స్థానాలలో కూడా ఓటమి చవిచూసింది. 

పార్టీ  నాయకత్వంలో వరుసగా మార్పులు 

ఎన్నికలలో పోటీ చేసిన నేతలే పార్టీ ఇన్ చార్జీలుగా ఉండేవారు.రాష్ట్రంలో వైకాపా ఘోర ఓటమి చెందడానికి గల కారణాలపై అధినేతజగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ నుతీసుకున్నారు. అథైర్యపడవద్దని 2029 ఎన్నికలలో ఖచ్చితంగాగెలిచితీరుతామని అందుకోసం ఇప్పటి నుంచే పనిచేయాలని కూడా నేతలకి ఆయన దిశా నిర్దేశం చేసారు. అంతేకాకుండా వైకాపాబలోపేతం కోసం చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా వైకాపా అధ్యక్షుడుగా నాల్గవ సారి ధర్మాన కృష్ణదాస్ ను నియమించారు. అలాగే సీనియర్ లీడర్ తమ్మినేని సీతారాంని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గ నాయకులతో కలసి కార్యవర్గాన్ని ఏర్పాటుచేయడంతో పాటు అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.    

తమ్మినేని సీతారాంకు షాక్ ఇచ్చిన జగన్ 

టెక్కలినియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎంఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ ను తొలుత తొలగించి ఆయన స్థానంలో ఆ నియోజకవర్గానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ ను కొత్త సమన్వయకర్తగా నియమించారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చకెక్కడం, దానిపై పెద్ద ఎత్తున విమర్శలు హెూరెత్తడంతో అధినేత ఆయనను తొలగించి తిలక్ కి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను తప్పించి అక్కడ సమన్వయకర్తగా వైకాపా యువనాయకుడు చింతాడ రవికుమార్ ను నియమించారు. 2014-19 మద్య వైకాపా ప్రతిపక్షంలో ఉండగా తమ్మినేని సీతారాం ఆముదాలవలసలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారు. నిరంతరం ప్రజల మద్య ఉంటూ నియోజకవర్గ వాసుల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ కారణంగా ఆయన 2019లో విజయం సాధించగా సీనియార్టీని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆయనకి శాసనసభ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనుసరించిన విధానాలను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించి 2024 ఎన్నికలలో గంపగుత్తగా ఎన్ డిఏ కూటమి అభ్యర్థులకి ఓట్లు వేయడంతో వైకాపాకి గట్టి దెబ్బతగిలింది. అందరితో పాటే తమ్మినేని సీతారాం సైతం ఓటమి పాలయ్యారు. అయినా కూడా ఆమదాలవలస నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ముందుకు సాగుతూ వచ్చారు. అయితే ఎవ్వరూ ఊహించని విదంగా ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగాచింతాడ రవికుమార్ ను జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ నియామకంపై తమ్మినేని కుటుంబ అభిమానులు, అనుచరులు తీవ్ర నిరాశకి గురయ్యారు. పెద్దాయనను తప్పించి యువకుడుని నియమించడంపై అక్కడ బిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇతర నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయా ? 

జిల్లాలోని టెక్కలి, ఆమదాలవలస రెండు నియోజకవర్గాలు కూడా కీలకమైనవే. కళింగ సామాజిక వర్గం హవా ఉండే ఆ నియోజకవర్గాలలో సమన్వయకర్తలను మార్చివేయడం ఆ సామాజిక వర్గంలో కూడా చర్చణీయాంశంగా మారింది.రెండు నియోజకవర్గాలలో ఇన్ చార్జిలను మార్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకే నియోజకవర్గాలలో కొత్త సమన్వయకర్తలను నియమిస్తారోనని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు.. నెక్స్ట్ ఎవరిని మారుస్తారోనని తొచిన విదంగా మాట్లాడుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని మార్చడం ఖాయమని కొందరు పేర్కొంటున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేసే నాయకులకి అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను అప్పగించనున్న ట్లుగా వారు చెబుతున్నారు. 

కఠిన నిర్ణయాలు తీసుకోనున్న జగన్ 

తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు పెద్దలు అవసరమైన చర్చలు సాగిస్తున్నారని నిత్యం అక్కడి వారితో టచ్ లో ఉండే జిల్లా నేతలు పేర్కొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంటాయని అవి ఒక్కోసారి పార్టీకి మంచి చేస్తుండగా ఒక్కోసారి నష్టం చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబందించి భవిష్యత్ లో ఏమి జరుగుతుందోనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget